Covid 19: 154 fresh cases reported in AP ఏపీలో 4813లకు చేరిన కరోనా కేసులు..

Coronavirus in ap 154 new covid 19 cases state tally reaches 4813

covid-19, coronavirus, coronavirus in india, coronavirus in ap, covid-19 in ap, coronavirus updates, coronavirus pandemic, fight against coronavirus, covid-19 outbreak, coronavirus outbreak in andhra pradesh, coronavirus in nellore, coronavirus in Krishna, coronavirus in prakasam, coronavirus in in kadapah, coronavirus in west godavari, coronavirus news, coronavirus latest news, coronavirus latest update, coronavirus andhra pradesh, coronavirus updates

The total number of COVID-19 cases in Andhra Pradesh rose to 4813 after 154 new cases were reported in the last 24 hours, out of which 2387 have so far recovered and have been discharged, while 75 have died, the state health department said.

ఏపీలో ఉదృతంగా కరోనా వ్యాప్తి.. 4800ల మార్కును దాటిన కేసులు..

Posted: 06/08/2020 08:37 PM IST
Coronavirus in ap 154 new covid 19 cases state tally reaches 4813

(Image source from: Newindianexpress.com)

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతోంది. మే నెల చివరి వారం నుంచి వేగాన్ని పుంజుకున్న కరోనా మహమ్మారి రాష్ట్రంలో రోజుకు వందకు పైగా ప్రజలను తన ప్రభావానికి గురిచేస్తోంది, రాష్ట్రంలో కొత్తగా 154 కేసులు నమోదయ్యాయి. ఇక పక్షం రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతుండటం అందోళన రేకెత్తిస్తోంది. తాజాగా రాష్ట్రంలో అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతుండడం అందోళన రేకెత్తిస్తోంది. ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి కఠినచర్యలు తీసుకుంటున్నా వైరస్ ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. గత కొన్ని రోజులుగా వందకు పైగా నమోదువుతున్న కేసుల సంఖ్య గడిచిన 24 గంటల వ్యవధిలో రెండువందలకు పైగా చేరడంతో ఆందోళన వ్యక్తం అయ్యింది.

తాజాగా నమోదైన 154 పాజిటివ్ కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 4 వేల 800 మార్కును దాటింది. ఈ మేరకు భారత వైద్యఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో వివరాలను పేర్కోంది. తాజాగా నమోదైన కేసుల్లో 154 కేసులతో రాష్ట్రంలో కరోనా కేసులు మొత్తంగా 4813కి చేరాయి. అయితే ఇందులో విదేశాలకు, పోరుగు రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులకు చెందిన కేసులు 28 వుండగా, విదేశాల నుంచి వచ్చిన వారిలో ఒక్క కేసు నమోదు అయ్యింది, రాష్ట్రంలో మాత్రం 129 కేసులు నమోదైనట్టు గణంకాలు కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో తమిళనాడు కోయంబేడు కాంటాక్టు కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు. మిగతా కేసులు పలు జిల్లాల్లో్ వెలుగుచూసిన కాంట్రెక్టు కేసులని సమాచారం.

దీంతో ఇప్పటివరకు పలు దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారితో కలపి 4813 మందికి కరో్నా వ్యాప్తి చెందినదని అధికారులు విడుదల చేసిన గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో ఎలాంటి మరణాలు సంభవించకపోవడంతో వైద్యాధికారులు ఊపిరిపీల్చుకుంటున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 75కి చేరింది. కాగా ఇప్పటి వరకు కోరాన వైరస్ బారిన పడి చికిత్స పోందుతూ అసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2387కు చేరడం కూడా రాష్ట్రప్రజలకు, వైద్య సిబ్బందికి కొంత ఊరటనిస్తోంది. ఇక తాజా గణంకాల ప్రకారం రాష్ట్రంలో కరోనా బారిన పడి చికిత్స పోందుతున్న వారి సంఖ్య 2317గా నమోదు అయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles