Covid 19: 1608 fresh cases reported in AP ఏపీలో ఒక్క రోజులో 1608 కేసులు.. 13 మరణాలు

Coronavirus in ap 1608 new covid 19 cases state tally crosses 25 thousand mark

covid-19, coronavirus, coronavirus in india, coronavirus in ap, covid-19 in ap, coronavirus updates, coronavirus pandemic, fight against coronavirus, covid-19 outbreak, coronavirus outbreak in andhra pradesh, coronavirus in nellore, coronavirus in Krishna, coronavirus in prakasam, coronavirus in in kadapah, coronavirus in west godavari, coronavirus news, coronavirus latest news, coronavirus latest update, coronavirus andhra pradesh, coronavirus updates

The total number of COVID-19 cases in Andhra Pradesh crosses 25000 Mark after 1608 new cases were reported in the last 24 hours, out of which 13,194 have so far recovered and have been discharged, while 292 have died, the state health department said.

ఏపీలో కరోనా ఉదృతి.. 25 వేలు ధాటిన కేసులు..277 మరణాలు

Posted: 07/10/2020 05:24 PM IST
Coronavirus in ap 1608 new covid 19 cases state tally crosses 25 thousand mark

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతోంది. మే నెల చివరి వారం నుంచి వేగాన్ని పుంజుకున్న కరోనా మహమ్మారి రాష్ట్రంలో రోజుకు వందలాది మందిని తన ప్రభావానికి గురిచేస్తోంది, ఫలితంగా రాష్ట్రంలో కరోనా కేసులు ఇరవై ఐదు వేల మార్కుకు అధిగమించాయి. ఇక పక్షం రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతుండటం అందోళన రేకెత్తిస్తోంది. దాదాపుగా పక్షం రోజులుగా ప్రతీ రోజు వెయి మార్కుకు పైగానే అటుఇటుగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు నిర్థారణతో ఏకంగా ఇరవై ఐదు వేల మార్కును అధిగమించి పరుగులు పెడుతోంది, ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి కఠినచర్యలు తీసుకుంటున్నా వైరస్ ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఇటీవల రోజూ వెయ్య సంఖ్యకు పైబడి నమోదువుతున్న కేసులు.. గడిచిన 24 గంటల వ్యవధిలో వెయ్యిన్నరకు పైగా కేసులు నమోదు కావడం ఆందోళన వ్యక్తం అయ్యింది.

తాజాగా నమోదైన పాజిటివ్ కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య ఏకంగా ఇరవై ఐదు వేల మార్కును అధిగమించింది. ఈ మేరకు భారత వైద్యఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో వివరాలను పేర్కోంది. తాజాగా 1608 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో మొత్తంగా 25,422 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఇందులో విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు పోరుగు రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు కూడా వున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి సంఖ్య ఏమీ లేకపోగా, ఇతర రాష్ట్రాలకు నుంచి వచ్చిన 32 మందికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. మొత్తంగా 32గా నమోదయ్యాయి. రాష్ట్రంలో మాత్రం 1600 కేసులు నమోదైనట్టు గణంకాలు స్పష్టం చేస్తున్నాయి.

రాష్ట్రంలో ఇవాళ నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా ఆనంతపురంలో 91, చిత్తూరు జిల్లాలో 236, తూర్పు గోదావరి జిల్లాలో 47, గుంటూరు జిల్లాలో 228, కడప జిల్లాలో 114, కృష్ణా జిల్లాలో 127, కర్నూలు 73. నెల్లూరు జిల్లాలో 31, ప్రకాశం జిల్లాలో 96 పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి, శ్రీకాకుళం జిల్లాలో 206, విశాఖపట్నం జిల్లాల్లో 208, విజయనగరంలో 26, పశ్చిమ గోదావరి జిల్లాలోనూ 17 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, దీంతో జిల్లా వైద్యశాఖ అధికారులు కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో కంటైన్ మెంట్ జోన్లు ఏర్పాటు చేసి.. వైరస్ వ్యాప్తి చెందకుండా పటిష్ట చర్యలు తీసుకునన్నారు. ఇక పురపాలక సంఘాలు, గ్రామపంచాయితీల ఆధ్వర్యంలో కంటైన్ మెంట్ జోన్లలో రసాయనాలు చల్లారు. ఆయా ప్రాంతాలను సానిటైజ్ చేశారు.

కాగా, రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా బారినపడి 15 మంది అసువులు బాసారు. కరోనా వైరస్‌తో అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కృష్ణ, కర్నూలులో ఇద్దరు చోప్పునా.. నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కోక్కరు చోప్పున మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో 292 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా రాష్ట్రంలోని పలు ఆసుపత్రుల నుంచి ఇవాళ 904 మంది కోవిడ్ వైరస్ నుంచి కోలుకున్నారు. వీరిని గడిచిన 24 గంటల్లో కరోనాబారిన పడి కోలుకున్న పేషంట్లను వైద్యాధికారులు ఇవాళ డిశ్చార్జ్ చేశారు. దీంతో కోరాన వైరస్ బారిన పడి చికిత్స పోందుతూ అసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 13,194కు చేరడం రాష్ట్రప్రజలకు, వైద్య సిబ్బందికి కొంత ఊరటనిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుత్తం యాక్టివ్ గా వున్న కరోనా కేసులు 11,936కు చేరాయి. ఇక కరోనా బారిన పడి.. విదేశాల నుంచి వచ్చి.. చికిత్స పోందుతున్న వారి సంఖ్య 424గా నమోదు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికుల సంఖ్య కూడా ఏకంగా 2351కు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles