ప్రపంచవ్యాప్తంగా కరాళనృత్యం చేస్తున్న కరోనా మహమ్మారి ఇటు తెలంగాణలోనూ తన ఉద్దృతిని రోజురోజుకూ విపరీతంగా చాటుతుంది. తెలంగాణలోకి కరోనా మహమ్మారిని రానివ్వమని ప్రభుత్వాలు ఎన్ని ప్రకటనలు చేసినా.. ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా.. దాని విలయతాండవం ముందు నిలువ లేకపోయాయన్నది సత్యం. ప్రపంచాన్నే కుదిపేస్తున్న ఈ మహమ్మారి తెలంగాణలోనూ పంజా విసురడం పెద్ద చర్చనీయాంశం కాకపోయినా.. ఇక్కడి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు.. ప్రభుత్వ అసుపత్రులు, ప్రైవేటు, కార్పోరేట్ అసుపత్రులపై నియంత్రణ కోల్పోయినట్టుగా పరిస్థితులు ఉత్పన్నం కావడం.. ఈ మేరకు రోజుకో వీడియో సోషల్ మీడియాలో దర్శనమివ్వడం చర్చకు దారితీస్తోంది.
ఈ అరోపణలు నిజం కాదని క్షేత్రస్థాయిలో తాము, తమ ఎమ్మెల్యేలు పనిచేస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచాన వేస్తున్నామని ప్రభుత్వం వాదనలు నిజమవుతున్నాయి. గ్రౌండ్ స్థాయిలో తమ నియోజకవర్గ ప్రజల బాగోగులు చూసుకుంటున్న ఎమ్మెల్యేలు కరోనా బారిన పడుతున్నారు. వారే కాదు వారితో పాటు ప్రజాప్రతినిదులు కుటుంబాలు కూడా కరోనా ప్రభావానికి గురై హోం ఐసోలేషన్ స్వియ నిర్భందంలో ఉండాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. తాజాగా కరోనా మహమ్మారి నేపథ్యంలో జాగ్రత్త చర్యలు తీసుకుంటూనే కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు సమస్యల పరిష్కారంలో తలమునకలైన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
ఈ విషయాన్ని మేడ్చల్ జిల్లా డిప్యూటీ డీఎంహెచ్ఓ ఆనంద్ ధ్రువీకరించారు. కరోనా జాగ్రత్తలు తీసుకున్నా తనకు ఎలా వ్యాపించిందా.. అన్న ప్రశ్నలు ఎమ్మెల్యే వివేకానేందలో తలెత్తాయి. అయితే ఆయనతో పాటు ఆయన ఇంట్లోని కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది, ఆయన భార్య సౌజన్య, కుమారుడు విధాత్లకు సైతం కోవిడ్ సోకినట్లు ఆదివారం డాక్టర్లు వెల్లడించారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు తమ ఇంట్లోనే వేర్వేరు గదుల్లో హోం క్వారంటైన్లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కుటుంబం డాక్టర్ల సూచన మేరకు 14 రోజులు హోం క్వారంటైన్లో ఉంటూ చికిత్స పొందనున్నారు. ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ మాస్క్ లు, శానిటైజర్లతో శుభ్రంగా ఉండాలని సూచించారు. ప్రజలంతా కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇక ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కరోనా పాజిటివ్ బారిన పడి చికిత్స పోంది బయటపడ్డారు. ఏకంగా ఉపముఖ్యమంత్రి మహమూద్ అలి, ఉప సభాపతి పద్మారావు, జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్, నిజమాబాద్ అర్భన్ ఎమ్మెల్యే బిగ్గాల గణేశ్ గుప్తా సహా పలువురు కరోనా బారిన పడి చికిత్స పోందారు. ఇక ఇటు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు, గుడూరు నారాయాణ రెడ్డి. బిజేపి నేత చింతల రామచంద్రారెడ్డిలు కూడా కరోనా బారిన పడి కోలుకున్నారు. మరోవైపు తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య నిత్యం వంద దాటుతున్నాయి. ఆదివారం మొత్తం 1296 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా హెల్త్ బులెటిన్లో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 45,076కు చేరింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 12,224గా ఉన్నాయి. గత 24 గంటల్లో 1831 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.
(And get your daily news straight to your inbox)
Jan 11 | తెలంగాణ సీఎం కేసీఆర్ సమీప బంధువుల కిడ్నాప్ కేసులో అరెస్టయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ కోర్టులో పరాభవం ఎదురైంది. అమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం... Read more
Jan 11 | భారత్ లో బర్డ్ ఫ్లూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజుకో రాష్ట్రాలకు రాష్ట్రాలను వ్యాపిస్తూ అందోళనకర పరిస్థితులకు దారితీస్తోంది. బర్డ్ ఫ్లూ కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. మొదట రాజస్థాన్, మధ్యప్రదేశ్లో... Read more
Jan 11 | ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెలలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల కమీషన్ నగరా మ్రోగించిన నేపథ్యంలో దీనిని వ్యతిరేకిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఎన్నికలను నిలుపుదల చేయాలని రాష్ట్ర హైకోర్టును... Read more
Jan 11 | వాట్సాప్.. స్మార్ట్ ఫోన్ వున్న పత్రీ ఒక్కరికీ ఇదో అందివచ్చిన అద్భుత సాధనం.. తమ ఫోటోలతో పాటు పలు వీడియోలు, ఇతర సమాచారాన్ని తమ అప్తులు, స్నేహితులు, బంధువులతో పంచుకునేలా దోహదపడుతోంది. అయితే తాజాగా... Read more
Jan 11 | జమ్మూకాశ్మీర్ లో గత ఏడాది జరిగిన ఎన్ కౌంటర్ పథకం ప్రకారం ఆర్మీ అధికారులు చేసిన ఘటనా..? లేక వారు ఉగ్రవాదులా.? అన్న ప్రశ్నలకు ప్రస్తుతం పోలీసుల చార్జీషీటు సంచలనంగా మారింది, జమ్మూకాశ్మీర్ లోని... Read more