ఇందుగలడు అందుగలడన్న సందేహము వలదు చక్రి సర్వోపగతుండు.. ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే!.. అనిశ్రీమద్భాగవతంలోని భక్త ప్రహల్లాదలో పోతన రచించిన ఈ పద్యవాఖ్యము ఎంతటి సత్యమో శ్రీమహావిష్ణు అవతారమైన నరసింహస్వామి అప్పుడే ఆ ఇతివృత్తంతంలో స్పష్టంగా కనిపించి చెప్పాడు. కాగా తాజాగా ఈ తరానికి కూడా ఆయన మరో రూపంలో క్లారిటీని ఇచ్చారు. పూర్తిగా ఇస్లామిక్ మతఛాందస దేశంగా ముద్రపడి ఐక్యరాజ్య సమితిలోనూ పరాభవాలను చవిచూస్తున్న పాకిస్థాన్ లో ఇప్పటికే పలు చారిత్రక నేపథ్యమున్న హిందూ దేవాలయాలు వున్నాయి. వీటిలో కొన్నింటికి మాత్రమే అక్కడి హిందువులు పూజలు నిర్వహిస్తుండగా, అనేక ఆలయాలు దూప, దీప నైవేధ్యాలకు కూడా దూరంగా వున్నాయి.
ఇలాంటి క్రమంలోనే అత్యంత పూరతనమైన శ్రీమహా విష్ణువుకు చెందిన హిందూ దేవాలయం ఒకటి తాజాగా జరుపుతున్న తవ్వకాల్లో బయటపడింది. పాకిస్థాన్ లోని వాయువ్య ప్రాంతంలోగల స్వాత్ జిల్లాలోని బారీకోట్ ఘుండాయ్ ప్రాంతంలో ఒక పర్వతం వద్ద పాక్, ఇటాలియన్ పురావస్తు నిపుణులు జరుపుతున్న తవ్వకాల్లో ఈ ఆలయాన్ని కనుగొన్నారు. పాకిస్తాన్ లోని అత్యంత ప్రాముఖత కలిగిన పర్యాటక ప్రదేశాలలో స్వాత్ ఒకటి, ఇక్కడి ప్రకృతి అందాలు, సాంస్కృతిక ప్రదేశాలు ఇట్టే అకర్షిస్తాయి. పురావస్తు ప్రాంతాలకు నెలవుగా మారిన ఈ ప్రాంతంలో దాదాపు 1300 ఏళ్ల క్రితం హిందూ షాహీలు నిర్మించిన విష్ణు దేవాలయమని ఖైబర్ పఖ్తున్ఖ్వా పురావస్తు శాఖ అధికారి ఫజల్ ఖలీక్ తెలిపారు. ఆలయ సమీపంలో కొలను, వాచ్టవర్, కంటోన్మెంట్ ఆనవాళ్లను కూడా కనుగొన్నట్టు వివరించారు.
ఆలయంలో దర్శనానికి వెళ్లే ముందు స్నానం కోసమే ఈ కొలను నిర్మించినట్టు భావిస్తున్నామని అన్నారు. వేలాది పురావస్తు ప్రాంతాలకు స్వాత్ జిల్లా నిలయమని ఖలీక్ వ్యాఖ్యానించారు. హిందూ షాహీల కాలం నాటి నిర్మాణాలు ఈ ప్రాంతంలో బయటపడటం ఇదే తొలిసారని ఆయన పేర్కొన్నారు. ఈ జిల్లాలో పలు బౌద్ధ ఆరామాలు కూడా ఉన్నట్టు పురావస్తు నిపుణులు తెలిపారు. హిందూ షాహీ లేదా కాబుల్ షాహీలు క్రీ.శ.850-1026 ప్రాంతంలో కాబుల్ లోయను పాలించిన హిందూ రాజ వంశం. వారి పాలనా కాలంలో తూర్పు అఫ్ఘనిస్థాన్, గాంధార (ఆధునిక పాకిస్థాన్), వాయువ్య భారతదేశాన్ని కాబుల్ లోయగా పిలిచేవారు. ఇటాలియన్ పురావస్తు మిషన్ హెడ్ డాక్టర్ లూకా మాట్లాడుతూ.. గాంధార నాగరికత, శిల్ప కళకు చెందిన ఆలయం స్వాత్ జిల్లాలో గుర్తించడం ఇదే తొలిసారని అన్నారు. ఈ ప్రాంతం బౌద్ధ ఆరామాలకు నిలయమని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more