Coronavirus Reaches Tirumala priests and staff తిరుమలలో తీవ్ర కలకలం.. అర్చక సిబ్బందిలో 10 మందికి కరోనా.!

Ttd board to meet on sunday amid staff testing positive for coronavirus

Coronavirus in Tirumala, Coronavirus on seven hills Shrine, Coronavirus to TTD priests, coronavirus to TTD Employees, coronavirus TTD staff, TTD meet amid coronavirus, TTD priests, TTD staff, TTD Employees, coronavirus, covid-19, lockdown, chittor collector, Bharat Gupta, Tirumala, Turupati, Andhra pradesh

After the 2 and half months of continuous lockdown, the TTD officials have started allowing the devotees to Tirumala to visit Lord Balaji. It seemed everything is going smoothly. But all of a sudden 10 temple staff tested positive for Covid-19.

తిరుమలలో తీవ్ర కలకలం.. అర్చక సిబ్బందిలో 10 మందికి కరోనా.!

Posted: 07/03/2020 04:57 PM IST
Ttd board to meet on sunday amid staff testing positive for coronavirus

దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతున్న వేళ సుమారు 80 రోజుల విరామం తరువాత అన్ లాక్ 1.0 మార్గదర్శకాలతో కలియుగ శ్రీవారి దర్శనానికి ద్వారాలు తెరుచుకున్న తరుణంలో కరోనా కలకలం రేగింది. గత నెల వ తేదీ నుంచి ప్రారంభమైన శ్రీవెంకటేశ్వరుడి దివ్యదర్శనం నేపథ్యంలో ఏడుకోండలపై కరోనా కలవరం తీవ్ర అందోళనకు గురిచేసింది.గత నెలలో ఆంక్షల నడుమ దర్శనాలను ప్రారంభించిన తరువాత, స్థానిక బాలాజీ నగర్ లోని ఓ వ్యక్తికి వైరస్ సోకిన సంగతి తెలిసిందే. ఆపై మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన టీటీడీ అధికారులు, దశలవారీగా ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో ఈ వారం ప్రారంభంలో తిరుమలలో విధులు నిర్వహిస్తున్న వారి నమూనాలు సేకరించి, పరీక్షలకు పంపారు. టీటీడీ ఉద్యోగులు, స్వామి కైంకర్యాల్లో పాల్గొనే పూజారులు సహా మొత్తం 10 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. వారందరినీ వెంటనే ఆసుపత్రులకు తరలించి, వారి కుటుంబీకులకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. అయితే తిరుమలకు వచ్చే భక్తులకు కొండ దిగువనే కరోనా పరీక్షలు చేస్తుండగా, కోండపైకి మహమ్మారి ఎలా ప్రవేశించిందన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

తిరుమలకు వచ్చే భక్తులందరికీ అలిపిరిలోనే థర్మల్ స్క్రీనింగ్ ను చేస్తున్నామని, జ్వరం లేకుంటేనే కొండపైకి అనుమతిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. అయితే తిరుపతిలో కోరానా సోకిన వ్యక్తులు కోండపైకి వచ్చిన నేపథ్యంలో ఈ వైరస్ సోకి వుంటుందని అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. ఏ విధమైన కరోనా లక్షణాలున్నా, కొండపైకి రావద్దని భక్తులకు విజ్ఞప్తి చేసిన వైవీ సుబ్బారెడ్డి, తిరుమలలో ఎప్పటికప్పుడు శానిటైజేషన్ ప్రక్రియను చేస్తున్నామని, క్యూలైన్లను నిత్యమూ శుభ్రపరుస్తున్నామని తెలిపారు. టీటీడీ ఉద్యోగులు వారం రోజుల పాటు కొండపైనే ఉండే విధంగా షిఫ్ట్ లలో విధులను వేస్తున్నామని గుర్తు చేసిన ఆయన, గత నెల ఆఖరి వారంలో విధులు నిర్వహించిన వారిలో కొందరికి వైరస్ సోకిందని అన్నారు. ఇక తాజా పరిణామాలపై చర్చించేందుకు ఈ ఆదివారం టీటీడీ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేశామని.. ఈ సమావేశంలో ప్రస్తుత పరిణామాలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై చర్చిస్తామని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles