ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలలో భక్తులు అత్యంత భక్తిప్రవర్తులతో పాల్గొంటున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలను ఆలయ కమిటీ అంగరంగవైభవంగా నిర్వహిస్తోంది, దేవీ శరన్నవరాత్రులలో ఆరవ రోజైన ఇవాళ అమ్మవారు శ్రీలలితా త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శమిస్తున్నారు. సకల శ్రాస్తాలకు శ్రీలలితా త్రిపుర సుందరీ దేవి మూలం అని భావించి.. ఇవాళ అమ్మవారి ఉపాసకులు ఉపవాస దీక్షను చేపట్టి లలితా సహ్రనామ పారాయణాలను చేస్తుంటారు. ఇంద్రకీలాది కనకదుర్గ అమ్మవారి దర్శనానికి ఉదయం నుంచే బారులు తీరారు, ఇక ఇవాళ అమ్మవారిని కొందరు కాత్యాయినీ దేవిగా, మరికొందరు జోగులాంభగా కూడా ఆరాధిస్తుంటారు.
ఆశ్వీయుజ శుద్ధ షష్ఠి నాడు కాత్యాయుని కుమార్తె కాత్యాయని దేవీగా, లలిత త్రిపుర సుందరి దేవీగా, ఆలంపూర్ జోగులాంభగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సుతో ఎరుపురంగు చీరను ధరించి ఛతుర్భుజములతో సింహవాహనిగా దర్శనమిస్తుంది. చెరుకు గడ, పూలను చేతబూని అభయ హస్తం, వరముద్రలతో అమ్మవారు భక్తులకు కరుణించనుంది. లోకాతీతమైన కోమలత్వం కలిగిన ఆదిపరాశక్తిగా శ్రీ లలితా త్రిపురసుందరి దేవి అమ్మవారిని భక్తులు మహామంత్ర అధిష్టాన దేవతగా ఆరాధిస్తుంటారు. ఈ అమ్మవారి చల్లని చూపు, కరుణకటాక్షాలు కురవడం, అమ్మవారిని దర్శించుకోవడం వల్ల వివాహానికి అడ్డుపడే సమస్యలు తోలగిపోతాయని భక్తులు విశ్వాసం. పండితులతో పాటు ఎక్కువగా పెళ్లికానీ యువతులు అమ్మవారిని ఆరాధిస్తుంటారు. పెళ్లైనవారు అమ్మవారిని కోలవడంతో మంగళ దోషాలు తోలగడంతో పాటు దుఃఖం, దారిద్ర్యం, భయం తోలగిపోతాయి.
అయితే ఆలయ అధికారులు మాత్రం పరిమిత సంఖ్యలోనే భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. గంటలకు వెయ్యి మంది చోప్పున మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో అమల్లో వున్న కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూనే భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నామని చెప్పారు. ఇక నిన్న సాయంత్రం సీఎం వైఎస్ జగన్ పట్టువస్త్రాల సమర్పణకు వచ్చే గంట ముందు ఇంధ్రకీలాద్రి అమ్మవారి కొండ నుంచి కొండచరియలు విరిగిపడి ముగ్గురికి గాయాలయ్యాయి, అయితే ఇలా మరోమారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంధ్రకీలాధ్రి మరమ్మత్తుల కోసం రూ.70 కోట్లను ప్రకటించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more