కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రస్తుతం రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ.. బాధితులకు ఆక్సిజన్ సిలిండర్ల అవసరం కూడా పెరుగుతోంది. ఈ వాస్తవాన్ని గ్రహించని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని ఆక్సిజన్ సిలిండర్లను ఆసుపత్రికి పంఫిణీ చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అడుగుజాడల్లోనే తాము సమాజ సేవకు పాటుపడుతున్నామని అన్నారు. పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రికి గ్రేటర్ జనసేన నేతలు ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భాన్ని పురస్కారించుకుని ఆస్పత్రి సూపరింటెండెంట్ మాట్లాడుతూ కోవిడ్-19 జడలు విప్పిన ఈ సందర్భంలో ఆక్సిజన్ సిలిండర్ల పంపిణీ గొప్ప కార్యక్రమని కొనియాడారు. అయితే ప్రస్తుత పరిస్థితిలతో పాటు కోవిడ్ తదనంతర పరిస్థితుల్లోనూ ఆక్సిజన్ సిలిండర్లు ఉపయోగపడతాయని చెప్పుకొచ్చారు. ఆస్తమా రోగులకు ఆక్సిజన్ సిలిండర్లు తరుచూ ఉపయోగపడతాయని తెలిపారు. దీర్ఘకాలం ఉపయోగపడే కార్యాక్రమం చేస్తోన్న గ్రేటర్ జనసేన నాయకులను ఆస్పత్రి సూపరింటెండెంట్ అభినందించారు. చెస్ట్ ఆస్పత్రి తరుపున జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు.
సినీనటుడిగా తన ప్రస్థానం ప్రారంభించిన జనసేనాని పవన్ కల్యాణ్.. అప్పటినుంచే సమాజ సేవ కార్యక్రమాలు నిర్వహించేవారని అన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని తాము తమకు తోచిన విధంగా సమాజ సేవ కార్యక్రమాలు చేపడుతున్నామని గ్రేటర్ జనసేన అధ్యక్షుడు రాజలింగం తెలిపారు. పేదలకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతోనే చెస్ట్ ఆస్పత్రికి 35 ఆక్సిజన్ సిలిండర్లు అందజేసినట్లు పేర్కొన్నారు. గ్రేటర్ పరిధిలో వివిధ ప్రభుత్వాస్పత్రులకు మొత్తం 100 ఆక్సిజన్ సిలిండర్లు అందిస్తున్నామన్నారు. కరోనా సమయంలో హడావుడి లేకుండా జనసేన తరుపున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జనసేన గ్రేటర్ అధ్యక్షుడు రాజలింగం వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more