(Image source from: Twitter.com/BJP4Telangana)
తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు ప్రతిషాత్మకంగా తీసుకున్న దుబ్బాక ఉపఎన్నికలలో అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగలింది. ఈ ఎన్నికలలో అహర్నిషలు కష్టపడి పోరాడినా టీఆర్ఎస్ పార్టీకి పరాభవం తప్పలేదు. ఉదయం ఎనమిది గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ లో తొలుత పొస్టల్ బ్యాలెట్లు లెక్కించగా టీఆర్ఎస్ అభ్యర్థి సొలిపేట సుజాత అధిక్యంలో నిలిచారు. ఆ తరువాత ప్రారంభమైన తొలి రౌండ్ ఎన్నికల నుంచి ప్రతి రౌండులోనూ క్రమంగా అధిపధ్యంతో దూసుకెళ్లిన రఘునందన్ రావు.. చివరాఖరున కూడా అధికార టీఆర్ఎస్ పార్టీపై 1470 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సాధించారు.
అయితే ఆయన విజయాన్ని ఎన్నికల కమీషన్ అధికారికంగా ప్రకటించలేదు. నాలుగు ఈవీఎంలలో నిక్షిప్తమైన మొత్తం 1669 ఓట్లు లెక్కింపులో ఈవీఎం యంత్రాలు తెరుచుకోవడంలో మొరాయించాయి. దీంతో ఎన్నికల కమీషన్ ఇంకా విజయాన్ని ప్రకటించలేదు. అయినా ఇప్పటికే 1470 ఓట్ల మెజారిటీతో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి కన్నా ముందున్న రఘునందన్ రావు.. ఈ నాలుగు ఈవీఎం యంత్రాలలో మరో 102 ఓట్లు లభించినా విజయాన్ని అందుకున్నట్లే కావడంతో బీజేపి కార్యకర్తలు రఘునందన్ రావు విజయాన్ని సంబరంగా ఎంజాయ్ చేసుకున్నారు. దుబ్బాక అసెంబ్లీకి ఉపఎన్నికలు ప్రకటించడంతో ప్రచారపర్వంలో దూసుకుపోయిన రఘునందన్ రావు అన్ని రాజకీయ పార్టీలకన్నా ముందుగానే ప్రచారపర్వంలో సాగిపోయారు.
అయితే ఎన్నికల తేదీ సమీపిస్తున్న తరుణంలో ఆయన అనుయాయువులు తరలిస్తున్న డబ్బును ఔటర్ రింగ్ రోడ్డుపై రూ.28లక్షలను స్వాధీనం చేసుకున్నామని చెప్పిన పోలీసులు.. ఆయన మామ ఇంట్లోనూ సోదాలు చేసి డబ్బును ఇంటిలోపల పెట్టేందుకు యత్నించి.. మీడియా కెమెరాలకు చిక్కారు. దీంతో రఘునందన్ రావుపై సానుభూతి కూడా వెల్లివిరిసి.. ఓట్లుగా మారింది. దీంతో ఆయన దుబ్బాకలో విజయం సాధించారు. అదే సమయంలో రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు సంజయ్ కూడా దీక్షకు దిగడం.. ఆ తరువాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ ఘటనలపై సీరియస్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కుతగ్గింది. అయినా అధికార పార్టీ తరపున బరిలో నిలచిన సుజాత తరపున మంత్రి హరీశ్ రావు అహర్నిషలు కష్టించినా ఫలితం లభించలేదు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more