కలియుగ ప్రత్యక్ష దైవం.. భక్తుల కొంగుబంగారం శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామికి దర్శనానికి క్రమంగా భక్తుజనకోటి క్యూకడుతోంది. ఈ నేపథ్యంలో శ్రీవారి ఇక ఆర్జిత సేవా కార్యక్రమాలను కూడా పునరుద్దరించే పనిలో పడిన తిరుమల తిరుపతి బోర్డు.. భక్తులకు అందుబాటులోకి పలు సేవలను తీసుకురావాలని యోచిస్తోంది. ఈ క్రమంలో తిరుమల తీరుపతి దేవస్థానం బోర్డు బ్రహోత్సవాల సమయంలో భక్తులను పరిమిత సంఖ్యలోనే అనుమతించేందుకు కూడా చర్యలు తీసుకుంది, ఈ క్రమంలో అక్టోబర్ 16 నుంచి 24 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్న సందర్భంగా కోవిడ్ నిబంధనలను తూచా తప్పకుండా అమలు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు చర్యలను చేపట్టింది.
ఈ క్రమంలో ఇప్పటికే గత నెల సెప్టెంబర్ 7 నుంచి డిజిటల్ కళ్యాణోత్సవం సేవను తాత్కాలికంగా రద్దు చేసిన టీటీడీ,. ఈ నెల 26 నుంచి మళ్లీ కళ్యాణోత్సవ సేవను శ్రీవారి భక్తజనకోటికి అందుబాటులోకి తీసుకురానుంది, ఇందుక సంబంధించిన టిక్కెట్లను కూడా అప్పటి నుంచి అందుబాటులోకి తీసుకురానున్నామని తెలిపింది, కాగా, రోజుకు కేవలం పరిమిత సంఖ్యలోనే కేవలం వెయ్యి టికెట్లను మాత్రమే విక్రయించనున్నామని కూడా టీటీడీ అధికారులు ప్రకటించారు,ఇక తాజాగా కోటా నేపథ్యంలో టీటీడీ వెబ్ సైట్ లో శ్రీవారి ప్రత్యేక దర్శనానికి ప్రవేశ టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చారు, ఉత్సవాలకు సంబంధించిన టీటీడీ ప్రత్యేక దర్శన కోటాను విడుదల చేశారు,
శ్రీవారి బ్రహోత్సవాల వేడుకల నేపథ్యంలో ప్రతీ రోజు పదిహేను స్లాట్ లలో 16 వేట టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అందుబాటులోకి తీసుకువచ్చింది, టిక్కెట్లు ఉన్న భక్తులను మాత్రమే బ్రహ్మోత్సవాల సమయంలో కోండపైకి పంపనున్నారు. అలిపిరి వద్ద చెక్ పాయింట్ లో భక్తుల ప్రత్యేక దర్శన కోటాను పరిశీలించనున్న ఆలయ అధికారులు వారిని మాత్రమే సంబంధిత సమయంలో కోండపైకి అనుమతించనున్నారు. శ్రీవారి మూలవిరాట్టు దర్శనంతో పాటు బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సూర్య, చంద్ర, హనుమ, గరుడ, మొదలగు వాహనాలపై తిరుమాడ వీధుల్లో తిరిగే కలియుగ శ్రీవెంకటేశ్వర స్వామి అభయప్రధానాన్ని కూడా వీక్షించేందుకు భక్తులకు అనుమతించనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more