ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా రెండు కోట్ల మందిని తన ప్రభావానికి గురిచేసి.. లక్షల మందిని కబళించి వేసిన కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న క్రమంలో తాజాగా కేంద్రం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. కరోనా మహమ్మారి భారిన పడకుండా తప్పించుకునేందుకు ఇప్పటికీ సరైన టీకా, మందులు లేకపోవడంతో కేంద్రం తీసుకున్న పలు కీలక నిర్ణయాలను దేశ ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు. కరోనా కట్టడికి భౌతికదూరం పాటించడం, మాస్క్ ధరించడం, వ్యక్తిగత శుభ్రదత పాటించడమే దివ్య ఔషదాలుగా నిలుస్తున్నాయి, వ్యక్తుల పరిశుభ్రతలో ప్రధానమైన వీలైనన్ని ఎక్కువసార్లు చేతులు శుభ్రం చేసుకోవడం.. ఇక బయటకు వెళ్లిన సమయంలో చేతులను శానిటైజర్ చుక్కలతో శుభ్రపర్చుకోవడం.
బయటకు వెళ్లి ఇతరులను కలసినప్పుడు.. వారి చేతుల్లోని వస్తువులు తీసుకున్న నేపథ్యంలోనూ చేతులు శానిటైజ్ చేసుకోవడం తప్పనిసరి. దీంతో.. ఒక్కసారిగా శానిటైజర్లకు డిమాండ్ పెరిగిపోయింది.. కరోనా వైరస్ నుంచి తప్పించుకునేందుకు ఇది కీలకమైన అస్త్రంగా మారిపోయింది.. ఎవ్వరి బ్యాగులో చూసినా హ్యాండ్ శానిటైజర్ వుండితీరాల్సిందే. ఏ జేబులో చూసినా అదే.. ఏ వాహనంలోనైనా ఉండాల్సిందే.. ఇక కార్యాలయాలు, షాపింగ్ మాల్స్.. ఇలా వేటి ముందైనా శానిటైజర్ దర్శనమిస్తోంది.. నిత్యావసర వస్తువుల్లో కూడా శానిటైజర్ భాగమైపోయింది.. ఎందుకంటే.. ప్రతీ ఇంట్లోనూ వాడేస్తున్నారు... దీంతో.. కొరత ఏర్పడకుండా కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్రం.
వాటిలో ముఖ్యంగా.. శానిటైజర్ అమ్మడానికి, నిల్వ ఉంచేందుకు ఇకపై అనుమతులు అవసరం లేదని ప్రకటించింది. ఈ నిబంధన వెంటనే అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు. దేశంలో శానిటైజర్ కొరత తలెత్తకుండా కొత్తగా 600 సంస్థలకు తయారీకి అనుమతులు కూడా ఇచ్చేశారు... ఇక, శానిటైజర్ ధరలపై కూడా కేంద్రం కీలక ప్రకటన చేసింది. 200 ఎంఎల్ శానిటైజర్ ధర ఎట్టి పరిస్థితుల్లోనూ రూ.100 కంటే అధికంగా ఉండరాదని ఆదేశించింది. ఎక్స్పైరీ డేట్ దాటిన శానిటైజర్ నిల్వలను తమ వద్ద ఉంచుకోరాదని.. అమ్మకూడదని కీలక ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు.. శానిటైజర్ విక్రయించేందుకు ఇప్పటివరకు లైసెన్సు తప్పనిసరి అనే నిబంధన ఉండగా.. దానిపై వస్తున్న విజ్ఞప్తులతో.. ఆ నిబంధన కూడా ఎత్తివేసింది కేంద్రం.
(And get your daily news straight to your inbox)
Jan 19 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామస్థాయిలో ఎన్నికల నిర్వహణ పంచాయితీ హైకోర్టుకు చేరిన తరుణంలో ఎన్నికల నిర్వహణ వుంటుందా.? లేదా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఫిబ్రవరిలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల... Read more
Jan 19 | అనునిత్యం దేశం కోసం.. దేశభక్తి కోసం ప్రసంగాలు గుప్పించే వ్యక్తుల నుంచి దేశానికి సంబంధించిన అత్యంత గోప్యమైన సమాచారం ఓ జర్నలిస్టుకు లీక్ కావడంపై కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా... Read more
Jan 19 | హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ లిమిటెడ్ సంస్థ రూపోందించిన కరోనా వాక్సీన్ కోవాక్సీన్ ను మూడవ దశ ట్రయల్స్ పూర్తి కాకుండానే అత్యవసర వినియోగం కోసం లైసెన్స్ పొందిన విషయం తెలిసిందే. అయితే... Read more
Jan 19 | నాగార్జునసాగర్ ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఉప ఎన్నికలలో భారీ మెజారిటీని సాధించేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో తమకు ఎదురులేదని.. మోనార్క్ ముద్రను వేసుకున్న టీఆర్ఎస్ ఇకపై ఎన్నికలంటే... Read more
Jan 19 | కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళిని భయం గుప్పెట్లోకి నెట్టిన తరువాత రెండో వేవ్ అంటూ భయాలు ఉత్పన్నమైన వేళ.. సెకెండ్ స్ట్రెయిన్ కూడా పలు దేశాలను అతలాకుతలం చేసింది. కరోనా నుంచి కోలుకున్న తరువాత... Read more