బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో ఇప్పటికీ ఇంకా అభిమానుల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్న నేపధ్యంలో డ్రగ్స్ వ్యవహారంతో ఈ కేసు ముడిపడిందన్న సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే తాము అభిమానంగా ప్రేమించుకునే హీరోలు, హీరోయిన్లు డ్రగ్స్ తీసుకుని వాటికి బానిసలు అవుతారా.? అన్న ప్రశ్నలు కూడా అభిమానుల్లో ఉత్పన్నమవుతున్నాయి. ఈ క్రమంలో ఇదే అంశం అటు పార్లమెంటులోనూ ఇద్దరు సభ్యుల మధ్య వాదప్రతివాదనలకు దారి తీసింది. బాలీవుడ్ లో డ్రగ్స్ కల్చర్ వుందని, వాటిపై నిఘా పెట్టాలని.. లేని పక్షంలో అది పరిశ్రమను నాశనం చేస్తోందని బీజేపి ఎంపీ, నటుడు రవికిషన్ అన్నారు.
దీంతో ఆయన వ్యాఖ్యలపై సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ తీవ్రంగా మండిపడ్డారు. తాను ఎదిగి గుర్తింపును పొందేందుకు దోహదపడిన పరిశ్రమపై తానే విమర్శలు చేయడం పట్ల ఎంపీ రవికిషన్ పై జయాబచ్చన్ తీవ్రంగా మండిపడ్డారు. చలన చిత్ర నటుడై ఉండి కూడా బాలీవుడ్ను విమర్శించడం సిగ్గుచేటు అని దుయ్యబట్టారు. దీంతో అమె చేసిన వ్యాఖ్యలపై ఆయన మరోమారు సమర్ధించుకున్నారు. తన వ్యాఖ్యలను జయాబచ్చన్ మద్దతు పలుకుతారని భావిస్తున్నానని చెప్పారు. తాను సినీరంగం నుంచే నటుడిగా వచ్చి గుర్తింపు సాధించుకున్నానని.. బహుబాషా చిత్రాలలో నటుడిగా రాణించానని చెప్పారు రవికిషన్.
'పరిశ్రమను పూర్తిగా తుడిచిపెట్టేసే కుట్ర జరుగుతోంది. చిత్ర పరిశ్రమకే చెందిన బాధ్యత కలిగిన నటుడిగా నేను స్పందించాను. అది నా హక్కు. అలాగే పార్లమెంటులో కూడా ఆ అంశాన్ని ప్రస్తావించాను. నా అభిప్రాయాన్ని జయాబచ్చన్ సైతం గౌరవించాలి. నేను ఓ ప్రీస్ట్ కుమారుడిని. కష్టపడి పైకి వచ్చి 600 సినిమాలకు పనిచేశా ' అని రవి కిషన్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. పరిశ్రమలో అంతా డ్రగ్స్ తీసుకుంటారని చెప్పడం లేదు. ప్రపంచంలోని అతి పెద్ద చిత్ర పరిశ్రమను సర్వనాశనం చేసేందుకు ప్లాన్ చేస్తున్న వారి గురించే నేను మాట్లాడుతున్నాను. పరిశ్రమను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది' అని రవికిషన్ పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more