కరోనా వైరస్ మహమ్మారి చికిత్స అంటేనే వేలల్లో ఖర్చు అంటూ గెండెలు పట్టేసుకుంటున్న సామాన్య ప్రజలకు స్వల్ప ఊరట లభించే వార్త వినిపిస్తోంది. ఇక ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లినా లక్షల రూపాయల ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో భారత ఫార్మా దిగ్గజ సంస్థల్లో ఒకటైన సిప్లా సంస్థ కోవిడ్ రోగులకు శుభవార్తను అందించింది. కరోనా వ్యాధి బారిన పడిన తొలి దశ పేషంట్ల నుంచి వ్యాధి కాసింత తీవ్రంగా వున్న రోగుల వరకు అందరిలోనూ వైరస్ ప్రభావాన్ని తగ్గించడంలో దోహదపడే ఫావిపెరవిర్ జనిరిక్ మెడిసిన్ ను త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపింది.
కరోనా వైరస్ ప్రభావిత భాధితుల్లో వైరస్ ను తగ్గించే ఔషధం ఫవిపిరవిర్ ను సిప్లా త్వరలో మార్కెట్ లో ప్రవేశపెట్టనుందని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) పేర్కొంది. తక్కువ ఖర్చుతో కరోనా ఔషధాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో సీఎస్ఐఆర్ ఈ ఔషధాన్ని అభివృద్ధి చేసింది. స్ధానికంగా లభ్యమయ్యే రసాయనాలతో ఈ మందును అభివృద్ధి చేసిన సీఎస్ఐఆర్ ఈ సాంకేతికతను సిప్లాకు బదలాయించింది. ఈ మందు త్వరలో మార్కెట్లో అందుబాటులోకి వస్తుందని సీఎస్ఐఆర్ ప్రకటించింది. ఇప్పటికే ఈ మందును తయారు చేసేందుకు తమకు డ్రగ్ కంటోల్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి కూడా అనుమతులు లభించాయని తెలిపింది.
తాము అభివృద్ధి చేసిన సాంకేతికత అత్యంత సమర్థంగా పనిచేస్తుందని, తక్కువ వ్యవధిలోనే ఔషధ తయారీదారులు పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేపట్టేందుకు అనువైందని సీఎస్ఐఆర్-ఐఐసీఆర్ డైరెక్టర్ ఎస్ చంద్రశేఖర్ మండే తెలిపారు. తాజాగా సిప్లా కూడా ఈ ఔషధాన్ని మార్కెట్లోకి తీసుకురానుంది. బెంగళూరుకు చెందిన స్ట్రైడ్స్ ఫార్మా ఈ ఔషధాన్ని తయారు చేసినప్పటికీ ఇంకా అనుమతి కోసం ఎదురుచూస్తోంది. కాగా, ఆప్లిమస్ ఫార్మాకు ఈ ఔషధాన్ని దేశీయ మార్కెట్లో విక్రయించటానికి, ఎగుమతి చేయటానికి అనుమతి వచ్చింది. ఫవిపిరవిర్ ట్యాబ్లెట్ తయారీ- విక్రయానికి తమకు కూడా డీసీజీఐ నుంచి అనుమతి వచ్చినట్లు బ్రింటన్ ఫార్మా అనే దేశీయ కంపెనీ వెల్లడించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more