Telangana reports 169 Cororna Cases in 24 hours తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా.. 24 గంటల్లో.. 169 కేసులు..

Covid 19 update with 169 cases telangana records highest single day spike

coronavirus, coronavirus in Telangana, Telangana coronavirus cases, coronavirus cases in Telangana, coronavirus count in india, india coronavirus count, Tabilghi Jamat Telangana, Tabilghi jamat Telangana cases, Nizamudding event Telangana, Delhi coronavirus cases, Delhi Nizamuddin coronavirus cases, coronavirus india, coronavirus update, coronavirus in india, coronavirus cases, coronavirus cases india, coronavirus update india, coronavirus news, COVID-19, COVID 19 update, coronavirus in ts, coronavirus Hyderabad, Telangana

The coronavirus positive cases in Telangana State have hit a new high with health authorities on Friday reporting 169 Covid-19 positive cases and four fatalities. The cumulative tally of Covid-19 infections so far in Telangana State has also reached the 2425 mark.

కరోనా విజృంభన: తెలంగాణలో 24 గంటల్లో 169 అత్యధిక కేసులు..

Posted: 05/29/2020 11:43 PM IST
Covid 19 update with 169 cases telangana records highest single day spike

తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ బుసకొడుతోంది. రోజురోజుకూ రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు అత్యధిక సంఖ్యను అతిక్రమిస్తూ అందోళన కలిగిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం, అరోగ్యశాఖ అధికారులు, వైద్యులు, హెల్త్ వర్కర్లు, శానిటేషన్ సిబ్బంది, పోలీసుల సమిష్టి కృషితో రాష్ట్రంలో తగ్గినా.. మళ్లీ పెరుగుతుండటం అందునా గత నాలుగు రోజులుగా అత్యధిక సంఖ్యలో కేసులు నమోదు కావడం అందోళన రేకెత్తిస్తోంది. దీంతో ఇటు ప్రభుత్వ, రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, వైద్యాధికారులు, డాక్లర్లు ఎంతగానో శ్రమిస్తున్నా.. ఉపశమనం లభించే వాతావరణం మాత్రం అప్పుడే కనిపించడం లేదు. మరణాలు కూడా అంతకంతకూ పెరగుతూ రాష్ట్రవాసులను భయాందోళనకు గురిచేస్తోంది. 

ఈ ఏప్రిల్ మాసంలో గణనీయంగా తగ్గిన కేసులు మే నెల 7 నుంచి క్రమంగా పెరుగుతూ వస్తోన్నాయి. కాగా ఈ నెలలో రాష్ట్రంలో నమోదైన కేసులన్నీ రమారమి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనివే. అయితే గ్రేటర్ లో కరోనా నియంత్రణకు కఠినమై చర్యలు తీసుకున్నా.. వ్యాప్తి మాత్రం అగడం లేదు. ఇవాళ తాజాగా నమోదైన కేసులలోనూ అత్యధిక కేసులు గ్రేటర్ కు పరిధిలోనివే కావడం గమనార్హం. గ్రేటర్ హైదరాబాద్ లో ఇదివరకు ఎన్నడూ నమోదు కాని అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇవాళ గ్రేటర్ పరిధిలో ఏకంగా 82 కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు రంగారెడ్డి జిల్లాలో 14, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో 2 చోప్పున కరోనా కేసులు నిర్థరణ అయ్యాయి.

ఇక వీటికి తోడు విదేశాల నుంచి వచ్చిన వారిలో 64 మందికి కూడా కరోనా సోకింది. ఇక మరో్ ఐదుగురు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు కూడా కరోనా పాజిటివ్ గా తేలింది.  ఇవాళ తాజాగా నాలుగు మరణాలు సంభవించాయి. దాంతో తెలంగాణలో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 169కు చేరింది. గత వారం రోజులుగా రాష్ట్రంలో కరోనా మరణాలు కూడా పెరుగుతుండటం అందోళనకర పరిణమం. ఇక తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో నమోదైన కరోనా కేసులు కూడా కలవరాన్ని రేపుతున్నాయి.

శుక్రవారం విడుదల చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ ప్రకారం.. నిన్న 117 కేసులు నమోదైన తెలంగాణలో ఇవాళ ఏకంగా 169 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్యలో ఒక్కరోజులో కేసులు నమోదు కావడం ఇదే అత్యధికం. దీంతో మొత్తం రాష్ట్రంలో కరోనా కేసులు 2425కి చేరుకున్నాయి. వీటిలో అత్యధిక కరోనాకేసులు విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారివే కావడం గమనార్హం, ఇక రాష్ట్రానికి వచ్చిన వలస కార్మికులు కూడా కరోనా పాజిటివ్ వచ్చినవారి జాబితాలో వున్నారు. మొత్తం 169 కేసుల్లో 64 మంది విదేశీయులే. ఇక ఐదుగురు వలస కార్మికులకు కూడా కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. కాగా, ఇవాళ రాష్ట్రంలో 100 మంది స్థానికులకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది.

తాజాగా నమోదైన ఇవాళ నమోదైన 169 కేసులతో మొత్తంగా రాష్ట్రంలో 2425 కేసులు నమోదయ్యాయి, ఇక ఇవాళ రాష్ట్రంలో కరోనా మరణాలు కూడా అధికంగానే సంభవించాయి, ఇవాళ ఏకంగా నలుగురు కరోనా బారిన పడి చికిత్స పోందుతూ అసువులు బాసారు. దీంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య కూడా 71కు చేరింది. కరోనా బారినపడిన బాధితులు కోలుకొని మొత్తంగా 1381 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 973 యాక్టివ్‌ కేసులు వున్నాయని వారంతా గాంధీ అసుపత్రిలో చికిత్స పోందుతున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles