యావత్ ప్రపంచం ముక్తకంఠంతో ఖండించిన ఉగ్రదాడి అది. గతేడాది ఫిబ్రవరి 14న కశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందడం పట్ల దేశవిదేశాలు వారికి సానుభూతి తెలిపి.. భారత్ పక్షాన నిలిచాయి. జమ్మూకాశ్మీర్ లోని పూల్వమా మీదుగా అక్కడి మిలటరీ బేస్ కేంద్రాలకు వెళ్తున్న జవాన్లపై మందుగుండు నింపుకున్న అటో వచ్చి ఢీకొనడంతో దాడి జరుగగా.. అ వెంటనే కిందకు దిగిన జవాన్లపై తుటాల వర్షం కురిపించిన ముష్కరులు భారత జవాన్లు తేరుకుని ఎదురుకాల్పులకు దిగే లోపు పరారైన విషయం తెలిసిందే.
ఆ దాడితో యావత్ భారతం రగిలిపోయింది. అయితే ఇది పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల పనేనని యావత్ భారత్ అరోపించింది. అయితే పాకిస్థాన్ మాత్రం ఈ అరోపణలను అప్పట్లో తీవ్రంగా ఖండించింది. అయితే భారత్ చేసిన అరోపణలు నిజమని.. వాటిలో ఏ మాత్రం అభ్యంతరాలు లేవని సాక్ష్యాత్తు పాకిస్థాన్ శాస్త్రసాంకేతిక శాఖ మంత్రి ఫవాద్ హుస్సేన్ చౌదరి అదేశ పార్టమొంటులోనే నిసిగ్గుగా దొంగదెబ్బ తీయడం కూడా తమ గోప్పగా చెప్పుకోచ్చారు. ఈ దాడి పాక్ ప్రోద్బలిత దాడి అని అది పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రోద్బలంతోనే జరిగాయని కూడా చెప్పుకోవడం దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి.
పాక్ ప్రభుత్వంపై అక్కడి విపక్షాలు సంధించిన ప్రశ్నలతో విస్తుపోయిన అధికార పక్షం తరపున పార్లమెంటులో తమ గొప్పులు చెప్పుకోచ్చిన మంత్రి.. ఏకంగా హిందుస్తాన్ లోని పూల్వామాలో జరిగిన దాడిని తమ గోప్పగా పేర్కోన్నారు. హిందుస్తాన్ లోకి చోరబడి వారి సొంతగడ్డపైనే వారి సైన్యాన్ని దారుణంగా దెబ్బకొట్టామని, ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలో సాధించిన ఈ విజయం పాక్ ప్రజల విజయం అని అభివర్ణించారు. ఇది యావత్ పాకిస్థాన్ విజయమని ఇందులో ప్రతీ పాకిస్తానీయుడికి భాగస్వామ్యం ఉందని గొప్పలకు పోయారు, ఈ వ్యాఖ్యలను కొందరు పార్లమెంటు సభ్యులు బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తం చేశారు.
ఫవాద్ చౌదరి వ్యాఖ్యల వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. దీంతో యావత్ ప్రపంచానికి పాకిస్తాన్ నిజస్వరూపం అర్థమైంది. వెంటనే పాకిస్థాన్ దిద్దుబాటు చర్యలకు దిగింది. తాను మాట్లాడింది పుల్వామా ఉగ్రదాడి తరువాత భారత్ తో జరిగిన వైమానిక దాడి గురించేనని ఫవాద్ చైదరి చెప్పారు. అమాయకులను చంపి తాము ధైర్యవంతులం అని చెప్పుకోవాల్సిన పని తమకు లేదని అన్నారు. ఉగ్రవాదానికి తాము ముందు నుంచి వ్యతిరేకమే అని చెప్పారు. తన మాటలను భారత మీడియా వక్రీకరించిందని అన్నారు. పుల్వామా దాడి చేయించింది పాకిస్థానే అని తాను అనలేదని చెప్పారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు.
#WATCH: Pakistan's Federal Minister Fawad Choudhry, in the National Assembly, says Pulwama was a great achievement under Imran Khan's leadership. pic.twitter.com/qnJNnWvmqP
— ANI (@ANI) October 29, 2020
(And get your daily news straight to your inbox)
Jun 30 | మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల నాయకుడు ఏక్నాథ్ షిండే గురువారం రాత్రి 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయగా, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ రాత్రి... Read more
Jun 30 | రైలు టికెట్ కొనాలంటే ముందుగా కౌంటర్ వద్దకు వెళ్లేందుకు ప్రయాణీకులు ఎంతో సమయం క్యూల్లో నిలబడిఉండాలి. టికెట్లు ఇచ్చే వ్యక్తిపైనా తరచూ ఫిర్యాదులు వస్తుంటాయి. ఈ ప్రక్రియ సంక్లిష్టంగా మారడంతో పరిస్థితి మెరుగుపరిచేందుకు పలు... Read more
Jun 30 | గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న శివసేన రెబల్ వర్గ ఎమ్మెల్యేలు బీజేపితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్దమైంది. అయితే... Read more
Jun 30 | బంగారం అంటే మహిళలకు చాలా ఇష్టం. దీని కోసమే ఎన్నో ఇళ్లలో మగవారు చీవాట్లు తింటారు. ఇంకొన్ని ఇళ్లలో ప్రశంసలను అందుకునే వాళ్లూ ఉన్నారు. మరి ఈ కుందనం నలుపు శరీర ఛాయ ఉన్నవారిపై... Read more
Jun 30 | గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభం శివసేన అధినేత, మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే రాజీనామాతో క్లైమాక్స్ కు చేరింది. మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ ఎనమిది మంది మంత్రులపై విధించిన... Read more