Woman sets daughter ablaze spat over inter-caste marriage కన్నకూతుర్ని సజీవదహనం చేసిన తల్లి.. ఇద్దరూ మృతి

Woman sets daughter ablaze spat over inter caste marriage both die

honour killing, inter-caste marriage, shadnagar police, woman set ablaze, sravanthi, chandrakala, kerosene, cyberabad police commissionerate, Hyderabad, Telangana crime

A woman set her daughter ablaze in Shadnagar for wanting to marry a man from another caste, but ended up suffering severe burns herself. The mother and daughter died while undergoing treatment, the Shadnagar police said. The deceased were identified as Sravanthi and her mother Chandrakala, both residents of Shadnagar.

కులాంతర దారుణం: కన్న కూతురి సజీవ దహనం.. తల్లి కూడా మృతి

Posted: 08/20/2020 08:45 PM IST
Woman sets daughter ablaze spat over inter caste marriage both die

కులాంతర వివాహాలు అనేకం జరుగుతున్న ఈ రోజుల్లో.. పెద్దలు కుదిర్చిన వివాహాల బంధాలే కలకాలం నిలిచివుంటాయన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ వాదనల్లో పెద్దగా నిజం లేదన్నది కూడా సత్యమే. ఇప్పటికీ కులానికి, గోత్రానికి పెద్దస్థాయిలో ప్రాముఖ్యత ఇచ్చే వారి సంఖ్య అధికంగానే వుందన్నది కూడా కాదనలేని వాస్తవం. మరోవైపు కులాంతర వివాహాల సంఖ్య పెరుగుతున్నా.. వీటిన వ్యతిరేకించేవారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. క్రమంగా పంతాలకు పట్టింపులకు పోయి మరీ మరణశాసనాలను కూడా రాసేస్తోంది. కన్నబిడ్డలపై పెంచుకున్న ప్రేమతో.. కాలయముళ్లను తయారుచేస్తోంది. అలాంటిదే ఈ దారుణ ఘటన.

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో దారుణం జరిగింది. కులాంతర వివాహా విషయమై తల్లికూతుళ్ల మధ్య రేగిన వివాదం.. అంతకంతకూ పెరిగడంతో కన్నకూతుర్ని సజీవ దహనం చేసింది. అయితే మంటలకు తాళలేక తల్లిని పట్టుకోవడంతో ఇద్దరూ తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిద్దరూ చికిత్స పోందుతూ మృత్యువు ఒడిలోకి జారుకోవడం స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా వున్నాయి, రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ప్రాంతానికి చెందిన చంద్రకళ అనే మహిళకు స్రవంతి అనే కూతురు వుంది. అమె స్థానికుడైన ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఈ విషయం వారి తల్లిదండ్రులకు తెలియడంతో వారు నిలదీసారు.

ఈ విషయమై ఇప్పటికే పలుమార్లు తల్లిదండ్రులకు, కూతురికి మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదనలు నడిచాయి, అయితే కూతురు స్రవంతి మాత్రం తాను ప్రేమించిన యువకుడినే వివాహం చేసుకుంటానని తేగేసి చెప్పింది. దీంతో వారింట్లో ప్రతీ రోజు ఈ విషయమై తల్లికూతుళ్ల మధ్య గొడవలు జరుగుతూనే వున్నాయి. ఇదే క్రమంలో బుధవారం కూడా ఇద్దరికీ మధ్య గోడవ జరిగింది. అదే సమయానికి తన విదులు ముగించుకుని ఇంటికి వచ్చిన తండ్రి కూడా అమెపై కోపాన్ని వెల్లగక్కాడు. దీంతో సవ్రంతి మాత్రం తాను ప్రేమించిన యువకుడితోనే వివాహం చేయాలని తల్లిదండ్రులను డిమాండ్ చేసింది. లేదంటే తాను చచ్చిపోతానని కూడా బెదిరింపులకు పాల్పడింది.

కోపోద్రిక్తుడైన తండ్రి స్రవంతి మాటలు విన్న వెంటనే వంటింట్లోంచి కిరోసిన డబ్బాను తీసుకోచ్చి.. మేము కుదిర్చిన పెళ్లి చేసుకో.. లేదా కిరోసిన్ పోసుకుని చచ్చిపోమ్మని కూతురికి ఇవ్వజూపాడు. అంతే పట్టలేని కోపంతో ఊగిపోయిన చంద్రకళ.. తన పరువు, మర్యాదలను మంటగలుపుతోందన్న కోపంతో.. ఒక్క ఉదుటున కిరోసిన్ డబ్బాను అందుకుని.. కూతురిపై కిరోసిన్ పోసేసింది. వెంటనే నిప్పంటించి సజీవ దహనం చేసింది. అయితే తల్లి ఒక్కసారిగా చేసిన చర్యలకు బిగ్గరగా అరిచిన స్రవంతి.. మంటలకు తాళలేక తల్లిని పట్టుకుంది. దీంతో ఇద్దరు మంటల్లో చిక్కుకున్నారు. జరిగిన పరిణామాలను చూస్తూ షాక్ కు గురైన తండ్రి.. వెంటనే మంటలను అర్పే ప్రయత్నం చేశారు. కాగా తల్లికూతుళ్లు ఇద్దరు చికిత్స పోందుతూ మరణించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles