(Image source from: Allnewsflash.com)
నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఇప్పటికే వర్షాలతో ముద్దవుతున్నాయి. ఈ తరుణంలో భారతీయ వాతావరణ శాఖ మరోమారు అప్రమత్తం చేసింది. గత వారం రోజులుగా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో రానున్న రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వరసగా ప్రతీరోజు కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. ప్రజాజీవనం పూర్తిగా స్థంభించిపోయింది.
అయితే మరోమారు తెలుగురాష్ట్రాలకు వర్ష సూచన ఉందన్న వార్త వెలువడింది. కాగా ఇప్పటిలా మోస్తారు నుంచి భారీ కాకుండా.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. అంతేకాదు ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు కూడా పడే అవకాశం వుందని.. ఈ క్రమంలో ప్రజలంతా అప్రమత్తంగా వుండాలని సూచించింది. కాగా, ఉత్తర ఒడిశా, ఝార్ఖండ్ పై తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఆగస్టు 23న వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఏపీలోనూ వానలు పడనున్నాయి. రేపు ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిస్తాయని తెలిపింది.
ఇక ఉత్తర కోస్తాలో ఉరుములు, మెరుపులతో వానలు పడే అవకాశాలు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు పడతాయని వాతావరణ విభాగం తెలిపింది. ఇక ఇటు తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more