కులాంతర వివాహాలు అనేకం జరుగుతున్న ఈ రోజుల్లో.. పెద్దలు కుదిర్చిన వివాహాల బంధాలే కలకాలం నిలిచివుంటాయన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ వాదనల్లో పెద్దగా నిజం లేదన్నది కూడా సత్యమే. ఇప్పటికీ కులానికి, గోత్రానికి పెద్దస్థాయిలో ప్రాముఖ్యత ఇచ్చే వారి సంఖ్య అధికంగానే వుందన్నది కూడా కాదనలేని వాస్తవం. మరోవైపు కులాంతర వివాహాల సంఖ్య పెరుగుతున్నా.. వీటిన వ్యతిరేకించేవారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. క్రమంగా పంతాలకు పట్టింపులకు పోయి మరీ మరణశాసనాలను కూడా రాసేస్తోంది. కన్నబిడ్డలపై పెంచుకున్న ప్రేమతో.. కాలయముళ్లను తయారుచేస్తోంది. అలాంటిదే ఈ దారుణ ఘటన.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో దారుణం జరిగింది. కులాంతర వివాహా విషయమై తల్లికూతుళ్ల మధ్య రేగిన వివాదం.. అంతకంతకూ పెరిగడంతో కన్నకూతుర్ని సజీవ దహనం చేసింది. అయితే మంటలకు తాళలేక తల్లిని పట్టుకోవడంతో ఇద్దరూ తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిద్దరూ చికిత్స పోందుతూ మృత్యువు ఒడిలోకి జారుకోవడం స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా వున్నాయి, రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ప్రాంతానికి చెందిన చంద్రకళ అనే మహిళకు స్రవంతి అనే కూతురు వుంది. అమె స్థానికుడైన ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఈ విషయం వారి తల్లిదండ్రులకు తెలియడంతో వారు నిలదీసారు.
ఈ విషయమై ఇప్పటికే పలుమార్లు తల్లిదండ్రులకు, కూతురికి మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదనలు నడిచాయి, అయితే కూతురు స్రవంతి మాత్రం తాను ప్రేమించిన యువకుడినే వివాహం చేసుకుంటానని తేగేసి చెప్పింది. దీంతో వారింట్లో ప్రతీ రోజు ఈ విషయమై తల్లికూతుళ్ల మధ్య గొడవలు జరుగుతూనే వున్నాయి. ఇదే క్రమంలో బుధవారం కూడా ఇద్దరికీ మధ్య గోడవ జరిగింది. అదే సమయానికి తన విదులు ముగించుకుని ఇంటికి వచ్చిన తండ్రి కూడా అమెపై కోపాన్ని వెల్లగక్కాడు. దీంతో సవ్రంతి మాత్రం తాను ప్రేమించిన యువకుడితోనే వివాహం చేయాలని తల్లిదండ్రులను డిమాండ్ చేసింది. లేదంటే తాను చచ్చిపోతానని కూడా బెదిరింపులకు పాల్పడింది.
కోపోద్రిక్తుడైన తండ్రి స్రవంతి మాటలు విన్న వెంటనే వంటింట్లోంచి కిరోసిన డబ్బాను తీసుకోచ్చి.. మేము కుదిర్చిన పెళ్లి చేసుకో.. లేదా కిరోసిన్ పోసుకుని చచ్చిపోమ్మని కూతురికి ఇవ్వజూపాడు. అంతే పట్టలేని కోపంతో ఊగిపోయిన చంద్రకళ.. తన పరువు, మర్యాదలను మంటగలుపుతోందన్న కోపంతో.. ఒక్క ఉదుటున కిరోసిన్ డబ్బాను అందుకుని.. కూతురిపై కిరోసిన్ పోసేసింది. వెంటనే నిప్పంటించి సజీవ దహనం చేసింది. అయితే తల్లి ఒక్కసారిగా చేసిన చర్యలకు బిగ్గరగా అరిచిన స్రవంతి.. మంటలకు తాళలేక తల్లిని పట్టుకుంది. దీంతో ఇద్దరు మంటల్లో చిక్కుకున్నారు. జరిగిన పరిణామాలను చూస్తూ షాక్ కు గురైన తండ్రి.. వెంటనే మంటలను అర్పే ప్రయత్నం చేశారు. కాగా తల్లికూతుళ్లు ఇద్దరు చికిత్స పోందుతూ మరణించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more