ప్రభుత్వ సంస్థలు డబ్బును దుబారాగా ఖర్చు చేస్తాయన్నది ప్రజల్లో వున్న అభిప్రాయం. ప్రభుత్వ కాంట్రాక్టు కింద పోందిన పని.. లోపభూయిష్టంగా వుండటంతో పాటు అందుకు అయ్యే ఖర్చు మాత్రం అధికంగా వుంటుందని, అదే పనిని వ్యక్తులు తమకు తాముగా చేసుకుంటే తక్కువలోనే అవుతుందన్న అభిప్రాయం ఒకటుంది. ఇదీ కాకుండా చేసిన పనినే మళ్లి మళ్లీ చేసి దుబారా ఖర్చు కూడా పెట్టేస్తారన్నది కూడా తెలిసిందే. అచ్చంగా అలాంటిదే జరిగిందీ ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్పూర్ జిల్లాలో. అయితే దుబారా ఖర్చు చేసింది మాత్రం ప్రజలకు నీతి సూక్తులు చెప్పే రైల్వే శాఖ కావడం గమనార్హం. ఇక్కడ దుబారా ఖర్చు మాత్రమే కాదు ఏకంగా వివాదానికి దారితీసేలా రంగుల వినియమం జరిగింది.
గోరఖ్ పూర్ జిల్లాలో వున్న లలిత్ నారాయణ్ రైల్వే ఆసుపత్రి మరుగుదొడ్లకు స్థానిక రైల్వే కాంట్రాక్టరు ఎరుపు, ఆకుపచ్చ రంగులను వినియోగించడం వివాదానికి దారి తీసింది. ఈ రంగులు తమ పార్టీ రంగులని.. వాటిని మరుగుదోడ్లకు ఎలా వేస్తారని అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు స్థానిక అధికారులపై సమాజ్వాదీ పార్టీ మండిపడింది. తమ పార్టీ రంగులను మరుగుడ్లకు వాడడం కేవలం అధికార పార్టీ ప్రోద్భలంతోనే జరిగిందని అరోపించిన ఎస్సీ నేతలు.. వాటిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు గోరఖ్ పూర్ ఎస్సీ నేతల బృందం ఒకటి స్థానిక రైల్వే అధికారులను కలిసి కోరింది.
అధికార పార్టీ కలుషిత మనస్తత్వం ఎలాంటిదన్న విషయం రైల్వే అసుపత్రి మరుగుదోడ్లకు తమ పార్టీ రంగులను వేయడం ద్వారా తేటతెల్లం అయ్యిందని సమాజ్ వాదీ పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ దురుద్దేశంతోనే ఈ పనిచేశారని విమర్శించింది. రాష్ట్రానికి చెందిన ప్రధాన పార్టీ రంగులను మరుగుదొడ్లకు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, రంగులు మార్చడమే కాకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరింది. నాలుగు నెలల క్రితమే మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ రెండు రోజుల క్రితమే రంగుల విషయం తమ దృష్టికి వచ్చిందని పార్టీ జిల్లా అధ్యక్షుడు రామ్ నాగిన సాహిని పేర్కొన్నారు.
ఎస్పీ పోస్టుపై ఈశాన్య రైల్వే స్పందించింది. స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా రైల్వే ఆసుపత్రిలో వున్న సంవత్సరాల క్రితం నాటి టైల్స్ ను, మరుగుదొడ్లను మరింత పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతోనే వాటిని వేసినట్టు పేర్కొంది. ఈ విషయంలో ఏ పార్టీకి సంబంధం లేదని వివరణ ఇచ్చింది. అయితే, మళ్లీ ఏమైందో కానీ సాయంత్రానికే రంగులు మార్చారు. ఎరుపు, ఆకుపచ్చ టైల్స్పై తెలుపు రంగు వేసినట్టు రైల్వేకు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. టాయిలెట్ల గోడలపై ఎస్పీ కార్యకర్తలు నల్లరంగు పూయడంతో తాము తెలుపు రంగు వేయాల్సి వచ్చిందన్నారు. కాగా, తమ పార్టీ కార్యకర్తలు నల్లరంగు వేశారన్న ఆరోపణలను ఎస్పీ గోరఖ్పూర్ మహానగర్ చీఫ్ ఖండించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more