(Image source from: Telugubulletin.com)
దేశవ్యాప్తంగా అన్ లాక్ 5.0 మార్గదర్శకాలు మరో నెల రోజుల పాటు అమల్లో వుంటాయని కేంద్ర హొం మంత్రిత్వ శాఖ అక్టోబర్ నెలాఖరులో ప్రకటించి.. దేశంలోని పాఠశాలలు, విద్యాసంస్థలు, కాలేజీలన్నీ నవంబర్ ఆఖరు వరకు తెరుచుకోవని అదేశాలు జారీ చేసినా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ నెల 2 నుండి విద్యాసంస్థలను తెరిచింది. దీని ఫలితంగా అనేక మంది ఉపాధ్యాయులు, విద్యార్థులపై కరోనావైరస్ మహమ్మారి పంజా విసిరింది. పాఠశాలలకు వెళ్లిన విద్యార్ధులకు శానిటైజేషన్, మాస్క్, సహా సామాజిక దూరం పాటించినప్పటికీ మహమ్మారి పంజా విసురుతోంది
నవంబరు 2 నుంచి 9, 10వ తరగతి విద్యార్థులకు, ఇంటర్ ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. ఇక ఈ నెల 12 నుంచి ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం కానున్నాయి, కాగా ఇప్పటికే రాష్ట్రంలో వందలాది మంది ఉపాధ్యాయులు, విద్యార్థులు కరోనావైరస్ బారిన పడ్డారు. ఇక ఈ నెల 23 నుంచి 6, 7, 8 తరగతుల విద్యార్థులకు కూడా తరగతులు కూడా ప్రారంభం అవుతాయని ప్రభుత్వ సీఎస్ జారీ చేసిన నోటిఫికేషన్ లో పేర్కోనగా, అదే జరిగిదే తమ పిల్లల అరోగ్యాల మాటేమిటని, తల్లితండ్రులు, ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి,
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా అన్ని జిల్లాల్లోని విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభమైన నాలుగు రోజుల వ్యవధిలోనే ఏకంగా 575 మంది విద్యార్థులు, 829 మంది ఉపాధ్యాయులపై కరోనా మహమ్మారి తన పంజాను విసిరింది. రాష్ట్రంలోని 41,623 పాఠశాలల్లో 70,790 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా వీరిలో 829 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 95,763 మంది విద్యార్థులకు కూడా టెస్టులు నిర్వహించారు. పాజిటివిటీ రేటు విద్యార్థుల్లో 0.06 శాతంగా ఉండగా, ఉపాధ్యాయుల్లో 1.17 శాతంగా ఉంది.
పశ్చిమగోదావరి జిల్లాలోని ఓ పాఠశాలలో కరోనా పరీక్షలను నిర్వహించగా.. 10 మంది విద్యార్థులకు కరోనా సోకినట్టు తేలింది. దీంతో, వారందరినీ వెంటనే పాఠశాల నుంచి ఇంటికి పంపించేశారు. చిత్తూరు జిల్లాలో ఏకంగా 120 మంది టీచర్లకు కరోనా సోకింది. ఓ పాఠశాలలో నలుగురు విద్యార్థులు మహమ్మారి బారిన పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా అంబాజిపేట మండలం గంగలకుర్రు అగ్రహారం ప్రభుత్వ పాఠశాలలో వంట చేసే మహిళకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. విద్యాశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థుల సంఖ్య 9.75 లక్షలుగా ఉందని... పాఠశాలలకు హాజరైన వారు కేవలం 3.93 లక్షల మంది మాత్రమేనని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more