నవ్యాంధ్రప్రదేశ్ లో కొలువుదీరిన వైఎస్ జగన్ ప్రభుత్వానికి హిందూ సంప్రదాయాలపై, హిందూ దేవాలయాలపై ఎలాంటి గౌరవం, నమ్మకం లేవని రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. హిందూ దేవాలయాల నుంచి వస్తున్న డబ్బును ఇతరాత్ర మతాలకు, మత ప్రార్థనా మందిరాలకు వెచ్చించడంపై ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల సొమ్మును చర్చీలకు రూ.24 కోట్లు, దర్గాలకు రూ.5 కోట్ల కేటాయించడం ఎంతమవరకు సమంజసమని ఆయన నిలదీశారు. రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి చెందాల్సిన డబ్బును చర్చీల నిర్మాణాలకు, దర్గాల పునరుద్దరణకు ఎలా కేటాయిస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రభుత్వ హయాంలో దేవాదాయ శాఖ తీరు అందోళనకరంగా వుందన్నారు.
రాష్ట్రంలో అనేక ఆలయాలు జీర్ణావస్థలో ఉన్నాయని, వాటి పునురద్దరణకు ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ఖజానాకు వస్తున్న నిధులులో హిందువుల నుంచే అధిక నిధులు వస్తున్ాయయన్న విషయాన్ని సీఎం, ప్రభుత్వం మర్చిపోయారా.? అని ఆయన నిలదీశారు, పుష్కరాల పేరుతో చంద్రబాబు హయాంలో అనేక ఆలయాలను పడగొట్టారని గుర్తు చేసిన సోమువీర్రాజు... అప్పుడు బీజేపీలో ఉన్న ప్రస్తుత దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. పడగొట్టిన ఆలయాలను మళ్లీ కట్టాలని డిమాండ్ చేశారని కూడా ఆయన గుర్తుచేశారు. అయితే ఇప్పుడు అదే నేత మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ దర్గాలను కడతామని ప్రకటించడం ఎంతవరకు సమంజసమని ఆయనకే తెలియాలని విమర్శించారు.
దేవాలయాల భూములను ఇళ్ల స్థలాలకు, ఆలయాల నిధులను ఇతర కార్యక్రమాలకు వాడుతున్నారని సోము వీర్రాజు దుయ్యబట్టారు. దేవాలయాలను నిర్వీర్యం చేస్తున్న మంత్రి వెల్లంపల్లి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హిందువులపై ముఖ్యమంత్రికి నిజంగా గౌరవం, ప్రేమ ఉంటే వెల్లంపల్లిని తక్షణం మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు, రాష్ట్రంలో ఉన్న చర్చిలకు వేల కోట్ల ఆదాయాలున్నాయని... జగన్ కు దమ్ముంటే వాటి నుంచి డబ్బులు తీసుకుని ఖర్చు చేయాలని సవాల్ విసిరారు. జగన్ కు చర్చిలు, దర్గాలు మాత్రమే కావాలా? ఆలయాలు అవసరం లేదా? అని ప్రశ్నించారు. రేపు అమరావతిలో జరిగే బహిరంగసభకు బీజేపీ మద్దతు ప్రకటిస్తోందని... ఆ కార్యక్రమంలో బీజేపీ ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more