Covid 19: 7998 fresh cases reported in AP ఏపీలో ఒక్క రోజులో 8 వేల కేసులు.. 49 మరణాలు

Coronavirus in ap 8147 new covid 19 cases state tally crosses 80 thousand mark

covid-19, coronavirus, coronavirus in india, coronavirus in ap, covid-19 in ap, coronavirus updates, coronavirus pandemic, fight against coronavirus, covid-19 outbreak, coronavirus outbreak in andhra pradesh, coronavirus in nellore, coronavirus in Krishna, coronavirus in prakasam, coronavirus in in kadapah, coronavirus in west godavari, coronavirus news, coronavirus latest news, coronavirus latest update, coronavirus andhra pradesh, coronavirus updates

The total number of COVID-19 cases in Andhra Pradesh crosses 80,000 Mark after 8147 new cases were reported in the last 24 hours, out of which 39,935 have so far recovered and have been discharged, while 933 have died, the state health department said.

ఏపీపై కరోనా పంజా.. 24 గంటల్లో 8 వేల కేసులు.. 49 మరణాలు

Posted: 07/25/2020 12:06 AM IST
Coronavirus in ap 8147 new covid 19 cases state tally crosses 80 thousand mark

(Image source from: Republicworld.com)

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతోంది. మే నెల చివరి వారం నుంచి వేగాన్ని పుంజుకున్న కరోనా మహమ్మారి రాష్ట్రంలో రోజుకు వందలాది మందిని తన ప్రభావానికి గురిచేస్తోంది, ఫలితంగా రాష్ట్రంలో కరోనా కేసులు 80 వేల మార్కుకు అధిగమించాయి. ఇక పక్షం రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతుండటం అందోళన రేకెత్తిస్తోంది. దాదాపుగా పక్షం రోజులుగా ప్రతీ రోజు వెయి మార్కుకు పైగానే కరోనా పాజిటివ్ కేసుల నమోదు ఇవాళ ఏకంగా అత్యధిక స్థాయిలో ఎనమిది వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో కరోనా కేసులు నిర్థారణతో ఏకంగా 80 వేల మార్కును అధిగమించింది, ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి కఠినచర్యలు తీసుకుంటున్నా వైరస్ ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఇటీవల రోజరోజుకూ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే వున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో ఏనమిది వేల పైబడిన సంఖ్యలో కేసులు నమోదు కావడం ఆందోళన వ్యక్తం అయ్యింది.

తాజాగా నమోదైన పాజిటివ్ కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య ఏకంగా డెబై వేల మార్కును అధిగమించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో వివరాలను పేర్కోంది. తాజాగా 8147 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో మొత్తంగా 80,898 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఇందులో విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు పోరుగు రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ఎవరూ లేకపోవడం గమనార్హం. ఇవాళ నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లా, అనంతపురం, కర్నూలు, విశాఖపట్నం, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనే నమోదయ్యాయి. అత్యధికంగా ఏకంగా ఆరు వందల సంఖ్యలో ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే నమోదు కావడం అక్కడ తీవ్రతను తెలియజేస్తోంది.

ఇక రాష్ట్రంలో జిల్లాలవారీగా పరిశీలిస్తే.. ఆనంతపురంలో 984, చిత్తూరు జిల్లాలో 630, తూర్పు గోదావరి జిల్లాలో 1029, గుంటూరు జిల్లాలో 703, కడప జిల్లాలో 494, కృష్ణా జిల్లాలో 359, కర్నూలు 914. నెల్లూరు జిల్లాలో 278, ప్రకాశం జిల్లాలో 355 పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి, శ్రీకాకుళం జిల్లాలో 374, విశాఖపట్నం జిల్లాల్లో 898, విజయనగరంలో 322, పశ్చిమ గోదావరి జిల్లాలోనూ 807 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, దీంతో జిల్లా వైద్యశాఖ అధికారులు కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో కంటైన్ మెంట్ జోన్లు ఏర్పాటు చేసి.. వైరస్ వ్యాప్తి చెందకుండా పటిష్ట చర్యలు తీసుకునన్నారు. ఇక పురపాలక సంఘాలు, గ్రామపంచాయితీల ఆధ్వర్యంలో కంటైన్ మెంట్ జోన్లలో రసాయనాలు చల్లారు. ఆయా ప్రాంతాలను సానిటైజ్ చేశారు.

కాగా, రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా బారినపడి 49 మంది అసువులు బాసారు. గత 24 గంటల్లో అత్యధికంగా తూర్పు గోదావరి, కృష్ణా, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో మరణాలు నమోదయ్యాయి. తూర్పుగోదావరిలో 11 మంది, గుంటూరులో 9, కృష్ణా జిల్లాలో 9, కర్నూలులో 8, శ్రీకాకుళంలో 7, పశ్చిమగోదావరిలో 5, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో 3, చిత్తూరు, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 933కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో కోరాన వైరస్ బారిన పడి చికిత్స పోందుతూ అసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 39,935కు చేరడం రాష్ట్రప్రజలకు, వైద్య సిబ్బందికి కొంత ఊరటనిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుత్తం యాక్టివ్ గా వున్న కరోనా కేసులు 39,990కు చేరాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles