తెలంగాణ రెవన్యూ వ్యవస్థలో సమూల మార్పులను తీసుకువస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్.. రెవెన్యూ ఉధ్యోగుల వినతితో వెనక్కు తగ్గినా.. తాజాగా రెవెన్యూ శాఖ విపరీతమై అవినీతికి ఆజ్యం పోస్లూ నేరుగా ప్రజలతో సంబంధాలు కలిగివున్న విలేజ్ రెవెన్యూ అధికార (వీఆర్వో) వ్యవస్థ రద్దు చేస్తున్నట్లుగా స్పష్టమైన సంకేతాలు వచ్చాయి, అధికారికంగా ఈ వ్యవస్థలో వీఆర్వోలుగా విదులు నిర్వహిస్తున్న వారి నుంచి రెవెన్యూ రికార్డులను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం తాజాగా జిల్లా కలెక్టర్లకు అదేశాలను జారీ చేయడంతో.. ఈ వ్యవస్థ రద్దు కాబోతున్నాయన్న కథనాలకు బలం చేకూరింది.
ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని వీఆర్వోల నుంచి రాష్ట్రంలోని వీఆర్వోల వద్దనున్న రెవెన్యూ రికార్డులను స్వాధీనం చేసుకోవాలని ఆయన జిల్లా కలెక్టర్లను అదేశించారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకల్లా ఈ ప్రక్రియ పూర్తి కావాలని ఆయన చెప్పారు. అలాగే, సాయత్రం 5 గంటలలోపు.. రికార్డుల స్వాధీనంపై నివేదికలు ఇవ్వాలని తెలిపారు. రెవెన్యూ శాఖలో అవినీతి భారీగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. ఏసీబీ దాడుల్లో చిక్కుతున్న వారిలో వీఆర్వోలే అధికంగా ఉంటున్నారు. దీంతో ఆ వ్యవస్థకు స్వస్తి చెప్పాలని కేసీఆర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు.
కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పన చేస్తున్నట్లు గత అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రకటించారు. నేటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్తచట్టాన్ని ఈ సమావేశాల్లోనే ప్రకటిస్తారని సమాచారం. వీఆర్వోలను ఉద్యోగాల నుంచి తొలగించకుండా వేరే శాఖలో సర్దుబాటు చేయనున్నారు. కాగా, దివంగత సీఎం ఎన్టీఆర్ హయాంలోనూ పటేల్, పట్వారీల వ్యవస్థను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన బాటలోనే వెళ్తూ కేసీఆర్ కూడా పలు చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని నెలల క్రితమే గ్రామ రెవెన్యూ వ్యవస్థ రద్దుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ను ఆదేశించారు.
ఈ మేరకు సోమేశ్ కుమార్ అన్ని చర్యలూ తీసుకున్నారు. గ్రామ రెవెన్యూ వ్యవస్థను రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కూడా కొన్ని వారాల క్రితమే తెలిపారు. రైతులు భూములు సాగు చేసుకుంటున్నా వారి పేర్లు రికార్డుల్లోకి ఎక్కడం లేదని ఆయన విమర్శలు గుప్పించారు. పట్టాదారు పాస్పుస్తకాలు రాక, ప్రభుత్వం ఇచ్చే ప్రయోజనాలు పొందలేక రైతులు నష్టపోతున్నారని చెప్పారు. దీనికి వీఆర్వోలే కారణమని, ఆ వ్యవస్థను రద్దు చేస్తామని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more