పార్లమెంటులోకి అడుగుపెట్టాలని మహారాష్ట్ర నుంచి సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచిన బాలీవుడ్ బ్యూటీ క్వీన్ కు పరాభవం ఎదురైనా.. ఈ ధఫా చట్టసభలోకి అడుగుపెట్టేందుకు ముహూర్తం ఖరారారైంది. మహారాష్ట్రలోని అధికార శివసేన అమెను చట్టసభలోకి తీసుకువచ్చేందుకు పావులను కదిపింది. అదేంటి కాంగ్రెస్ నాయకురాలిగా.. కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగిన దేశ ఆర్థిక రాజధాని ముంబై ఉత్తర పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటి చేసిన ఆమెను శివసేన ఎందుకు తమ అభ్యర్థిగా చట్టసభకు పంపాలని భావిస్తోందని అంటున్నారా.? ఇంతకీ అమె ఎవరో అర్థమైందా.? అమె ఉర్మిళ మంటోడ్కర్, లోక్ సభ ఎన్నికలు జరిగిన తరువాత అమె గత ఏడాది సెప్టెంబర్ లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసింది. తనకు లోక్ సభ ఎన్నికలలో నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పెద్దలు సైఁహకరించలేదని అమె అరోపించారు.
ఈ మేరకు ఆమె రహస్యంగా ఓ లేఖను కూడా అధిష్టానానికి పంపారు. ఈ లేఖ మీడియాకు లీక్ కావడంతో అమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు, ఈ క్రమంలో అప్పటి నుంచి ఇటీవల అధికార శివసేన పార్టీపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ విమర్శలు, అరోపణలు చేసే వరకు ఉర్మిళ మంటోడ్కర్ పెద్దగా ఉనికి చాటుకోకుండా లో ఫ్రోఫైల్ మెయింటైన్ చేశారు, అయితే తాజా పరిణామాల నేపథ్యంలో అమెను శివసేన అక్కున చేర్చకుని అమెకు చట్టపభలో స్థానం కల్పించాలని నిర్ణయించింది, ఆమెతో పాటు మరో 11 మందికి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించేందుకు వారి జాబితాను రాష్ట్ర గవర్నర్ కు పంపించింది. అయితే ఉర్మిళ పేరును శివసేన ప్రతిపాదించడంపై కాంగ్రెస్ నేతలు కూడా పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. తమ పార్టీకి అమె రాజీనామా చేసిందని దీంతో అమెను శివసేన చట్టపభకు పంపుతోందని ఇందులో తమకు అభ్యంతరాలు ఏమీ లేవని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు.
మహారాష్ట్ర శాసనమండలిలో త్వరలో ఖాళీ కానున్న 12 స్థానాలకు గాను గవర్నర్ కోటాలో ఊర్మిళను నామినేట్ చేయాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నిర్ణయించారు. నిన్న జరిగిన ‘మహా వికాస్ అఘాడీ’ నేతల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కంగనా రనౌత్ విమర్శలు, అరోపణలను అంతే స్థాయిలో బలంగా తిప్పికోట్టిన నేపథ్యంలో ఊర్మిళకు ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేసి అమెను చట్టసభకు నామినేట్ చేయాలని శివసేన భావిస్తోంది. ఈ వార్తలను శివసేన రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ధ్రువీకరించారు. అయితే, మూడు పార్టీల నేతలతో మరోమారు చర్చించిన అనంతరం అభ్యర్థుల జాబితాను సీఎంకు పంపుతామని, ఆయన తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. కాగా, ఎమ్మెల్సీ జాబితాలో మరాఠీ నటుడు ఆదేష్ బండేకర్, సింగర్ ఆనంద్ షిండే, ఇటీవల బీజేపీకి రాజీనామా చేసి ఎన్సీపీలో చేరిన సీనియర్ నేత ఏక్నాథ్ ఖడ్సేలు ఉన్నట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more