CBSE 2020 Exams' Dilemma: Between cancelled or not మరో రెండ్రోజుల సమయం ఇవ్వండీ: సుప్రీంకు సీబీఎస్ఈ బోర్డు

Cbse board exams decision on cancellation to be taken within 48 hours sc told

cbse, cbse board exams cancel, cancel cbse board exams, supreme court cbse board exams, hrd ministry cbse board exams, parents cbse board exams, cbse board exam, cbse exam scrapping, supreme court, supreme court on cbse board exam, cbse board exam, cbse 10th exams, cbse 12 exam, cbse board exam cancelled, supreme court, students, parents

The Supreme Court of India told CBSE to consider scrapping of remaining papers of class 10th and 12th board exams and to allot marks on the basis of internal assessment. A 3-judge bench headed by Justice AM Khanwilkar asked CBSE to take instructions and inform by Tuesday.

పరీక్షలకు సన్నధం కావాలా.? వద్దా.? సీబీఎస్ఈ 10, 12 విద్యార్థుల్లో ఉత్కంఠ

Posted: 06/23/2020 09:41 PM IST
Cbse board exams decision on cancellation to be taken within 48 hours sc told

సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షలను నిర్వహణపై స్పష్టతను వ్యక్తం చేసేందుకు మరో రెండు రోజుల సమయం కావాలని సీబీఎస్ఈ బోర్డు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును కోరింది. దేశంలో కరోనా విజృంభన కొనసాగుతూ.. రోజురోజుకూ వ్యాప్తి అధికమౌతున్న తరుణంలో విద్యార్థుల జీవితాలతో బోర్డు చెలగాటం ఆడకుండా సత్వర్యంగా నిర్ణయం తీసుకోవాలని దేశ అత్యున్నత న్యాయస్థానం మానవవనరుల మంత్రిత్వశాఖను అదేశించిన విషయం తెలిసిందే. అయితే అందుకు ఈ మంగళవారాన్ని తుది గడువుగా సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం ఎదుట హాజరైన సీబీఎస్ఈ బోర్డు సభ్యులు మరో రెండు రోజుల సమయం కావాలని అర్థించారు.

సీబీఎస్ఈ పదవ తరగతి, పన్నెండవ తరగతి పరీక్షలను రద్దు చేయాలా.? లేక నిర్వహించాలా.? అన్న అంశంపై చర్చలు జరుగుతున్నాయని, ఈ విషయంలో నిర్ణయం వెలువడేందుకు మరికొంత సమయం పడుతుందని అన్నారు. ప్రస్తుతం చర్చలు తుదిదశకు చేరుకన్నాయని సెకండరీ ఎడ్యూకేషన్ సెంట్రల్ బోర్డు జస్టిస్ ఎఎమ్ ఖాన్విల్కర్ నేతృత్వంలోని అత్యున్నత న్యాయస్థానానికి చెందిన తిసభ్య ధర్మాసనం తుదిదశకు చేరుకుంది. పరీక్షలను రద్దు చేసి తరగతుల్లో అంతర్గతంగా నిర్వహించిన పరీక్షల మార్కుల ఆధారంగా వారికి మార్కులను కేటాయించాలని న్యాయస్ఝానం సూచనలను కూడా తమ చర్చల్లో భాగంగా పరిగణలోకి తీసుకున్నామని బోర్డు తరపు న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు.

సీబీఎస్ఈ మాత్రం ఇప్పటికే అటు పదో తరగతి, ఇటు పన్నెండవ తరగతికి చెందిన పలు సబెక్టులకు పరీక్షలను ఇప్పటికే నిర్వహించింది. ఈ క్రమంలో కరోనా వ్యాప్తిని నియంత్రణకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో పరీక్షలు అర్థంతరంగా నిలిచిపోయాయి. దీంతో జూలై 1 నుంచి జూలై 15 మధ్య మిగిలిన పరీక్షలు నిర్వహించాలని సిబిఎస్‌ఈ యోచిస్తోంది. దీంతో సీబీఎస్ఈ బోర్డుపై విద్యార్థుల తల్లిదండ్రులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. కరోనా మహమ్మారి దేశంలో నానాటికి తన వ్యాప్తిని విస్తరింపజేసుకుంటున్న తరుణంలో సీబీఎస్ఈ బోర్డు మాత్రం పరీక్షలు నిర్వహిస్తోందట అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

దేశంలో నెలకోన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులకు పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ ఓ విద్యార్థి తండ్రి అమిత్ బాత్లా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. కరోనా ఉదృతి కోనసాగుతున్న నేపథ్యంలో సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు నిర్వహించినా తాము తమ పిల్లలను పరీక్షలకు పంపించలేమని ఆయన పిటీషన్లో పేర్కోన్నారు. ఎక్కడి నుంచి ఎలా దాడి చేస్తుందో తెలియని కరోనాతో యుద్దం చేస్తూ విద్యార్థులు పరీక్షలు రాయడానికి మనోవేధనను అనుభవించాల్సి వస్తుందని అమిత్ బాత్లా తన పిటీషన్ లో పేర్కోన్నారు. దీనిపై విచారించిన న్యాయస్థానం సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేసి వారి ఇంటర్నల్ అసెస్ మెంట్ మార్కుల ఆధారంగా గ్రేడ్లను కేటాయించాలని న్యాయస్థాన ధర్మాసనం సీబీఎస్ఈ బోర్డును అదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles