India cross 1.73 lakh, nearly 8,000 new cases in 24 hours దేశంలో కరోనా విజృంభన.. 24 గంటల్లో 8 వేల కేసులు

Coronavirus update covid 19 cases in india cross 1 73 lakh nearly 8000 new cases in 24 hours

coronavirus in india, coronavirus, covid-19, corona spread, Coronavirus, COVID-19, Coronavirus news, section 144 coronavirus, coronavirus news, coronavirus maharashtra, coronavirus updates, coronavirus in maharashtra, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

For the second straight day, the number of daily coronavirus cases in India hit a new high. The states registered 7,964 new cases in last 24 hours. The total number of coronavirus cases in India surged to 173,763. At least 265 new deaths were reported in last 24 hours. The total number of fatalities due to COVID-19 infection rose to 4,971.

దేశంలో కరోనా విజృంభన.. 24 గంటల్లో 8 వేల కేసులు

Posted: 05/30/2020 01:34 PM IST
Coronavirus update covid 19 cases in india cross 1 73 lakh nearly 8000 new cases in 24 hours

దేశంలో కరోనా విజృంభన వేగంగా కోనసాగుతోంది. చైనాలో పుట్టి ప్రపంచ వ్యాప్తంగా లక్షలాధి మంది ప్రజల ప్రాణాలను హరించిన ఈ వైరస్.. భారత్ లో తన సంక్రమణ శక్తిని తగ్గించుకున్నా.. ప్రభావాన్ని మాత్రం ఇంకా కొనసాగిస్తూనే వుంది. దేశవ్యాప్తంగా వరుసగా రెండో రోజు అత్యధిక కేసులు నమోదు కావడం గమనార్హం. నిన్న ఏడున్నర వేలకు చేరువలో నమోదైన కేసులు ఇవాళ ఎనమిది వేల పాజిటివ్ కేసులు నమోదు కావడం అందోళన రేకెత్తిస్తోంది. ఇక గడిచిన 24 గంటల్లో దేశంలో అత్యధిక స్థాయిలో నమోదైన మరణాలు కూడా అందోళన వ్యక్తం చేస్తోంది.

దేశంలో అటు కరోనా పాజిటివ్ కేసులు, ఇటు కరోనా మరణాలు పెరుగుతుండటంతో దేశ ప్రజల నుంచి అందోళన వ్యక్తమవుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలోనే ఎనమిది వేలకు చేరువలో కేసులు నమోదు కావడం.. మరణాలు కూడా అత్యధిక సంఖ్యలోనే నమోదవ్వడం కలవరం రేపుతోంది. ఇక ఈ మురణాల్లోనూ యాభై శాతానికి పైగా మహారాష్ట్రలోనే సంభవించడం ఆ రాష్ట్రవాసులను భయాందోళనకు గురిచేస్తోంది. ఇక గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా 7964 పాజిటివ్ కేసుల నమోదుతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ 1,73,763 కేసులు నమోదయ్యాయి.

ఇక దేశంలో నమోదవుతున్న మరణాలు కూడా ఆందోళన కొనసాగిస్తున్నాయి. దేశంలో మునుపెన్నడూ నమోదు కాని స్థాయిలో మరణాలు సంభవించడం.. గడిచిన 24 గంటల్లో 265 మంది మరణించడం అందోళన కలిగించే విషయం. దీంతో దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య కూడా 4971కి చేరుకుందని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది. మహారాష్ట్రలో కరోనా విజృంభన కోనసాగడంతో పాటు ఢిల్లీ, తమిళనాడు, హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలోనూ అత్యధిక కేసులు నమోదయ్యాయి, ఇక మరణాల్లోనూ భారత్ చనాను మించిన సంఖ్యకు చేరుకోవడంతో అందోళన వ్యక్తం అవుతోంది. చైనాలో 4634 మరణాలు సంభవించగా,. భారత్ లో 4706 మరణాలు నమోదు చేసుకున్నాయి.

ఈ మహమ్మారి బారిన పడిన వారిలో గత 24 గంటల వ్యవధిలో పది వేల మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని దీంతో మొత్తంగా ఇప్పటి వరకు 78,149 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక 86,422 మంది మాత్రం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పోందుతున్నారు. గత కొన్నిరోజులుగా కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోండగా, రానున్న రోజుల్లో కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశాలు వున్నాయని నిపుణులు అంచనాలు ప్రజలను అందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య దేశంలో 42శాతానికి చేరిందని.. ఇది అత్యధికమని ఐఎంసీఆర్ గణంకాలు స్పష్టంచేస్తున్నాయి.

మహారాష్ట్రలో కరోనా కల్లోలం కొనసాగుతూనే వుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 2682 కేసులు నమోదయ్యాయి, ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనే 1367 పాజిటివ్ కేసులు నమోదు అక్కడి పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది, గత సోమవారం నుంచి మహారాష్ట్రంలో అత్యధిక కరోనా మరణాలు సంభవించడం అందోళనకరం. దేశంలో నమోదైన కేసుల్లో దాదాపు 36శాతం కరోనా కేసులు మహరాష్ట్ర నుంచినమోదు కావడం.. రాష్ట్రంలో  మొత్తం కేసుల సంఖ్య 62228కు చేరగా, ఏకంగా 2100 మార్క దాటి మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవవధిలో మహారాష్ట్రలో 85 మరణాలు సంభవించాయి. ఇక మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజునే ఏకంగా 8000 మంది కరోనా నుంచి కోలుకుని అసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles