Petrol, diesel price hiked for 11th day today వరుసగా పదకొండవ బాదేసిన ఇం‘ధర’ సంస్థలు..

Petrol price hiked by rs 6 02 a litre in 11 days diesel by rs 6 49 a litre

petrol, diesel, petrol price, diesel price, petrol price hike, diesel price hike, fuel prices in india, Dharmendra Pradhan, GST, Value Added Tax, VAT, Excise Duty on petrol

For the 11th consecutive day today, the price of petrol went up by 55 paise a litre and that of diesel by 60 paise a litre. In these 11 days, petrol price has increased by ₹6.02 a litre and diesel price by ₹6.4 a litre (Delhi rates). Fuel prices are now at its highest level since more than a year.

వరుసగా పదకొండవ బాదేసిన ఇం‘ధర’ సంస్థలు.. రూ.80 దాటిన పెట్రోల్

Posted: 06/17/2020 12:43 PM IST
Petrol price hiked by rs 6 02 a litre in 11 days diesel by rs 6 49 a litre

అంతర్జాతీయంగా ఇంధనాని డిమాండ్ పెరుగుతుండటంతో ధరలకు కూడా రెక్కలు వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ టో గత నెలలో వున్న ఇరవూ డాలర్ల బ్యారెల్ క్రూడ్ అయిల్ ధర రెట్టింపు ధర కన్నా అధికస్థాయికి చేరడంతో ప్రస్తుతం దేశంలో ఇంధన ధరలు ఏడాది గరిష్టస్థాయిని అందుకున్నాయి. ఇదే క్రమంలో వరుసగా పదకొండు రోజులుగా పెరుగుతున్న ఇంధన ధరలు వాహనదారులు జేబులకు చిల్లులు పెడుతున్నాయి. దీంతో ఏకంగా ఏడాది గరిష్టస్థాయికి ఇంధన ధరలు చేరుకున్నాయి. గత పదకొండు రోజులుగా పెరుగుతున్న ధరలతో ఇంధనంపై ఏకంగా ఆరు రూపాయాల మేర పెరిగింది. ఇక తాజా పెరుగుదలతో లీటరు పెట్రోల్ ధర హైదారాబాదులో ఏకంగా రూ.80 దాటేసింది. హైదరాబాద్ తోపాటు అమరావతిలోనూ పెట్రోల్ ధర ఎనభైకి చేరుకుంది.

పెరుగుతున్న ఇంధన ధరలకు తోడు కేంద్రప్రభుత్వం విధించే ఎక్సైజ్ డ్యూటీ పన్నులు, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే విలువ ఆధారిత సేవలు ఇంధన ధరలను అంతకంతకూ పెంచుతున్నాయి. ఇక ఇటీవలే ఇంధన సంస్థలు కూడా తమకు ఇంధన రవాణాలో లీటరుకు ఎనమిది రూపాయల మేర నష్టాన్ని చవిచూస్తున్నామని.. వాటిని వెంటనే భర్తీ చేయాలని కేంద్రాన్ని కోరి.. నష్టాలను భర్తీ చేసుకున్న క్రమంలోనూ ఇంధన ధరలకు రెక్కలు వచ్చాయి. ఇటు పెట్రోల్ తో పాటు ఆటు డీజీల్ ధరలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలకు కూడా పెరుగుతున్నాయి.

దేశంలో లాక్ డౌన్ సమయంలో మారని ధరలు, ఆపై అన్ లాక్ 1.0 ప్రారంభమైన తరువాత, రోజూ పెరుగుతూ వస్తున్నాయి. ఏప్రిల్ నెలతో పోల్చితే గత నెలలో ఇంధన ధరల వినియోగం పెరిగిందని, గత నెలలో ఏకంగా రెట్టింపు వినియోగం అయ్యిందని దేశ అతిపెద్ద రిఫైనరీ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ తెలిపింది. ఈ నేపథ్యంలో వరుసగా పదకొండవ రోజూ ధరలు పెరిగాయి. తాజాగా ఇవాళ బుధవారం నాడు లీటరుపై 55 పైసల మేరకు ధరను పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు వెల్లడించాయి. దీంతో గత పదకొండవ రోజుల్లో పెట్రోలు ధర లీటరుకు ఆరు రూపాయల మేర పెరిగింది. పెట్రోల్ పై పది రోజుల్లో 6.02 మేర, డీజిల్ పై రూ. 6.40 మేర పెరిగినట్లయింది.

ఇక ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే, న్యూఢిల్లీలో పెట్రోలు  రూ. 77.28. డీజిల్   రూ. 75.79కు చేరగా, గుర్గావ్ లో పెట్రోల్ ధర 75.96, డీజిల్ 68.56, ముంబైలో పెట్రోల్  రూ. 84.15, డీజిల్  రూ. 74.32కు చేరాయి. ఇదే సమయంలో చెన్నైలో పెట్రోల్ రూ. 80.86. డీజిల్ రూ. 74.32కు పెరుగగా, బెంగళూరులో పెట్రోల్ రూ. 79.77. డీజిల్ రూ. 72.09కి, హైదరాబాద్ లో పెట్రోల్ రూ. 80.22. డీజిల్ రూ. 74.07కు, అమరావతిలో పెట్రోల్  రూ. 80.66. డీజిల్ రూ. 74.54కు చేరుకున్నాయి. ఇక అటు గుజరాత్ లో మాత్రం ఇంధన ధరలు మరో రెండు రూపాయల మేర పెరిగాయి. కోవిడ్ నష్టాలను పూడ్చుకునేందుకు అక్కడి ప్రభుత్వం వ్యాట్ ను రెండు రూపాయల మేర పెంచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles