దేశవ్యాప్తంగా మావోయిస్టులు తమ ఉని చాటుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దేశంలోని అణగారిన పక్షాన నిలిచే మావోలకు ప్రస్తుతం.. శరవేగంగా అభివృద్దిలో దూసుకుపోతున్న దేశంతో పాటు రాష్ట్రాల గమనం కూడా వారి ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చివేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం, తీవ్రత చాలానే వున్న విషయం కాదనలేని సత్యం. అయితే రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఈ ప్రభావం మరింత పెరుగుతోందని అప్పటి నేతలు పేర్కోన్నారు. అయితే పునర్విభజన తరువాత తెలుగు రాష్టాలలో మావోల ఉనికి పూర్తిగా సన్నగిల్లిందన్నది కాదనలేని వాస్తవం.
మావోల కోసం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తూ ఎక్కడికక్కడ జల్లెడ పట్టడంతో పాటు అందుబాటులోకి వచ్చిన సాంకేతిక మార్గాలను కూడా వినియోగిస్తూ వారి కదలికలపై నిఘా పెడుతున్నారు. ఇక ఈ తరుణంలో మావోలకు ప్రజల నుంచి కూడా ఆదరణ సన్నగిల్లింది. ప్రభుత్వాలను నిలదీయడం కన్నా అభివృద్ది పయనంలో పయనింపజేయడానికి దోహదం చేయాలని ప్రజలు భావిస్తున్నారు. దీంతో మావోలు ఉనికి రానురాను కాలక్రమేనా సన్నగిల్లుతోంది. ఇక దీనికి తోడు వారి కదలికలు గమనించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడం లేదా తప్పించుకునే ప్రయత్నంలో వారు జరిపే కాల్పులకు పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో వారు మరణిస్తున్నారు.
దీంతో మావోయిస్టుల బలం తగ్గుతూ వస్తోంది. ఇక మావోయిజంపై నేటి యువతరం పెద్దగా ఆసక్తిని కనబర్చకపోవడం కూడా మావోల బలం క్షీణించడానికి మారో కారణంగా నిలుస్తోంది, మారుతున్న అధునాతన సాంకేతిక ప్రపంచంలో అవే పాత పద్దతులను అనుసరిస్తున్న మావోలకు జనాదరణ కూడా లేకుండా పోతోంది. దీంతో మావోలు నిత్యం తమ ఉనికి చాటుకోవడం మాట అటుంచితే మరో దశాబ్దం గడిస్తూ మావోలు పరిస్థితి ఎలా వుంటుందోనన్న కూడా చెప్పలేని పరిస్థితలు వస్తాయనిపిస్తోంది. ఎందుకంటే పోలీసుల అదునాతన సాధనాలకు వారు అడ్డంగా చిక్కిపోతున్నారు. తాజాగా చత్తీస్ గఢ్ లో పోలీసులు ప్రయోగించిన డ్రోన్ కెమెరా కంట మావోయిస్టులు పడ్డారు.
అడవుల్లో మావోలు డ్రోన్ కెమెరాకు చిక్కడం ఇదే తొలిసారని అధికారులు వెల్లడించారు. చత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు ఓ నదిని దాటుతున్న చిత్రాలను డ్రోన్ కెమెరాలు అందించడంతో, ఆ ప్రాంతంలోని పోలీసు బలగాలు అప్రమత్తం అయ్యాయి. సుమారు నెల రోజులుగా తెలంగాణ, చత్తీస్ గఢ్ సరిహద్దుల్లో మావోల కదలికలు అధికంగా ఉన్నాయని తెలుస్తుండగా, తాజాగా డ్రోన్ కెమెరాల్లో సైతం వారి కదలికలు నమోదు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో తెలంగాణ డీజీపీ, స్వయంగా ఆదిలాబాద్ అడవుల్లో ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇప్పటికే రెండు రాష్ట్రాల పోలీసులు, ప్రత్యేక దళాలు, మావోల కదలికలపై నిఘా పెట్టి, వారిని చుట్టుముట్టే పనిలో పెద్దఎత్తున కూంబింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం వారు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు.
(Video Source: ABN Telugu)
(And get your daily news straight to your inbox)
Jan 18 | మహారాష్ట్రలో ఒంటరిగా అధికారంలోకి రావడానికి ప్రస్తుతం అపసోపాలు పడుతున్న శివసేన పార్టీ.. త్వరలోనే జాతీయ పార్టీగా మాత్రం ఎదగాలని యోచనలో వుంది. అందుకు అనుగూణంగా పలు రాష్ట్రాలలో తమ సత్తాను చాటాలని ఉవ్విళ్లూరుతుంది. మహారాష్ట్రలోని... Read more
Jan 18 | కోటి రూపాయాల లంచం డిమాండ్ చేసిన రైల్వే సీనియర్ అధికారిని సీబీఐ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్టు చేసింది. ప్రభుత్వ ఉద్యోగిగా కొనసాగుతూ ఇంతటి భారీ మోత్తాన్ని లంచంగా డిమాండ్ చేసి అడ్డంగా... Read more
Jan 12 | కరోనా మహమ్మారి విజృంభనతో గత మార్చి నుంచి నిరుద్యోగులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఓవైపు ఉన్న ఉద్యోగాలే గాలిలో దీపాలుగా మారుతున్న క్రమంలో ఏ ఉద్యోగం దొరికినా ఫర్యాలేదని నిరుద్యోగ యువత భావిస్తున్నారు. కరోనా... Read more
Jan 12 | కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హస్తినలో రైతన్నల ఉద్యమం ఊపందుకున్న వేళ.. ఎనమిది విడతలుగా కేంద్రం అన్నదాతలతో చర్చలు జరిపినా.. అడుగుముందుకు పడక,. ప్రతిష్టంభన కొనసాగుతుంది, ఈ నేపథ్యంలో నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా,... Read more
Jan 12 | ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నగరా మ్రోగిన నేపథ్యంలో దానిని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడంతో వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో ఈ అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం రిట్... Read more