కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా కేంద్రం దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్.. వలస కార్మికులకు శాపంగా పరిణమించిందన్న విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ నేపథ్యంలో చేతిలో పనిలేక.. తినడానికి తిండి లేక.. తమ భార్యబిడ్డలకు దూరంగా.. కన్నవారికి ఉన్న ఊరికి దూరంగా బతకాల్సిరావడంతో అనేక మంది వలస కార్మికులు తమ తట్టబుట్టా తలపై పెట్టుకుని నడుచుకుంటూ వందల కిలోమీటర్ల దూరం నడిచిన ఘటనలు నమోదు చేసుకున్నాయి. ఈ క్రమంలో వలస కార్మికులపై పలు రాష్ట్రాల పోలీసులు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని పేర్కోంటూ కేసులు నమోదు చేశారు.
ఈ విషయమై ఇవాళ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వలస కార్మికులకు సానుకూలంగా అదేశాలను జారీ చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు వలస కార్మికుల విషయంలో తాము జారీ చేసిన ఉత్తర్వులను పాటించాలని అదేశించింది. వలస కార్మికుల అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. స్వస్థలాలకు వెళ్లాలనుకుంటున్న వలస కూలీలను గుర్తించి పక్షం రోజుల్లో తరలించాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. రాష్ట్రాలు అడిగిన 24 గంటల వ్యవధిలో కేంద్ర రైల్వేమంత్రిత్వశాఖ శ్రామిక్ రైళ్లు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని సూచించింది.
వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లే ప్రయత్నంలో వారిపై పోలీసులు మోసిన లాక్ డౌన్ ఉల్లంఘనల కేసులు ఉపసంహరించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. స్వస్థలాలకు చేరుకున్న వలస కూలీలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి పథకాలు అమలు చేస్తున్నాయి, వారికి ఎలాంటి ఉపాధి కల్పిస్తున్నారో వివరిస్తూ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. దీనికి సంబంధించిన నివేదికను అందజేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను సుప్రీంకోర్టు జులై 8కి వాయిదా వేసింది. లాక్ డౌన్ విధించిన తర్వాత వలస కార్మికులు కాలినడకన స్వస్థలాలకు బయలుదేరిన ఘటనలు చూసిన సర్వోన్నత న్యాయస్థానం వలస కూలీల అంశాన్ని సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more