COVID-19 tally in India nears 2 lakh-mark; death toll crosses 5,815 దేశంలో 2లక్షలు దాటిన కేసులు.. 5815 చేరిన మరణాలు

Coronavirus update covid 19 tally in india nears 2 lakh mark death toll crosses 5815

coronavirus in india, coronavirus, covid-19, corona spread, Coronavirus, COVID-19, Coronavirus news, section 144 coronavirus, coronavirus news, coronavirus maharashtra, coronavirus updates, coronavirus in maharashtra, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

The total number of confirmed cases of COVID-19 infection in India crossed the 2 lakh-mark by Wednesday, while the death toll has reached the 5,815-mark as well. The states registered 8909 new cases in last 24 hours. The total number of coronavirus cases in India surged to 2,07,615. At least 217 new deaths were reported in last 24 hours..

కరోనా విజృంభన: దేశంలో 2లక్షలు దాటిన కేసులు.. 5815 చేరిన మరణాలు

Posted: 06/03/2020 02:55 PM IST
Coronavirus update covid 19 tally in india nears 2 lakh mark death toll crosses 5815

దేశంలో కరోనా విజృంభన వేగంగా కోనసాగుతోంది. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తూ.. లక్షలాధి మందిని తన ప్రభావానికి గురిచేస్తూ.. లక్షల మంది ప్రాణాలను హరించిన కరోనా మహమ్మారి దేశంలోనూ తన ఉదృతిని వేగంగా విస్తరించుకుంటోంది. రోజురోజుకు ప్రజల మనుగడనను ప్రశ్నార్థకంగా మారుస్తూ తన ప్రభావనికి గురిచేస్తున్న వైరస్.. ఇక తన వ్యాప్తిని కూడా పెంచుకుంటోంది. దేశంలో జనవరి 30వ తేదీన తొలి కేసు నమోదైన తరువాత 111 రోజులకు లక్ష కేసులు నమోదు చేసుకుంది. ఆ తరువాత తన వేగాన్ని పెంచుకుంటోన్న మహమ్మారి ఆ తరువాత కేవలం పక్షం రోజుల వ్యవధిలో దేశంలో మరో లక్ష మందిని తన ప్రభానికి గురిచేసింది.

గత కొన్ని రోజులుగా ఏకంగా ఎనమిది వేలకు పైబడిన సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదుఅవుతుండగా, ఇక తాజగా ఇవాళ ఏకంగా తొమ్మిది వేలకు చేరువలో కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో క్రమంగా కరోనావైరస్ మహమ్మారి బారిన బాధితుల సంఖ్య రెండు లక్షల మార్కును దాటింది. అటు దేశవ్యాప్తంగా నమోదవుతున్న మరణాలు కూడా అందోళన కలిగించే స్థాయికి చేరువవుతున్నాయి. ఐదో విడత లాక్ డౌన్ అమల్లోకి రావడంతో దేశంలో అన్నింటికీ సడలింపులు వచ్చాయి. దీంతో కరోనా కేసులు వ్యాప్తి కూడా గణనీయంగా పెరుగుతోంది.

దేశంలో అటు కరోనా పాజిటివ్ కేసులు, ఇటు కరోనా మరణాలు పెరుగుతుండటంతో దేశ ప్రజల నుంచి అందోళన వ్యక్తమవుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలోనే తొమ్మిది వేలకు చేరువలో కేసులు నమోదు కావడం.. మరణాలు కూడా అత్యధిక సంఖ్యలోనే నమోదవ్వడం కలవరం రేపుతోంది. ఇక ఈ మురణాల్లోనూ యాభై శాతానికి పైగా మహారాష్ట్రలోనే సంభవించడం ఆ రాష్ట్రవాసులను భయాందోళనకు గురిచేస్తోంది. ఇక గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా 8909 పాజిటివ్ కేసుల నమోదుతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ 2,07,615 కేసులు నమోదయ్యాయి.

ఇక దేశంలో నమోదవుతున్న మరణాలు కూడా ఆందోళన కొనసాగిస్తున్నాయి. దేశంలో మునుపెన్నడూ నమోదు కాని స్థాయిలో మరణాలు సంభవిస్తూ ప్రజలను అందోళనకు గురచేస్తున్నాయి. ఇక తాజాగా గడిచిన 24 గంటల్లో 217 మంది మరణించడం అందోళన కలిగించే విషయం. దీంతో దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య 5800 మార్కును దాటింది. తాజాగా నమోదైన గణంకాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా 5815కి మరణాలు చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది. దేశంలో నమోదవుతున్న కరోనా కేసులు, మరణాల్లో  మహారాష్ట్రలోనే అత్యదికంగా నమోదు కావడం గమనార్హం. ఆ తరువాత కరోనా విజృంభన ఢిల్లీ, తమిళనాడు, హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలోనూ అత్యధిక కేసులు నమోదయ్యాయి.

ఈ మహమ్మారి బారిన పడిన వారిలో గత 24 గంటల వ్యవధిలో పలువురు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని దీంతో మొత్తంగా ఇప్పటి వరకు 1,00,304 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక 1,01,497 మంది మాత్రం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పోందుతున్నారు. గత కొన్నిరోజులుగా కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోండగా, రానున్న రోజుల్లో కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశాలు వున్నాయని నిపుణులు అంచనాలు ప్రజలను అందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య దేశంలో 48శాతానికి చేరిందని.. ఇది అత్యధికమని ఐఎంసీఆర్ గణంకాలు స్పష్టంచేస్తున్నాయి.

దేశంలో మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో కరోనా ఉదృతి తీవ్రంగా వుంది. ఫలితంగా రోజురోజుకు పెరుగుతున్న కేసులతో దేశంలో మొత్తంగా నమోదైన కేసులు కరోనా వైరస్ బారిన దేశాల జాబితాలో భారత్ ను ఏకంగా ఏడవ ప్రభావిత దేశంగా నిలిపింది. ఈ వరుసలో ఇటీవలే టర్కీని దాటిన భారత్.. కరోనా ప్రభావిత దేశాల జాబితాలోని మరో రెండు దేశాలైన ఫ్రాన్స్, జర్మనీలను కూడ దాటేసింది. లక్షా 88 వేల కేసులతో ఫ్రాన్స్ 8వ స్థానంలో వుండగా, దానిని కూడా భారత్ అధిగమించింది. ఇక భారత్ ముందు ఇటలీ 2 లక్షల 32 వేల కేసులతో 6వ ప్రభావిత దేశంగా వుంది. అయితే మరణాల్లో మాత్రం భారత్ ప్రపంచంలో 13వ స్థానంలో ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles