ప్రపంచదేశాలను గత కొన్ని నెలలుగా గడగడలాడిస్తున్న కరోనా వైరస్.. అనేక దేశాలు లాక్ డౌన్ ప్రకటించేందుకు కూడా కారణమైంది. ఇప్పటి వరకు దీనిని నోవల్ కరోనా వైరస్ దీనిని పిలివడానికి కారణం చికిత్సకు మందులు లేకపోవడమే. కానీ ఇప్పుడు గ్లెన్ మార్క్ తీసుకువచ్చిన ఫ్యాబిఫ్యూతో వైరస్ ప్రాథమిక, మధ్యమిక దశలో వున్న కరోనా రోగులను చికిత్స చేయవచ్చునని సంస్థ ప్రకటించింది. ఫవిపిరవిర్ అనే యాంటీ వైరస్ ఔషధంపై అధ్యయనం చేసిన గ్లెన్ మార్క్.. దీంతో కరోనా స్వల్ప, మధ్యస్థ లక్షణాలతో బాధపడుతున్న వారిపై బాగా పనిచేస్తోందని వెల్లడించింది. దీనిని ఫాబిఫ్లూ బ్రాండ్ పేరిట మార్కెట్లోకి విడుదల చేసేందుకు ఇండియన్ డ్రగ్ కంట్రోల్ బోర్డు అనుమతులను మంజూరు చేసింది.
ఇది వచ్చిన మరుసటి రోజునే హెటిరో డ్రగ్స్ సంస్థ కోవిఫర్ అనే ఇంజక్షన్ ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది కరోనా ప్రభావం అధికంగా వుండి.. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారిన రోగులపై పనిచేస్తుందని తెలిపింది. ఇక హెటిరో తో పాటు కలసి పనిచేసిన మరో కంపెనీ సిప్లాకు కూడా ఈ మందును తయారు చేసి విక్రయించేందుకు భారత డగ్ర్ కంటోల్ బోర్డు అనుమతులు మంజూరు చేసింది. ఇది కూడా కోవిఫర్ మాదిరిగానే ఇంజక్షన్ మంది. ఇది కూడా సరిగ్గా కోవిఫర్ మందు తరహాలోనే పనిచేస్తంది. కరోనా వైరస్ ప్రభావం అధికంగా వున్న రోగులకు మాత్రమే ఈ డ్రగ్ వినియోగించాల్సి వుంటుంది.
గ్లెన్ మార్క్ తీసుకువచ్చిన ఫాబిఫ్లూ మాత్రలు కాసింత ఖరీదేనని చెప్పుకుంటున్న తరుణంలో హెటిరో డగ్ర్ తీసుకువచ్చిన ఇంజక్షన్ ఖరీదు మరీ ఎక్కువ. అదే సమయంలో సిప్లా తీసుకువచ్చిన ఇంజక్షన్ దర కూడా ఐదు వేల పైమాటే. ఇక దీనిని కరోనా ప్రభావం అధికంగా వున్న రోగులకు ఇచ్చే డోసేజ్ కూడా అధికంగానే వుంది. భారత ఔషధ నియంత్రణ మండలి సూచనల ప్రకారం ఏకంగా ఏడు ఇంజక్షన్లను వినియోగించాలి. తొలి రోజున ఉదయం సాయంకాలల్లో ఒకక్కటి.. ఆ తరువాత ఐదు రోజులకు ఐదు ఇంజక్షన్లను ఇవ్వాలని సూచించింది. దీంతో అధికంగా కరోనా బారిన రోగికి ఏకంగా 35 నుంచి 42 వేలు ఇంజక్షన్లకు ఖర్చుచేయాల్సి వుంటుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more