సీనియర్ కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ నివాసంపై ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు దాడి చేశారు. ఇవాళ ఉదయం ముగ్గురు సభ్యులున్న అధికారుల బృంధం అహ్మద్ పటేల్ ను విచారించింది. దేశంలోని ఏ దర్యాప్తు సంస్థ ఇప్పటివరకు ఆయను ఏ కేసులోనూ విచారించలేదు. తొలిసారిగా ఆయనను ఇవాళ మనీలాండరింగ్ కేసులో దర్యాప్తు సంస్థ ఈడీ విచారించింది. వేలకోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిన సందేశారా సోదరుల కుంభకోణానికి సంబంధించిన కేసులో ఆయనను ప్రశ్నించనున్నామని అధికారులు తెలిపారు. కాగా, మనీ లాండరింగ్ నిరోధక చట్టం క్రింద ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నమని వారు వివరించారు.
ఈ కేసు విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ అహ్మద్ పటేల్ కు గతంలో రెండు సార్లు సమన్లు జారీ చేసింది. అయితే వయోవృద్ధులు తమ ఇళ్లకే పరిమితం కావాలన్న కొవిడ్-19 వ్యాప్తి మార్గదర్శకాల అనుసారం.. తాను హాజరు కాలేనంటూ అహ్మద్ పటేల్ తన అశక్తత వెలిబుచ్చారు. ఆయన విజ్ఞప్తిని అమోదించిన ఈడీ, దర్యాప్తు బృందాన్ని మధ్య ఢిల్లీలోని మదర్ థెరిసా క్రిసెంట్ వద్దనున్న ఆయన ఇంటికే పంపేందుకు అంగీకరించింది. కాగా ఇదివరకే అహ్మద్ పటేల్ తనయుడు ఫైసల్ పటేల్ సహా అల్లుడు ఇర్ఫాన్ సిద్దిఖీలను ఎన్ ఫోర్స్ మెండ్ డైరెక్టరేట్ పలు పర్యాయాలు విచారించింది, ఆనంతరం అహ్మద్ పటేల్ ను ఇవాళ తొలిసారి విచారించింది.
గుజరాత్ కు చెందిన స్టెర్లింగ్ బయోటెక్ సంస్థ, ఆంధ్రా బ్యాంకు నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం నుంచి రూ.5,383 కోట్ల రుణాలను పొందింది. అనంతరం చెల్లింపులు లేకపోవటంతో దీనిని నిరర్ధక ఆస్తిగా ప్రకటించారు. కాగా, ఈ రుణం విలువ ప్రస్తుతం రూ.14,500 కోట్లకు చేరినట్టు అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంలో సంస్థ యజమానులైన చేతన్ సందేశారా, నితిన్ సందేశారా సోదరులతో సహా మరికొందరికి భాగస్వామ్యముందని అనుమానిస్తున్నారు. ఈ కుంభకోణం నేపథ్యంలో నిందితులు దేశం దాటి అల్బానియాకు పారిపోయి అక్కడ తలదాచుకున్నారు. ఈ కేసుపై సీబీఐ అక్టోబర్ 2017లో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కాగా సందేశారా సోదరులకు చెందిన దాదాపు 9500 కోట్ల ఆస్తులను కూడా స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో అహ్మద్ పటేట్ కు సందేశారా సోదరుల నుంచి లబ్ది చేకూరిందని ఈడీ అనుమానిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more