కరోనా కారణంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను వాయిదా వేసిన నేపథ్యంలో మార్చి నుంచి పలు ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుని చివరకు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా మార్పుకు కూడా కారణమైన విషయం తెలిసిందే. కాగా తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల విషయమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిన సమాధానాలు విన్న న్యాయస్థానం విస్మయం వ్యక్తం చేసింది. దేశంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ.. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు నిర్వహించలేకపోతున్నారని ప్రశ్నించింది, బీహార్ శాసనసభకు ఇటీవల కేంద్ర ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసందే.
దీంతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఖాళీగా వున్న అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటి ఫలితాలు వచ్చే నెల (నవంబర్) 10వ తేదీన వెల్లడి కానున్నాయి. కాగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ న్యాయవాది తాండవ యోగేష్ దాఖలు చేసిన పిటీషన్ పై రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం కష్టమని ఈ సందర్భంగా ఏఫీ ప్రభుత్వం న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చింది.
ప్రభుత్వం తరపున ప్రభుత్వ న్యాయవాది అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. దీనిపై విస్మయాన్ని వ్యక్తం చేసిన న్యాయస్థానం కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయాన్ని ప్రస్తావించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడంలో అభ్యంతరమేంటని ప్రశ్నించింది. ఇక రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం అభిప్రాయం తెలపాలని ఎస్ఈసీకి నోటీసులు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పిటీషన్ పై తదుపరి విచారణను రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు నవంబరు 2కి వాయిదా వేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more