పార్లమెంటులోకి అడుగుపెట్టాలని మహారాష్ట్ర నుంచి సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచిన బాలీవుడ్ బ్యూటీ క్వీన్ కు పరాభవం ఎదురైనా.. ఈ ధఫా చట్టసభలోకి అడుగుపెట్టేందుకు ముహూర్తం ఖరారారైంది. మహారాష్ట్రలోని అధికార శివసేన అమెను చట్టసభలోకి తీసుకువచ్చేందుకు పావులను కదిపింది. అదేంటి కాంగ్రెస్ నాయకురాలిగా.. కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగిన దేశ ఆర్థిక రాజధాని ముంబై ఉత్తర పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటి చేసిన ఆమెను శివసేన ఎందుకు తమ అభ్యర్థిగా చట్టసభకు పంపాలని భావిస్తోందని అంటున్నారా.? ఇంతకీ అమె ఎవరో అర్థమైందా.? అమె ఉర్మిళ మంటోడ్కర్, లోక్ సభ ఎన్నికలు జరిగిన తరువాత అమె గత ఏడాది సెప్టెంబర్ లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసింది. తనకు లోక్ సభ ఎన్నికలలో నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పెద్దలు సైఁహకరించలేదని అమె అరోపించారు.
ఈ మేరకు ఆమె రహస్యంగా ఓ లేఖను కూడా అధిష్టానానికి పంపారు. ఈ లేఖ మీడియాకు లీక్ కావడంతో అమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు, ఈ క్రమంలో అప్పటి నుంచి ఇటీవల అధికార శివసేన పార్టీపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ విమర్శలు, అరోపణలు చేసే వరకు ఉర్మిళ మంటోడ్కర్ పెద్దగా ఉనికి చాటుకోకుండా లో ఫ్రోఫైల్ మెయింటైన్ చేశారు, అయితే తాజా పరిణామాల నేపథ్యంలో అమెను శివసేన అక్కున చేర్చకుని అమెకు చట్టపభలో స్థానం కల్పించాలని నిర్ణయించింది, ఆమెతో పాటు మరో 11 మందికి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించేందుకు వారి జాబితాను రాష్ట్ర గవర్నర్ కు పంపించింది. అయితే ఉర్మిళ పేరును శివసేన ప్రతిపాదించడంపై కాంగ్రెస్ నేతలు కూడా పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. తమ పార్టీకి అమె రాజీనామా చేసిందని దీంతో అమెను శివసేన చట్టపభకు పంపుతోందని ఇందులో తమకు అభ్యంతరాలు ఏమీ లేవని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు.
మహారాష్ట్ర శాసనమండలిలో త్వరలో ఖాళీ కానున్న 12 స్థానాలకు గాను గవర్నర్ కోటాలో ఊర్మిళను నామినేట్ చేయాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నిర్ణయించారు. నిన్న జరిగిన ‘మహా వికాస్ అఘాడీ’ నేతల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కంగనా రనౌత్ విమర్శలు, అరోపణలను అంతే స్థాయిలో బలంగా తిప్పికోట్టిన నేపథ్యంలో ఊర్మిళకు ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేసి అమెను చట్టసభకు నామినేట్ చేయాలని శివసేన భావిస్తోంది. ఈ వార్తలను శివసేన రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ధ్రువీకరించారు. అయితే, మూడు పార్టీల నేతలతో మరోమారు చర్చించిన అనంతరం అభ్యర్థుల జాబితాను సీఎంకు పంపుతామని, ఆయన తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. కాగా, ఎమ్మెల్సీ జాబితాలో మరాఠీ నటుడు ఆదేష్ బండేకర్, సింగర్ ఆనంద్ షిండే, ఇటీవల బీజేపీకి రాజీనామా చేసి ఎన్సీపీలో చేరిన సీనియర్ నేత ఏక్నాథ్ ఖడ్సేలు ఉన్నట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Jan 11 | తెలంగాణ సీఎం కేసీఆర్ సమీప బంధువుల కిడ్నాప్ కేసులో అరెస్టయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ కోర్టులో పరాభవం ఎదురైంది. అమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం... Read more
Jan 11 | భారత్ లో బర్డ్ ఫ్లూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజుకో రాష్ట్రాలకు రాష్ట్రాలను వ్యాపిస్తూ అందోళనకర పరిస్థితులకు దారితీస్తోంది. బర్డ్ ఫ్లూ కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. మొదట రాజస్థాన్, మధ్యప్రదేశ్లో... Read more
Jan 11 | ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెలలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల కమీషన్ నగరా మ్రోగించిన నేపథ్యంలో దీనిని వ్యతిరేకిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఎన్నికలను నిలుపుదల చేయాలని రాష్ట్ర హైకోర్టును... Read more
Jan 11 | వాట్సాప్.. స్మార్ట్ ఫోన్ వున్న పత్రీ ఒక్కరికీ ఇదో అందివచ్చిన అద్భుత సాధనం.. తమ ఫోటోలతో పాటు పలు వీడియోలు, ఇతర సమాచారాన్ని తమ అప్తులు, స్నేహితులు, బంధువులతో పంచుకునేలా దోహదపడుతోంది. అయితే తాజాగా... Read more
Jan 11 | జమ్మూకాశ్మీర్ లో గత ఏడాది జరిగిన ఎన్ కౌంటర్ పథకం ప్రకారం ఆర్మీ అధికారులు చేసిన ఘటనా..? లేక వారు ఉగ్రవాదులా.? అన్న ప్రశ్నలకు ప్రస్తుతం పోలీసుల చార్జీషీటు సంచలనంగా మారింది, జమ్మూకాశ్మీర్ లోని... Read more