Durga Matha as Sri Lalitha Tripura sundari Devi at Indrakeeladri ఇంద్రకీలాద్రిపై లలిత త్రిపురసుందరి దేవిగా కనకదుర్గమ్మ..

Durga devi atop indrakeeladri attired as sri lalitha tripurasundari devi on sixth day of dasara celebrations

Kanaka durgadevi Temple, dasara celebrations, Sri Lalitha Tripurasundari Devi, Saraswati Devi, Gayatri Devi. durga devi, Dasara celebrations at Durga temple , Indrakeeladri, Dasara celebrations, 9 days Dasara celebrations, dasara navaratri, COVID-19, Coronavirus, Indrakeeladri, Vijayawada, Andhra Pradesh, Alampur, jogulamba Temple, Shaktipeetam, Mahaboobnagar, Telangana

The nine-day Dasara celebrations have begun at the Durga temple on Indrakeelthe hillock, on the sixth day of Navaratri celebrations today the Goddess Kanaka Durga attired as Sri Lalitha Tripurasundari Devi.

ఇంద్రకీలాద్రిపై లలిత త్రిపురసుందరి దేవి అలంకరణలో కనకదుర్గమ్మ..

Posted: 10/22/2020 08:59 PM IST
Durga devi atop indrakeeladri attired as sri lalitha tripurasundari devi on sixth day of dasara celebrations

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలలో భక్తులు అత్యంత భక్తిప్రవర్తులతో పాల్గొంటున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలను ఆలయ కమిటీ అంగరంగవైభవంగా నిర్వహిస్తోంది, దేవీ శరన్నవరాత్రులలో ఆరవ రోజైన ఇవాళ అమ్మవారు శ్రీలలితా త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శమిస్తున్నారు. సకల శ్రాస్తాలకు శ్రీలలితా త్రిపుర సుందరీ దేవి మూలం అని భావించి.. ఇవాళ అమ్మవారి ఉపాసకులు ఉపవాస దీక్షను చేపట్టి లలితా సహ్రనామ పారాయణాలను చేస్తుంటారు. ఇంద్రకీలాది కనకదుర్గ అమ్మవారి దర్శనానికి ఉదయం నుంచే బారులు తీరారు, ఇక ఇవాళ అమ్మవారిని కొందరు కాత్యాయినీ దేవిగా, మరికొందరు జోగులాంభగా కూడా ఆరాధిస్తుంటారు.

ఆశ్వీయుజ శుద్ధ షష్ఠి నాడు కాత్యాయుని కుమార్తె కాత్యాయని దేవీగా, లలిత త్రిపుర సుందరి దేవీగా, ఆలంపూర్ జోగులాంభగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సుతో ఎరుపురంగు చీరను ధరించి ఛతుర్భుజములతో సింహవాహనిగా దర్శనమిస్తుంది. చెరుకు గడ, పూలను చేతబూని అభయ హస్తం, వరముద్రలతో అమ్మవారు భక్తులకు కరుణించనుంది. లోకాతీతమైన కోమలత్వం కలిగిన ఆదిపరాశక్తిగా శ్రీ లలితా త్రిపురసుందరి దేవి అమ్మవారిని భక్తులు మహామంత్ర అధిష్టాన దేవతగా ఆరాధిస్తుంటారు. ఈ అమ్మవారి చల్లని చూపు, కరుణకటాక్షాలు కురవడం, అమ్మవారిని దర్శించుకోవడం వల్ల వివాహానికి అడ్డుపడే సమస్యలు తోలగిపోతాయని భక్తులు విశ్వాసం. పండితులతో పాటు ఎక్కువగా పెళ్లికానీ యువతులు అమ్మవారిని ఆరాధిస్తుంటారు. పెళ్లైనవారు అమ్మవారిని కోలవడంతో మంగళ దోషాలు తోలగడంతో పాటు దుఃఖం, దారిద్ర్యం, భయం తోలగిపోతాయి.  

అయితే ఆలయ అధికారులు మాత్రం పరిమిత సంఖ్యలోనే భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. గంటలకు వెయ్యి మంది చోప్పున మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో అమల్లో వున్న కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూనే భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నామని చెప్పారు. ఇక నిన్న సాయంత్రం సీఎం వైఎస్ జగన్ పట్టువస్త్రాల సమర్పణకు వచ్చే గంట ముందు ఇంధ్రకీలాద్రి అమ్మవారి కొండ నుంచి కొండచరియలు విరిగిపడి ముగ్గురికి గాయాలయ్యాయి, అయితే ఇలా మరోమారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంధ్రకీలాధ్రి మరమ్మత్తుల కోసం రూ.70 కోట్లను ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles