ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా రెండు కోట్ల మందిని తన ప్రభావానికి గురిచేసి.. లక్షల మందిని కబళించి వేసిన కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న క్రమంలో తాజాగా కేంద్రం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. కరోనా మహమ్మారి భారిన పడకుండా తప్పించుకునేందుకు ఇప్పటికీ సరైన టీకా, మందులు లేకపోవడంతో కేంద్రం తీసుకున్న పలు కీలక నిర్ణయాలను దేశ ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు. కరోనా కట్టడికి భౌతికదూరం పాటించడం, మాస్క్ ధరించడం, వ్యక్తిగత శుభ్రదత పాటించడమే దివ్య ఔషదాలుగా నిలుస్తున్నాయి, వ్యక్తుల పరిశుభ్రతలో ప్రధానమైన వీలైనన్ని ఎక్కువసార్లు చేతులు శుభ్రం చేసుకోవడం.. ఇక బయటకు వెళ్లిన సమయంలో చేతులను శానిటైజర్ చుక్కలతో శుభ్రపర్చుకోవడం.
బయటకు వెళ్లి ఇతరులను కలసినప్పుడు.. వారి చేతుల్లోని వస్తువులు తీసుకున్న నేపథ్యంలోనూ చేతులు శానిటైజ్ చేసుకోవడం తప్పనిసరి. దీంతో.. ఒక్కసారిగా శానిటైజర్లకు డిమాండ్ పెరిగిపోయింది.. కరోనా వైరస్ నుంచి తప్పించుకునేందుకు ఇది కీలకమైన అస్త్రంగా మారిపోయింది.. ఎవ్వరి బ్యాగులో చూసినా హ్యాండ్ శానిటైజర్ వుండితీరాల్సిందే. ఏ జేబులో చూసినా అదే.. ఏ వాహనంలోనైనా ఉండాల్సిందే.. ఇక కార్యాలయాలు, షాపింగ్ మాల్స్.. ఇలా వేటి ముందైనా శానిటైజర్ దర్శనమిస్తోంది.. నిత్యావసర వస్తువుల్లో కూడా శానిటైజర్ భాగమైపోయింది.. ఎందుకంటే.. ప్రతీ ఇంట్లోనూ వాడేస్తున్నారు... దీంతో.. కొరత ఏర్పడకుండా కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్రం.
వాటిలో ముఖ్యంగా.. శానిటైజర్ అమ్మడానికి, నిల్వ ఉంచేందుకు ఇకపై అనుమతులు అవసరం లేదని ప్రకటించింది. ఈ నిబంధన వెంటనే అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు. దేశంలో శానిటైజర్ కొరత తలెత్తకుండా కొత్తగా 600 సంస్థలకు తయారీకి అనుమతులు కూడా ఇచ్చేశారు... ఇక, శానిటైజర్ ధరలపై కూడా కేంద్రం కీలక ప్రకటన చేసింది. 200 ఎంఎల్ శానిటైజర్ ధర ఎట్టి పరిస్థితుల్లోనూ రూ.100 కంటే అధికంగా ఉండరాదని ఆదేశించింది. ఎక్స్పైరీ డేట్ దాటిన శానిటైజర్ నిల్వలను తమ వద్ద ఉంచుకోరాదని.. అమ్మకూడదని కీలక ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు.. శానిటైజర్ విక్రయించేందుకు ఇప్పటివరకు లైసెన్సు తప్పనిసరి అనే నిబంధన ఉండగా.. దానిపై వస్తున్న విజ్ఞప్తులతో.. ఆ నిబంధన కూడా ఎత్తివేసింది కేంద్రం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more