(Image source from: Sakshi.com)
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతోంది. మే నెల చివరి వారం నుంచి వేగాన్ని పుంజుకున్న కరోనా మహమ్మారి రాష్ట్రంలో రోజుకు వందలాదిమందిని తన ప్రభావానికి గురిచేస్తోంది, ఫలితంగా రాష్ట్రంలో కరోనా కేసులు పదిహేడు వేల మార్కుకు చేరువలో ఉన్నాయి. ఇక పక్షం రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతుండటం అందోళన రేకెత్తిస్తోంది. దాదాపుగా పక్షం రోజులుగా ఏడు వందల మార్కుకు పైగానే సాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు నిర్థారణతో ఏకంగా పద్దెనిమిది వేల మార్కుకు చేరువలో చేరడం అందోళనకరం, ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి కఠినచర్యలు తీసుకుంటున్నా వైరస్ ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఇటీవల రోజూ ఐదు వందలకు పైబడి నమోదువుతున్న కేసులు.. గడిచిన 24 గంటల వ్యవధిలో ఏడు వందలకు పైగా కేసులు నమోదు కావడం ఆందోళన వ్యక్తం అయ్యింది.
తాజాగా నమోదైన పాజిటివ్ కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య ఏకంగా పదిహేడు వేల మార్కును అధిగమించింది. ఈ మేరకు భారత వైద్యఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో వివరాలను పేర్కోంది. తాజాగా 765 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు పద్దెనిమిది వేల మార్కుకు చేరువలో వుంది. రాష్ట్రంలో మొత్తంగా 17,699 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఇందులో విదేశాల నుంచి వచ్చినవారితో పాటు పోరుగు రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు కూడా వున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి సంఖ్య ఆరుగా నమోదుకాగా, ఇతర రాష్ట్రాలకు నుంచి వచ్చిన 32 మందికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. మొత్తంగా 38గా నమోదయ్యాయి. రాష్ట్రంలో మాత్రం 727 కేసులు నమోదైనట్టు గణంకాలు స్పష్టం చేస్తున్నాయి.
రాష్ట్రంలో ఇవాళ నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా ఆనంతపురంలో 127, గుంటూరు జిల్లాలో 60, కర్నూలు 118. ప్రకాశం జిల్లాలో 57 పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి, ఇక మిగతా జిల్లాలో నమోదైన కేసులు జిల్లాల వారీగా చిత్తూరులో 67, తూర్పు గోదావరిలో 102, కడపలో 73, కృష్ణలో 70, నెల్లూరులో 27, విశాఖపట్నంలో 09, విజయనగరంలో 13 కేసులు నమోదయ్యాయి, అయితే శ్రీకాకుళం జిల్లాలో మాత్రం కరోనా కాసింత అదుపులో వుంది. ఈ జిల్లాలో ఇవాళ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఇక అదే బాటలో పశ్చిమ గోదావరి కూడా కేవలం 4 కేసులు నమోదయ్యాయి, దీంతో జిల్లా వైద్యశాఖ అధికారులు కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో కంటైన్ మెంట్ జోన్లు ఏర్పాటు చేసి.. వైరస్ వ్యాప్తి చెందకుండా పటిష్ట చర్యలు తీసుకునన్నారు. ఇక పురపాలక సంఘాలు, గ్రామపంచాయితీల ఆధ్వర్యంలో కంటైన్ మెంట్ జోన్లలో రసాయనాలు చల్లారు. ఆయా ప్రాంతాలను సానిటైజ్ చేశారు.
కాగా, రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా బారినపడి పదిమంది అసువులు బాసారు. కొవిడ్ కారణంగా గడచిన 24 గంటల్లో పన్నెండు మంది మృతిచెందారు. కర్నూలులో ముగ్గురు, శ్రీకాకుళంలో ముగ్గురు, విశాఖపట్నంలో ఇద్దరు, చిత్తూరులో ఇద్దరు, కడపలో ఒక్కరు, విజయనగరంలో ఒక్కరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 218 చేరింది. కాగా గడిచిన 24 గంటల్లో కరోనాబారిన పడి కోలుకున్న పేషంట్లను వైద్యాధికారులు ఇవాళ డిశ్చార్జ్ చేశారు. దీంతో కోరాన వైరస్ బారిన పడి చికిత్స పోందుతూ అసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 7632కు చేరడం రాష్ట్రప్రజలకు, వైద్య సిబ్బందికి కొంత ఊరటనిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుత్తం యాక్టివ్ గా వున్న కరోనా కేసులు 9473కు చేరాయి. ఇక కరోనా బారిన పడి.. విదేశాల నుంచి వచ్చి.. చికిత్స పోందుతున్న వారి సంఖ్య 415గా నమోదు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికుల సంఖ్య కూడా ఏకంగా 2143కు చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more