కొవిడ్-19 వైరస్ గతంలో ఏ వైరస్ కూడా ఇంతటి ప్రభావవంతమైనది కాదని తెలుస్తోంది. ఈ వైరస్ ఎన్నో రకాలుగా రూపాంతరం చెందుతుందన్న వివరాలతో ఖంగుతింటున్న ప్రజలు.. దీని లక్షణాల జాబితాను కూడా పెంచుతూ పోతున్నారు. దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలతో పాటు ఇటీవల వెన్నునొప్పి, కడుపు నొప్పి, దద్దుర్లు, మోకాలి కింది భాగంలో నొప్పి వంటి లక్షణాలను కూడా చేర్చారు. ఆ తరువాత ఇక తాజాగా వాంతులు, విరోచనాలు, జలుబు, ముక్క కారడం కూడా ఈ వైరస్ లక్షణాలలో చేర్చారు. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా కోటి 12 లక్షల మందిని ఈ మహమ్మారి తన ప్రభావానికి గురిచేసి వారిలో ఏకంగా ఐదు లక్షల మందిని కబళించి వేయడానికి కారణాలపై ఓ వైపు అధ్యయనాలు కోనసాగుతూనే వున్నాయి.
ఈ క్రమంలో చేతులకు సానిటైజర్ రాసుకోవడం.. ముఖానికి మాస్క్ లు ధరించడం, వంటి చర్యలు చేపట్టాలని ప్రపంచ దేశాల్లోని ప్రముఖులు ఇప్పటికే ఆయా దేశాల ప్రజలకు కోరుతున్నారు. కాగా తాజాగా 32 దేశాలకు చెందిన 239 మంది వైద్య నిపుణుల బృందం చేసిన తాజా అధ్యయనాల్లో కరోనా మహమ్మారి గాలి నుంచి కూడా సోకుతుందని అందుకు తమ వద్ద ఆధారాలు కూడా వున్నాయిని అన్నారు. ఈ మేరకు తమకు లభించిన ఆధారాలతో త్వరలోనే ఓక ఆరోగ్య సంబంధమైన పత్రికలో పూర్తి కథనాన్ని ప్రచురించేందుకు కూడా తాము సుముఖత వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. గాలి నుంచి కరోనా వ్యాధి సంక్రమిస్తుందని చెప్పడానికి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న దాంట్లో నిజం లేదని కూడా వైద్య నిపుణుల బృందం స్పష్టం చేసింది.
ఈ మేరకు వైరస్ సంక్రమించే విధానాల్లో గాలి నుంచి కూడా వ్యాప్తి చెందుతుందన్న విషయాన్ని పోందుపర్చాలని, ఇక దీంతో పాటు తమ సైంటిపిక్ జర్నల్ లో తమ లేఖను కూడా ప్రచురించేందుకు ప్రణాళిక సిద్దం చేయాలని కోరింది. కరోనా బాధితులు తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు వెలువడే తుంపర్లు గాలిలోని చిన్న అణువుల్లోకి ప్రవేశించి ఒక గది వంటి నిర్దేశిత ప్రాంతంలో తిరుగుతూ వైరస్ను వ్యాప్తి చేస్తాయని శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. గాలిలో ఉండే చిన్న చిన్న అణువుల ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుందని అని చెప్పడానికి తమ వద్ద ఆధారాలు వున్నాయని శాస్త్రవేత్తల బృందం పేర్కోంది. వైరస్ వ్యాప్తి కట్టడికి సంబంధించిన సూచనలు, సిఫార్సులను సవరించాలని డబ్ల్యూహెచ్ఓకు సూచించింది.
గాలి ద్వారా వైరస్ వ్యాపి చెందుతుందని అనడానికి బలమైన ఆధారాలు లేవని డబ్ల్యూహెచ్ఓ ఇప్పటికీ చెబుతూ వస్తోంది. వైద్య ప్రక్రియల అనంతరం వెలువడే ఐదు మైక్రాన్ల కంటే చిన్న కణాల ద్వారా మాత్రమే వైరస్ వ్యాపించే అవకాశం ఉందని తెలిపింది. ఇది చాలా అరుదుగా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో గాలి ద్వారా వైరస్ వ్యాపించదని పరోక్షంగా చెప్పింది. అయితే గాలి ద్వారా వైరస్ వ్యాపిస్తుందన్న వార్తల నేపథ్యంలో ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే కోటికి పైగా ప్రజలను తన బాధితుల్ని చేసుకున్న ఈ మహమ్మారి.. ఇంకా ఎంత మందిని తన బారిన వేసుకుంటోందనని అంటున్నారు. ఇన్నాళ్లు ధైర్యంగా వున్నవారు కూడా ఇక జాగ్రత్తులు పాటించాల్సిందేనని అంటున్నారు. ముఖ్యంగా కార్యాలయాలు, పాఠశాలలు, ప్రార్థనా మందిరాలు సహా గాలి, వెలుతురు తక్కువగా ఉండే ప్రదేశాల్లో కట్టడి సవాల్ గా పరిణమించే ప్రమాదం ఉంది. దీంతో గదుల ఆకారంలో గాలి అక్కడే సంచరించకుండా బలమైన ఫిల్టర్లు, అల్ట్రా వాయిలెట్ బల్బులు ఏర్పాటు చేయాల్సిన అవసరం వుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more