(Image source from: Ndtv.com)
అయోధ్యలో రమ్య రామ మందిరం నిర్మాణానికి భూమిపూజ ముహూర్తం సమీపిస్తున్న వేళ ఆ నగరం మొత్తం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా వచ్చే నెల ఐదవ తేదీ నిరవ్హించే భూమి పూజకు శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు సిద్దం చేస్తున్నారు. ఈ క్రమంలో అయోధ్య నగరంలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. అంతా సిద్దమని.. ఎలాంటి విఘ్నాలు లేకుండా శ్రీరాముల వారి ఆలయ నిర్మాణం కోసం చకచకా ఏర్పాట్లు పూర్తైన తరుణంలో రామ మందిరంలో ఆర్చకులకు కరోనా సోకింది. అర్చకులతో పాటు ఆలయ శంకుస్థాపన కార్యాక్రమానికి బందోబస్తుగా వచ్చిన పోలీసులకు కూడా కరోనా మహమ్మారి సోకింది.
ఇవాళ ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న నేపథ్యంలో అనువణువూ పరిశీలిస్తున్న అధికారులు.. అక్కడి బందోబస్తుకు వచ్చిన పోలీసులతో పాటు ఆలయంలోని సిబ్బంది అందరికీ రాష్ట్ర వైద్యాధికారులు నిర్వహించిన పరీక్షలలో ఈ విషయం నిర్థారణ అయ్యింది. అయోద్య శ్రీరామాలయంలో ప్రధాన పూజారి సహాయకుడిగా ఉన్న పూజారి ప్రదీప్ దాస్ కొవిడ్ బారిన పడ్డారు. దీంతో ఆయన్ను హోం క్వారంటైన్ కు తరలించారు. అలాగే, ఆలయం వద్ద విధులు నిర్వహిస్తున్న 14 మంది పోలీసు సిబ్బందికి సైతం పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు ట్రస్టు వెల్లడించింది.
ప్రధాని నరేంద్ర మోదీ సహా 50మంది ప్రముఖులు విచ్చేస్తున్న సందర్భంగా భారీ బందోబస్తు నెలకొంది. ఇక శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో అన్ని భద్రతా చర్యలు తీసుకొని కార్యక్రమాన్ని నిర్వహించాలని భావిస్తున్నట్టు ఆలయ ట్రస్ట్ తెలిపింది. కొందరు అతిథులు, పూజారులు, భద్రతా సిబ్బంది, స్థానికులతో కలిపి మొత్తం 200 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more