ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ రాష్ట్ర పాలనా పగ్గాలను చేపట్టి ఏడాది పూర్తైన సందర్భంలో సంబరాలు జరగాల్సిన ఆ పార్టీలో ప్రస్తుతం అసమ్మతి గళాలు, అసంతృప్తులకు వినిపిస్తున్నాయి. అంతేకాదు గళం వినిపిస్తున్న నేతలకు తాజాగా షోకాజ్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. వాటిని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి జారీ చేశారు. వైసీపీ పార్టీ హైకమాండ్ తోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేల అవినీతిపై కూడా వ్యాఖ్యలు చేయడంతో.. మీడియా ముందు తన అభిప్రాయాలను వెళ్లగక్కిన నరసాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణంరాజుకు పార్టీ తాజాగా షోకాజ్ నోటీసులు జారీచేసింది.
పార్టీ అధిష్ఠానానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఆంగ్ల మాధ్యమం విషయంలో పార్టీ మేనిఫెస్టోకు భిన్నంగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారని తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యేలు రాష్ట్రంలో ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారంటూ ఆయన ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు గుప్పించారని తెలిపారు. రఘురామకృష్ణం రాజు సొంత పార్టీని కించపర్చేలా వ్యాఖ్యలు చేయడమే కాకుండా సీఎం జగన్పై కూడా పలు వ్యాఖ్యలు చేశారని చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలన్నింటికీ వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని పేర్కొంటూ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు వైసీపీ పేర్కొంది.
అయితే ఈ విషయాలపై పార్టీలో పార్టీపరంగా చర్చించాల్సిన అంశమని పేర్కొనాల్సిన అంశమని.. దీనిపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలోనే చర్చించాలని తాను భావించినా.. తనకు సమయాన్ని కేటాయించకపోవడంతోనే విషయంపై మీడియా ముఖ్యంగా స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఇక ఇక్కడ ఆయనకు వ్యతిరేకంగా ప్రసాద రాజు సహా పలువురు ఎమ్మెల్యేలు కూడా మీడియా ముఖంగా ఎంపీపై పలు విమర్శలు చేశారు, అయితే వీరికి మాత్రం పార్టీ ఎలాంటి షోకాజ్ నోటీసులు జారీ చేయలేదు. ఒకరికి వర్తించిన సూత్రం.. తమ పక్షాన నిలిచినంత మాత్రమే ఇతరులకు వర్తించవా..? అన్న ప్రశ్నలు వినబడుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more