నర్సాపురం అధికార పార్టీ పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణంరాజు సొంతపార్టీ వైసీపీపై ఢిల్లీలోని కేంద్ర మంత్రులకు పిర్యాదు చేశారు. వైసీపీ నేతలు తనపై సోషల్ మీడియాతో దుష్ఫ్రచారం చేస్తున్నారని బెదిరింపులకు పాల్పడుతున్నారని అరోపించారు. వైసీపీ నేతలపై దూకుడు పెంచిన ఆయన ఓ వైపు తనకు షోకాజ్ నోటీసులు జారీ చేసేందుకు విజయసాయిరెడ్డికి అర్హత వుందా అని ప్రశ్నించిన ఆయన తనపై సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారంపై జిల్లా ఎస్పీకి పిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయాలను తప్పుబట్టినందుకు.. తనను టార్గెట్ చేశారని అ్నారు.
ఇవాళ ఢిల్లీకి పర్యటనకు వచ్చాన ఆయన కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కూడా కలిశారు. ఆనంతరం ఆయన మీడియాతో పాట్లాడుతూ వైసీపీ నేతల బెదిరింపులపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని.. ఒక ఎంపీకే ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమయితే.. ఇక సామాన్యుల పరిస్థితి ఎలా వుంటుందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిస్థితుల నేపథ్యంలో తనకు కేంద్రం నుంచి భద్రత కల్పించాలని కోరినట్టు చెప్పారు, కరోనా పేరుతో తప్పుడు కేసుల్లో ఇరికించే ప్రమాదం కూడా ఉన్నందున ఇప్పట్లో నియోజకవర్గానికి వెషళ్లబోనని చెప్పారు. తనకు లభించే కేంద్రం భద్రతతోనే నర్సాపురానికి వెళ్తానని చెప్పారు.
తాను పార్టీని, పార్టీ అధినేతను కానీ ఎఫ్పడూ వ్యతిరేకించలేదని, విమర్శించలేదని అన్నారు. క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తనని వివరించారు. విజయసాయిరెడ్డి ఇచ్చిన షోకాజ్ నోటీసుపై స్పందించాలా? ముఖ్యమంత్రికి వివరణ ఇవ్వాలా? అనే అంశంపై న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నట్టు చెప్పారు. షోకాజ్ నోటీసుకు సంబంధించిన నిబంధనలు తెలుసుకునేందుకు నిన్న ఎన్నికల కమిషన్ అధికారులను కలిసినట్టు తెలిపారు. సీఎంను కలిసేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టు తెలిపారు. కానీ, సీఎంను కలిసే అవకాశం లభిస్తుందని తాను అనుకోవడం లేదన్నారు. పార్టీ అధ్యక్షుడిని పల్లెత్తిమాట అననప్పటికీ తనను పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకు కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more