కాపు ఐక్యవేదిక నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్న ముద్రగడ పద్మనాభం నోట మళ్లీ అదే మాట వచ్చింది. తనపై తన సామాజిక వర్గానికి చెందినవారే విమర్శలు, అరోపణలకు పాల్పడటంతో అవేదనకు గురైన ముద్రగడ.. తనను ఇవాళ కలసిన తమ సామాజిక వర్గ నేతలతో మన్నించలేక పోతున్నాను.. క్షమించండీ అన్న పదాలనే వినియోగించారు. కాపు ఉద్యమాన్ని ఉద్దృతంగా తీసుకువెళ్లి.. ప్రభుత్వాలు తమకు ప్రాధాన్యతను కల్పించేలా.. లేక రాజకీయ పార్టీలు తమ వర్గానికి సంబంధించిన అంశాలను మానిపెప్టోలో పెట్టేలా కృషి చేసిన ఆయన ఇన్నాళ్లు కాపు జేఏసీకి నాయకత్వం వహించిన ముద్రగడ పద్మనాభం.. తాను ఇకపై ఆ బాధ్యతలను నిర్వహించలేనని మరోమారు కరాఖండీగా తెలిపారు.
రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి కిర్లంపూడిలోని ముద్రగడ పద్మనాభం నివాసానికి వచ్చిన కాపు జేఏసీ నేతలతో ఆయన భేటీ అయ్యారు. కాపు ఉద్యమంపై వీరు అరగంటకు పైగా సమాలోచనలు జరిపారు. కాపు ఉద్యమాన్ని ఉదృతంగా ముందుకు తీసుకెళ్లగల నేతగా రాణించిన ముద్రగడను మళ్లీ బాధ్యతలు చేపట్టాలని కోరారు. అయితే వారితో చర్చలు ముగిసిన తరువాత ముద్రగడ ఓ లేఖను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన తాను కాపు జేఏసీ నేతల కోరికను మన్నించలేకపోతున్నాను.. క్షమించండీ అంటూ లేఖలో ప్రధానంగా పేర్కోన్నారు.
'గౌరవ పెద్దలకు మీ ముద్రగడ పద్మనాభం శిరస్సు వంచి నమస్కారములు చేసుకుంటున్నాను. మీ కోరికను గౌరవించలేకపోతున్నందుకు క్షమించమని కోరుచున్నాను. వ్యక్తిగతంగా నేను మీతోనే ఉంటానండి. మనం మంచి స్నేహితులం. మీ ఇంటిలో ఏ కార్యక్రమం ఉన్నా తెలియజేస్తే నా ఓపిక ఉన్నంత వరకు వస్తానండి. మీ అందరి అభిమానం, ప్రేమ మరువలేనిది. నా ఇంటిలో ఏ శుభకార్యం ఉన్నా నేనే స్వయంగా జిల్లాలకు వచ్చి ఓపిక ఉన్నంత వరకు ఆహ్వానిస్తాను. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టవద్దని కోరుచున్నాను' అని లేఖలో ముద్రగడ పేర్కొన్నారు. మరోవైపు, ఉద్యమానికి నాయకత్వం వహించలేనని ముద్రగడ స్పష్టం చేయడంతో... ఇకపై ఉద్యమానికి ఎవరు నాయకత్వం వహిస్తారనే చర్చ జరుగుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more