తండ్రి నుంచి వారసత్వంగా అందిన రాజకీయ పార్టీ.. నిన్నమొన్నటి వరకు తాను అదే కాంగ్రెస్ పార్టీలో వుంటూ ప్రతీ ఎన్నికలో ఓటర్లను కాంగ్రెస్ కే ఓటు వేయాలని అభ్యర్థించాడు. అయితే తనకు పార్టీలో ప్రాధాన్యత లభించడం లేదని ఇటీవలే తన వర్గానికి చెందిన ఏకంగా 22 మంది ఎమ్మెల్యేలతో ఆయన బీజేపిలోకి చేరి రాష్ట్రంలో అధికార మార్పిడికి కారణమయ్యారు. దీంతో తనకు అదే ఉపముఖ్యమంత్రి పదవి మాత్రమే లభించినా తన మాట చెల్లుబాటు తన హామీలు నెరవేరడం కనిపిస్తున్నాయి, అయితే తన కోసం పార్టీ ఫిరాయించిన అభ్యర్థులందరినీ అనర్హులుగా ప్రకటించడంతో ఉపఎన్నికలు వచ్చాయి, తనకు మద్దతునిచ్చిన అభ్యర్థుల విజయాన్ని భుజాన వేసుకున్న జ్యోతిరాధిత్య సింధియా వారి కోసం ప్రతీ నియోజకవర్గం తిరుగుతూ ఎన్నికలను అభ్యర్థిస్తున్నారు.
పార్టీ మారడం తేలికే అయినా దశాబ్దాలుగా వచ్చిన అలవాటు మాత్రం పోవడం కష్టంగా పరిణమించింది సింధియాకు. అయితే అయన నోరుజారడాన్ని ఎన్నికల సమయంలో క్యాష్ చేసుకునే పనిలో పడింది కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీకే మీ ఓటు వేయాలని ఆయన చెప్పిన వీడియోను ఇప్పుడు నెట్టింట్లో పెట్టడంతో పాటు దానిని విరివిగా ప్రచారం కల్పించింది. ఉప ఎన్నికలు జరుగుతున్న ప్రతీ ప్రాంతంలోనూ ఓటర్లు ఇప్పటికే నిర్ణయం తసీుకున్నారని, వారు కచ్చితంగా అదే పని చేస్తారని తమ పార్టీ అభ్యర్థులనే గెలిపిస్తారని కాంగ్రెస్ నేతలు చమత్కరిస్తున్నారు, దీంతో జ్యోతిరాదిత్య సింధియా పార్టీ మారడం తేలికే అయినా తండ్రి నుంచి అందిన వారసత్వం మాత్రం కోల్పోడానికి కొంచం సమయం పడుతుందని కామెంట్లు కూడా వినబడుతున్నాయి.
ఇంతకీ ఏం జరిగిందంటే.. ఉప ఎన్నికల ప్రచార సభలో బీజేపీ అభ్యర్థిని ఇమర్తీ దేవి పోటీ చేస్తున్న దబ్రా నియోజకవర్గంలో పర్యటించిన ఆయన, 'హస్తం గుర్తుకే మన ఓటు' అని నినదించి, అందరినీ ఆశ్చర్యపరచడంతో పాటు, తాను నాలుక్కరుచుకున్నారు. ఆమె తరఫున ప్రచారం నిర్వహించేందుకు వచ్చిన సింధియా, "మీ చేతులు పైఎత్తి. నన్ను, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను గెలిపిస్తామని చాటిచెప్పండీ అంటూ నినదించారు. దాబ్రా ఓటరు మహాశయులారా, 3వ తేదీన మీరంతా హస్తం గుర్తుకు ఓటు వేయాలి" అని అన్నారు. ఆ వెంటనే జరిగిన తప్పును తెలుసుకున్న ఆయన, దాన్ని సరిదిద్దుకున్నారు. దీంతో ఈ వీడియో క్లిప్ ను మధ్యప్రదేశ్ కాంగ్రెస్, తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
सिंधिया जी,
— MP Congress (@INCMP) October 31, 2020
मध्यप्रदेश की जनता विश्वास दिलाती है कि तीन तारीख़ को हाथ के पंजे वाला बटन ही दबेगा। pic.twitter.com/dGJWGxdXad
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more