రాష్ట్రంలో ఓ వైపు కరోనా పరిస్థితులు ఉదృతంగా వ్యాప్తిచెందుతూ అందోళనకర పరిస్థితులు తలెత్తుతున్న తరుణంలో వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం.. ప్రత్యర్థి రాజకీయ పార్టీల నేతలపై అక్రమ కేసులు బనాయించి కటకటాల వెనక్కి నెట్టే ప్రయత్నాలను ముహ్మరం చేసిందని టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి విమర్శించారు. తన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి, సోదరుడి తనయుడు అస్మిత్ రెడ్డి అరెస్టులపై ఆయన భిన్నంగా స్పందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతున్న వైసీపీ ప్రభుత్వం దేనికైనా తెగిస్తుందన్నారు.
స్వయంగా ఏసు ప్రభువే వచ్చి చెప్పినా వినే పరిస్థితిలో ముఖ్యమంత్రి జగన్ లేడని విమర్శించారు, జగన్ ఎవర్ని చూస్తే వారు ఇప్పుడు కటకటలా వెనక్కి వెళ్లాల్సిందేనని అన్నారు. జగన్ ను కంట్రోల్ లో పెట్టడం ఒక్క ప్రధాని నరేంద్రమోదీతోనే సాధ్యమవుతుందని దివాకర్ రెడ్డి కామెంట్ చేశారు. తమకు కోర్టు తప్ప వేరే మార్గం లేదని ఆయన చెప్పారు. జేసీ అస్మిత్ రెడ్డికి ఈ వ్యవహారానికి సంబంధమే లేదన్నారు. ప్రభుత్వంలో పనిచేసే అధికారులకు నడుములు విరిగిపోయి వారు ఏమీ చేయలేక పోతున్నారని దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తన తమ్ముడి అరెస్టుపై తాను ఏమీ మాట్లాడబోనన్నారు. అరెస్టుకు నిరసనగా ఎలాంటి కార్యక్రమ ప్రణాళిక లేదన్నారు.
తాను నిజం చెబుతున్నానని, తనకు ఎన్ని లారీలు ఉన్నాయో.. ఎన్ని బస్సులు ఉన్నాయో కూడా లెక్కలు తెలియదని అన్నారు. ఎవరు నమ్మినా... నమ్మకపోయినా ఈ విషయంలో తాను ఏం చేసేది లేదని అన్నారు. రాష్ట్రంలోని అధికార వైసీపి ప్రభుత్వం దేనికి అయినా తెగిస్తుందని అరోపించారు. దీనికి రూల్స్ లేవు, రెగ్యులషన్స్ లేవు. చట్టం లేదు. రాజు తలచుకుంటే కొరడా దెబ్బలు కొదవ అన్నట్లు ఉందని.. మొత్తం పాలన ఒక్క చేతిలోనే నడుస్తోందని అన్నారు. ఈ పరిస్థితుల్లో తామే కాదు ఎవ్వరూ ఏమీ చేయలేరని ఆయన అసహనం వ్యక్తం చేశారు. తాము న్యాయం కోసం కోర్టుకు వెళ్లాల్సిందేనని అన్నారు. చీఫ్ సెక్రటరీ కూడా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని జేసీ పేర్కోన్నారు.
జగన్ సంపూర్ణ అధికారంలో వున్నాడు.. తనకు తాను సర్వశక్తి సంప్పన్నడని భావిస్తున్నాడని అన్నారు. ఆయనే అల్లా, ఆయనే ఏసు, ఆయనే తిరుపతి వెంక్కనగా భావిస్తున్నాడని జేసీ ఎద్దేవా చేశారు. తన మాటకు ఎదురు చెప్పేవాడు, తనకు ప్రతి పక్షంలో ఎవరు లేకుండా చేయడమే తన ధేయం అన్నట్లుగా ఉంది జగన్ పాలన సాగుతోందని విమర్శించారు. జగన్ దగ్గర మంచి అధికారులు ఉన్నా వారి మాట చెల్లుబాట అయ్యేటట్లు లేదని అన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల మాట కూడా వినే పరిస్థితిలో జగన్ లేడని అన్నారు. తనను నడిరోడ్డులో బట్టలు లేకుండా నిలబెట్టాడని.. తన ఆర్థిక మూలాలు లేకుండా చేశాడని అవేదన వ్యక్తం చేశాడు. ఇంతచేసినా ఆయన రేపు తనను కూడా అరెస్ట్ చేసినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని జేసి అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more