జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇవాళ ఉదయం 'ధర్మ పరిరక్షణ దీక్ష'కు దిగారు. ప్రభుత్వ చర్యలకు నిరసనగా పవన్ కల్యాణ్ ఈ దీక్షకు దిగారు. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం రథం అగ్నికి ఆహుతైన నేపథ్యంలో బీజేపి సహా జనసేన వర్గాలు ఇవాళ ధర్మ పరిరక్షణ దీక్షకు పూనుకున్నాయి, అంతర్వేది ఘటనతో పాటు హిందూ దేవాలయాల విషయంలో చోటు చేసుకుంటోన్న పరిణామాలను నిరసిస్తూ ధర్మ పరిరక్షణ దీక్ష దిగినట్లు జనసేన నేతలు చెబుతున్నారు. ఇవాళ ఉదయం 10 గంటల ధర్మ పరిరక్షణ దీక్షను ప్రారంభించారు.
ఏకంగా 11 గంటల పాటు సాగిన నిరాహారంగా సాగనున్న ఈ దీక్ష రాత్రి 10 గంటల వరకు కొనసాగనుంది, జనసేన-బీజేపీ సంయుక్తంగా పిలుపునివ్వడంతో ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ హైదరాబాద్ లోని తన కార్యాలయం వద్ద ఈ దీక్ష చేస్తుండగా, బీజేపి అంద్రప్రదేశ్ రాష్ట్ర అథ్యక్షుడు సోము వీర్రాజు తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో దీక్షకు దిగారు. బీజేపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా గుంటూరులో దీక్షకు దిగారు. ఇక పలు జిల్లాల్లో బీజేపి, జనసేన నేతలు దీక్షలకు దిగారు. 'దేవతామూర్తులు, ఉత్సవ రథాల విధ్వంసంపై ప్రభుత్వ నిర్లక్ష వైఖరికి వ్యతిరేకంగా ఈ దీక్షకు పిలుపునిచ్చాయి.
ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ హిందువుల మనోభావాలను ప్రభుత్వాలు పరిరక్షించాలని డిమాండ్ చేశారు. దేవాదాయ ఆస్తులను పరిరక్షించాల్సిన అవసరం కూడా వుందని అన్నారు. రాష్ట్రంలో ఒక పథకం ప్రకారం హిందూవులపై దాడులు జరుగుతున్నాయని, హిందువుల ఆలయాలపై కూడా నిర్లిప్త వైఖరి ప్రదర్శిస్తున్నారని అన్నారు. కాగా పవన్ కల్యాణ్ తన జనసేన కార్యాలయం ఆవరణలో కుర్చీలో కూర్చొని పుస్తకం చదువుతూ ఆయన ఇందులో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ దీక్షలు చేయాలని ఇప్పటికే పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులు దీక్ష చేపడుతున్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు కూడా తమ ఇళ్ల వద్ద దీక్షలు చేపట్టారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more