Pedda Jeeyar Swamy tests positive for Covid-19 తిరుమల పెద్ద జియ్యంగార్ స్వామికి కరో్నా పాజిటివ్..

Ttds pedda jeeyar swamy tests positive for covid 19 admitted at svims

Coronavirus in Tirumala, Ramana Deekshitulu, Ramana Deekshitulu on corona, Ramana Deekshitulu on TTD officials, Coronavirus on seven hills Shrine, Coronavirus to TTD priests, coronavirus to TTD Employees, coronavirus TTD staff, TTD meet amid coronavirus, TTD priests, TTD staff, TTD Employees, coronavirus, covid-19, lockdown, chittor collector, Bharat Gupta, Tirumala, Turupati, Andhra pradesh

Former chief priest of Lord Venkateshwara temple on Tirumala A V Ramana Deekshitulu who has started expressing his unhappiness over the state of affairs in the TTD for the last few days, seems to have decided to continue his tirade. He spit fire at the senior officials of the TTD for continuing to allow darshans in the Tirumala temple.

తిరుమల దర్శనాలపై సమీక్షిస్తామన్న టీటీడీ.. నిలిపేయాలన్న రమణదీక్షితులు..

Posted: 07/18/2020 05:48 PM IST
Ttds pedda jeeyar swamy tests positive for covid 19 admitted at svims

దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతుంది. అక్కడి, ఇక్కడ అన్న తేడా లేకుండా ఎక్కడబడితే అక్కడకు చోచ్చుకెళ్తోంది. లాక్ డౌన్ విధింపుతో సుమారు 80 రోజుల పాటు భక్తుల తాకిడి లేకుండా వెలవెలబోయిన కలియుగ వైకుంఠంలో అన్ లాక్ 1.0 మార్గదర్శకాలతో ప్రత్యక్ష దైవం శ్రీవారి దర్శనానికి ద్వారాలు తెరుచుకున్నాయి. ఈ తరుణంలో పవిత్ర కోండపై కరోనా కలకలం రేగింది. గత నెల నుంచి ప్రారంభమైన శ్రీవెంకటేశ్వరుడి దివ్యదర్శనం నేపథ్యంలో ఏడుకోండలపై కరోనా కలవరం తీవ్ర అందోళనకు గురిచేసింది. గత నెలలో ఆంక్షల నడుమ దర్శనాలను ప్రారంభించిన తరువాత, పలువురు అర్చక సిబ్బందికి, స్వామివారి కైంకర్యాలు నిర్వహించే అర్చకులకు కూడా కరోనా పాజిటివ్ సోకింది.

తాజాగా తిరుమల ఆలయ పెద్ద జీయ్యంగార్ కు కూడా కరోనా బారిన పడ్డారు. ఆయనకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. ఇటీవలి కాలంలో అర్చకులలో చాలా మందికి కరోనా బారిన పడిన తాజా సమాచారం ప్రకారం తిరుమల కోండపై ఏకంగా 170 మందికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. వీరిలో ఏకంగా 18 మంది అర్చక సిబ్బందికి కూడా కరోనా సోకింది. ఇక అందులోనూ స్వామివారి నిత్యాకైంకర్యాల పర్యవేక్షకులకు కరోనా సోకడంతో చర్చనీయాంశంగా మారింది. అందులో ఒకరి పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం, దీంతో సదరు అర్చక సిబ్బందికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అర్చకుడిని మద్రాసు అపోలో అసుపత్రికి తరలించారు.

ఇక అదే సమయంలో తిరుమల పెద్ద జీయ్యంగార్ స్వామికి కూడా కరోనా పాజిటివ్ సోకింది, దీంతో పెద్ద జీయ్యాంగార్ స్వామిని తిరుమల శ్రీ వెంకటేశ్వర ఇస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోని శ్రీ పద్మావతి ఆసుపత్రిలో చేర్చించి చికిత్స అందిస్తున్నారు. తిరుమలలో నెలకోన్న కరోనా భయాందోళన పరిస్థితులపై మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మరోమారు ట్విట్టర్ వేదికగా స్పందించారు. కొన్ని వారాల పాటు శ్రీవారి దర్శనానికి భక్తుల అనుమతి నిలిపివేయాలని తితిదే అధికారులకు సూచించారు. శ్రీవారికి కైంకర్యాలు నిర్వహించే అర్చకుల స్థానాన్ని మరొకరు భర్తీ చేయలేరని, అర్చకులను సంరక్షించి స్వామివారికి పూజలు ఏకాంతంగా నిర్వహించాలని పేర్కొన్నారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో 50 మంది అర్చకులు పని చేస్తున్నారని.. వారిలో 15 మంది కొవిడ్‌ బారిన పడినా టీటీడీ ఈవో, అదనపు ఈవో శ్రీవారి దర్శనాలను ఆపడంలేదని టీటీడీ ఆగమ సలహా మండలి గౌరవాధ్యక్షుడు రమణ దీక్షితులు ఇదివరకే విమర్శించిన విషయం తెలిసిందే. గురువారం ఆయన సోషల్ మీడియా వేదికగా కరోనా వైరస్ విజృంభిస్తున్నా శ్రీవారి కోండపైకి భక్తులను ఎందుకు అనుమతిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. పవిత్ర కోండపై కరోనా కరాళనృత్యం చేసే ప్రమాదం ఉన్నప్పటికీ దర్శనాలు నిలిపివేయడం లేదన్న ఆయన ఇలాగే కొనసాగితే మరిన్ని ఇబ్బందులు తలెత్తుతాయని రమణదీక్షితులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.  

అయితే ఈ వ్యాఖ్యలపై తొలుత తన అసంతృప్తిని వ్యక్తం చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ సుబ్బారెడ్డి.. స్వామివారి దర్శనాలు నిలిపే పరిస్థితి లేదని చెప్పినా.. ప్రస్తుతం కొండపై నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో సమీక్షిస్తామని స్పష్టం చేశారు. స్వామివారి నిత్య కైంకర్యాల పర్యవేక్షకులు అనారోగ్యానికి గురికావడంపై స్పందించిన ఆయన వారికి మెరుగైన వైద్య చికిత్సను అందించేందుకు చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించాలని తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి ఆదేశించారు. ప్రస్తుతం కైంకర్యాల పర్యవేక్షకుల ఆరోగ్యం నిలకడగానే ఉందని, భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సుబ్బారెడ్డి తెలిపారు. శ్రీవారి దర్శనాల కొనసాగింపు అంశంపై సమీక్షిస్తామని చెప్పారు.

కరోనా వ్యాప్తి ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో తిరుమలలో దర్శనాలు నిలిపివేయాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మరోసారి ట్విటర్‌లో గళమెత్తారు. కొన్ని వారాలపాటు భక్తులకు దర్శనాలు ఆపాలని సూచించారు. శ్రీవారి కైంకర్యాలు నిర్వహించే అర్చకుల స్థానాన్ని మరొకరు భర్తీ చేయలేరన్న ఆయన వారిని సంరక్షించి, స్వామివారికి ఏకాంతంగా పూజలు నిర్వహించాలన్నారు. దర్శనాలు నిలిపివేయడమే భక్తులందరికీ శ్రేయస్కరమని టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, బీజేపి నేత భానుప్రకాష్‌రెడ్డి అన్నారు. అర్చకులు, భక్తుల భద్రత దృష్ట్యా స్వామివారి కైంకర్యాలు గతంలో 83 రోజులు ఎలా ఏకాంతంగా నిర్వహించారో ఆవిధంగా చేయాలని సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles