అంతర్జాతీయంగా క్రూడ్ ఇంధనాని డిమాండ్ పెరుగడంతో దేశంలోనూ పెట్రోల్, డీజిల్ ధరలకు కూడా రెక్కలు వస్తున్నాయి. గత పక్షం రోజులుగా పెరుగుతున్న ఇంధన ధరలు మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పెరగాయి. వాహనదారుల జేబులను ఖాళీ చేయాలన్నదే టార్గెట్ గా పెట్టుకున్న ఇంధన సంస్థలు వరుసగా పదహారు రోజులుగా ఏకంగా డీజిల్ పై పది రూపాయల మేర, పెట్రోల్ పై ఎనమిన్నదర రూపాయల మేర ధరలను పెంచేశాయి. ఇక తాజాగా పదహారవ రోజన కూడా కేంద్రం ఇంధన సంస్థల పెంపును అనుమతిచింది. ఇవాళ లీటరు పెట్రోల్ పై 33 పైసలు, లీటరు డీజిల్ పై 58 పైసలు మేర ధరను పెంచుతూ ఇంధన సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.
ఇంధన ధరలపై కేంద్రం చేతులెత్తేసిన 2002 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఏ పక్షం రోజుల్లోనూ ఇంతగా ఇంధన ధరలు పెరగలేదు. పక్షం రోజులకో పర్యాయం ఇంధన ధరల పెంపుపై కేంద్రంతో పాటు చమురు సంస్థలు భేటీ అయ్యి నిర్ణయం తీసుకునేవి. కానీ ప్రధాని మోడీ హాయంలో రోజువారీగా ఇంధన ధరలను పెంచుతూ వచ్చారు. అయితే రోజువారీగా ధరలను అంతర్జాతీయ మార్కెట్ కు అనుసంధానం చేస్తూ పెంచుతున్నా.. అక్కడ ధరలు తగ్గిన సమయంలో మాత్రం దేశంలో ఇంధన ధరలు తగ్గేవి మాత్రం కావు. ధరలు తగ్గిన క్రమంలో వాటి ఫలాలను ఎక్సైజ్ డ్యూటీ పేరుతో కేంద్రమో, లేక వ్యాట్ పేరుతో రాష్ట్రాల్లో లేక రవాణ చార్జీల పేరుతో ఇంధన సంస్థలో లబ్ది పోందుతున్నాయే తప్ప.. దేశంలోని వాహనదారులకు మాత్రం ప్రయోజనం కలిగించడం లేదు.
దీంతో 2017 మే నెలలో ఇంధన ధరలపై పక్షం రోజులకో పర్యాయం ధరల పెంపు సమావేశాలను తొలగించిన కేంద్రం.. అప్పటి నుంచి రోజువారీగా ధరలను పెంచుతూ వస్తోంది. ఇక ఈ సమయాన్ని కూడా కలుపుకున్నా ఏ పక్షం రోజుల్లో లేని రికార్డు స్థాయి పెంపు ఈ వారం నమోదైంది. కరోనా మహమ్మారితో పోరాటం చేస్తూ కష్టకాలంలో వున్న ప్రజలకు రాయితీలు కల్పించాల్సిన ప్రభుత్వం.. ధరలను విపరీతంగా పెంచుతూ.. ఇంధనం అంటే కేవలం ధనమే అన్నట్లు పరిగణించడం వాహనదారులపై ధరఘాతం అధిక ప్రభావం చూపుతోంతి. గతంలో ఏ పక్షం రోజులు తీసుకున్నా.. రూ. 5 నుంచి ఆరు వరకు మాత్రమే ధరల పెంపు వుండింది. కానీ ప్రస్తుతం పదహారు రోజుల వ్యవధిలో గరిష్టంగా లీటరు పెట్రోల్ ధరపై ఏకంగా ఎనమిది రూపాయల ముఫై పైసలు.. లీటరు డీజిల్ పై తొమ్మిది రూపాయల 46 పైసల ధల పెరిగింది.
ఇక తాజా పెరుగుదలతో లీటరు పెట్రోల్ ధర దేశ రాజధాని ఢిల్లీలోనే ఏకంగా ఎనబై రూపాయలకు ఎగబాకింది. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 79.56 చేరగా, లీటరు డీజిల్ ధర కూడా 79.23కు చేరింది. కోల్కతాలో లీటరు పెట్రోలు ధర రూ.81.27, డీజిల్ ధర రూ.74.14 గా ఉంది. ముంబైలో లీటరు పెట్రోలు ధర రూ.86.36, డీజిల్ ధర రూ.77.24గా ఉండగా, చెన్నైలో లీటరు పెట్రోలు ధర రూ.82.87, డీజిల్ ధర రూ.76.30గా ఉంది. హైదారాబాదులో లీటరు పెట్రల్ దర ఏకంగా రూ.82.59 పైసలకు చేరగా, డీజిల్ ధర లీటరుకు రూ.77.06 చేరింది. కాగా, ఆంధ్రప్రదేశ్ లోని విజయావాడలో ఇంధన ధరలు కూడా పైకి ఎగబాకాయి. విజయవాడంలో లీటరు పెట్రోల్ ధర రూ.82.93కు చేరగా, లీటరు డీజిల్ ధర రూ.77.37కు చేరింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more