యావత్ ప్రపంచ మానవాళిపై ప్రభావం చేపుతున్న కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు భారత్ సహా పలు దేశాలు ఇప్పటికే వాక్సీన్ తయారీలో నిమగ్నమయ్యాయి, కాగా, భారత్ లో అభివృద్ధి చెందుతున్న మూడు కరోనా వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఇప్పటికే హ్యూమన్ ట్రయల్స్ ను ప్రారంభించిన ఈ సంస్థలు రెండో దశలోనూ సత్ఫలితాలను అందుకున్నాయి, ఈ నేపథ్యంలో మూడో దశ ప్రయోగాలు కూడా త్వరలోనే ప్రారంభించేందుకు ముహుర్తాలను సంస్థలు రెడీ చేసుకున్నాయి. మరో రెండుమూడు రోజుల్లో మూడవ దశ పరీక్షలకు చేరుకుంటాయని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు.
కరోనా వ్యాక్సిన్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రజలకు ఇచ్చిన భరోసాకు అనుగుణంగా అడుగులు పడుతున్నాయని పాల్ చెప్పారు. అయితే అదివారం రోజున ఒకనాటి మిత్రవర్గమైన శివసేన కేంద్రాన్ని టార్గెట్ చేసి.. రష్యా సామర్థ్యాన్ని ప్రశంసిస్తూ ప్రధాని కార్నర్ చేస్తూ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. కేంద్ర బాభీజీ పాపడాలను ప్రచారం చేయడం.. వట్టి మాటలను చెప్పడం తప్ప కరోనా నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపట్టిందో చెప్పాలని సామ్నా పత్రిక ప్రశ్నల వర్షం కురిపించింది. దీంతో వీకే పాల్ కేంద్ర తరపున వాక్సీన్ నేపథ్యంలో జరుగుతున్న ప్రగతిని ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారని సమాచారం.
మరోవైపు సోమవారం దేశంలో అత్యధికంగా 9 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 3,09,41,264 పరీక్షలు జరిపినట్టు తెలిపింది. దేశవ్యాప్తంగా కోవిడ్-19 నుంచి 20.37 లక్షల మంది కోలుకున్నారని వెల్లడించారు. కరోనా మరణాల రేటు కూడా 2 శాతం లోపే ఉందని, రాబోయే రోజుల్లో దీన్ని ఒక శాతానికి తగ్గించే దిశగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. కాగా మహమ్మారి నుంచి కోలుకున్న రోగుల్లో కోవిడ్ అనంతర లక్షణాలపై శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. కాగా, భారత్ బయోటెక్, జైడస్ క్యాడిల్లా, సీరం ఇనిస్టిట్యూట్లు కరోనా వైరస్ నిరోధానికి దేశీ వ్యాక్సిన్ అభివృద్ధి చేయడంలో తలమునకలయ్యాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more