Brahmotsavam: Malayappa Swamy on SuryaPrabha Vahanam సూర్యప్రభ వాహనంపై తిరుమల శ్రీవారు..

Tirumala brahmotsavam lord malayappa swamy taken in procession on suryaprabha vahanam

Tirumala Tirupati devastanam, Lord malayappa swamy as RajaMannar, Lord Malayappa swamy on SuryaPrabha Vahanam, Lord Malayappa swamy on Sarva Bhopala Vahanam, Lord Malayappa Swamy, Tirumala Tirupati Devasthanam, Tirumala Bramhotsavam, chinna shesha vahanam, Hamsa vahanam, covid-19, devotees

Tirumala diety Lord Malayappa Swamy, dressed in celestial attire as Suryanarayan Murthy was taken in a procession on SuryaPrabha Vahanam the seventh day of Srivari Navaratri Brabmotsavam on Thursday. Today evening the lord will take procession on Chandra Prabha Vahanam.

సూర్యప్రభ వాహనంపై తిరుమల శ్రీవారు.. రాత్రి చంద్రప్రభ వాహనంపై..

Posted: 10/22/2020 09:06 PM IST
Tirumala brahmotsavam lord malayappa swamy taken in procession on suryaprabha vahanam

(Image source from: news.tirumala.org)

కలియుగ ప్రత్యేక్షదైవం తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏడవ రోజు ఉదయం మలయప్పస్వామి.. సప్తఅశ్వవాహనుడైన సూర్యనారాయణ మూర్తి అవతారంలో దర్శనమిచ్చారు. సూర్యనారాయణమూర్తిగా ఏడు అశ్వాల వాహనమైన సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు అభయప్రధానం చేశారు. ఈ సూర్యప్రభ వాహనంపై ఊరేగుతున్న ప్రత్యక్షదైవం సూర్యానారాయణమూర్తిని దర్శించడం వల్ల అన్ని శుభాలు జరుగుతాయని భక్తుల విశ్వాసం. సకల రోగాలను బాపే సూర్యనారాయణ మూర్తి దర్శనంతో ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, భాగ్యం సిద్దిస్తాయని భక్తుల విశ్వాసం. సూర్యప్రభ వాహనంపై విహరించిన స్వామి వైభవాన్ని చూసి భక్తులు పులకించిపోయారు.

మంగళ వాయిద్యాల మధ్య జీయంగార్లు, పండితులు, అర్చకుల వేదమంత్రోచ్ఛరణల నడుమ సూర్యనారాయణమూర్తికి వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇక ఇవాళ రాత్రి ఏడు గంటలకు శ్రీవారి బ్రహోత్సవాలలో భాగంగా చంద్రప్రభ వాహన సేవను టీటీడీ నిర్వహించనుంది. ఉత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పుష్పకవిమాన సేవ, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహన సేవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా స్వామివారికి ఆగ‌మోక్తంగా నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల‌న్నీ య‌థాత‌థంగా నిర్వ‌హిస్తారు.

కరోనా ప్రభావంతో ఉత్సవాలను ఆలయానికే పరిమితం చేశారు. సాధారణంగా బ్రహోత్సవాల సమయంలో ఇసుకేసినా రాలనంతగా భక్తులు తిరుమల కోండకు చేరుకుని దేవదేవుడి వివిధ రూపాల్లో దర్శించి అభయాన్ని పోందేందుకు పోటీపడతారు. ప్రతీఏడు కలియుగ వైకుంఠమైన తిరుమల పవిత్ర తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తజన సందోహానికి అభయప్రధానం చేసే శ్రీవారు ఈ సారి కరోనా నేపథ్యంలో ఆలయానికి మాత్రమే ఉత్సవాలు పరిమితమయ్యాయి, ఇక ఈ బ్రహ్మోత్సవాల వేడుకలకు కూడా పరిమితి సంఖ్యలోనే భక్తులు వస్తున్నారు. ముందుగా టికెట్లు పోందిన భక్తులతో పాటు ధర్మదర్శన టికెట్లు పోందిన భక్తులను మాత్రమే తిరుమల కోండపైకి తితిడీ అధికారులు అనుమతిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles