తెలంగాణ ఉద్యమ నేత నుంచి ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని రెండో పర్యాయం అధిరోహించేంత వరకు కూడా తనకు రాష్ట్రంలో తిరుగులేదని భావించిన సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డిల నుంచి మాత్రమే కొంత వ్యతిరేక, విమర్శనాత్మక స్వరాలు వినిపించాయి, కానీ ఆ తరువాత జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ నేతల కంటే అధికంగా బీజేపి నేతల గళాలు వినబడుతున్నాయి, వారిలో నిజామాబాద్ ఎంపీ దర్మపురి అరవింద్ పేరు చెబితేనే ఇప్పుడు టీఆర్ఎస్ నేతలు నిమ్మకుండిపోతున్నారు. ఆయన నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ తో పాటుగా ఏకంగా కల్వకుంట్ల కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు.
ఇటీవల కరోనా లాక్ డౌన్ తరువాత అన్ లాక్ ప్రారంభమైన నేపథ్యంలో జూన్ మాసంలో ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన విద్యుత్ బిల్లులను నెలవారీ స్లాబులతో పాటు కాకుండా మూడు నెలల మొత్తం యూనిట్లకు కలసి బిల్లులను విద్యుత్ శాఖ జారీ చేయడంతో ఇది అన్యాయమని బిల్లులను చేతబట్టి ఆయన నడిరోడ్డుపై బైఠాయించి తమ నిరసను వ్యక్తం చేశారు. ఆ సందర్భంగా ఆయన ఏకంగా ముఖ్యమంత్రి ఫ్యామిలీపై హోల్ సేల్ గా తింటున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. తండ్రి, కూతురు, కొడుకు, అల్లుడు అంటూ అందర్నీ విమర్శించారు. బంగారు తెలంగాణ పేరుతో ప్రజలను మభ్యపెడుతూ రెండో సారి ముఖ్యమంత్రి పగ్గాలను అందుకున్న కేసీఆర్ కు తన కుటుంబంమే తప్ప రాష్ట్ర ప్రజలు కష్టనష్టాలు పట్టడం లేదంటూ విరుచుకుపడ్డారు.
కరోనా కారణంగా లాక్ డౌన్ తో రాష్ట్రంంలోని ప్రజలు తమ ఉపాధి, ఉద్యోగాలు పోయాయని బాధపడుతున్న సమయంలో వారికి అండగా నిలిచి అదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. వారిపైనే అదనపు విద్యుత్ బారాలను వేస్తోందని ధ్వజమెత్తారు. కాగా, ఆ వీడియో తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఇప్పుడు నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా బీజేపి శ్రేణులు, పార్టీ కార్యకర్తలు అరవింద్ కు సంబంధించిన పాత వీడియోను షేర్ చేసుకోవడంతో నెట్టింట్లో ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే అరవింద్ ప్రశ్నలకు కూడా కౌంటర్లు పడుతున్నాయి, అంతర్జాతీయంగా క్రూడ్ అయిల్ ధరలు తగ్గినా.. అన్ లాక్ నేపథ్యంలో రోజువారీగా ఇంధన ధరలపై ఎక్సైజ్ పన్నును పెంచుతూ లీటరు ధర ఎనబై ఐదు రూపాయలకు చేర్చింది కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం కాదా.. అన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more