దేశంలో కరోనా విజృంభన వేగంగా కోనసాగుతోంది. దేశంలో తొలి కరోనా కేసు నమోదైన జనవరి 30వ నుంచి (మే 18వ తేదీ నాటికి) 111 రోజుల్లో లక్ష మార్కును చేరింది. అయితే మే 18 నుంచి కరోనా కేసుల వేగం.. అంతకంతకూ పెరుగుతూ ఉగ్రరూపాన్ని దాల్చుతుంది. కేవలం పది రోజుల వ్యవధిలో దేశంలో దేశంలో కరోనా కేసులు సంఖ్య యాభై వేలకు పెరిగింది. దీంతో పది రోజుల వ్యవధిలో యాభై వేల కేసులు నమోదు కావడం అందోళన వ్యక్తమవుతోంది. ఇవాళ్టికి దేశంలో కరోన అంతకంతకూ పెరగుతూ ఏకంగా లక్షా యాభై వేల మార్కును దాటాయి. ఇప్పటికే కరోనా కేసులు నమోదైన జాబితాలో 11వ స్థానంలో నిలిచిన భారత్ పదవ స్థానానికి ఎగబాకడం కలవరపరుస్తోంది.
ఇక గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా ఆరు వేలకు పైబడిన కరోనా కేసులు నమోదయ్యాయి, 6387 కొత్త పాజిటివ్ కేసుల నమోదుతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ 1,51,767 కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో నమోదవుతున్న మరణాలు కూడా ఆందోళన కొనసాగిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 170 మంది మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య కూడా 4337కి చేరుకుందని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది. మహారాష్ట్రలో ఏకంగా అత్యధిక మరణాలు నమోదు చేసుకోవడం కలవరాన్ని గురిచేస్తోంది. కరోనా వైరస్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో దేశప్రజల్లో అందోళన కలుగుతోంది.
గత తొమ్మిది రోజుల వ్యవధిలో ఏకంగా యాభై వేల కేసులు నమోదు కావడం కూడా అందోళన రేకెత్తిస్తోంది. కాగా ఈ మహమ్మారి బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 64,426 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక 83,004 మంది మాత్రం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పోందుతున్నారు. గత కొన్నిరోజులుగా కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోండగా, రానున్న రోజుల్లో కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశాలు వున్నాయని నిపుణులు అంచనాలు ప్రజలను అందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య దేశంలో 42శాతానికి చేరిందని.. ఇది అత్యధికమని ఐఎంసీఆర్ గణంకాలు స్పష్టంచేస్తున్నాయి.
మహారాష్ట్రలో కరోనా కల్లోలం కొనసాగుతూనే వుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 2091 కేసులు నమోదు కావడంతో పాటు 97 మంది మృత్యువాతపడ్డటం అందోళనకరం. దేశంలో నమోదైన కేసుల్లో మూడింట ఒక్క వంతు కేసులు ఇక్కడే నమోదు కావడం.. దేశవ్యాప్తంగా లక్షా యాభై వేల కేసులు నమోదుకాగా, మహారాష్ట్రలో మాత్రమే యాభై వేల కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్యలో కేసులు పెరగడం కూడా అందోళన రేపుతోంది. ఇక మహారాష్ట్రలో మరణాలు కూడా అత్యధికంగా మరణాలు కూడా సంభవించడం అందోళనకరం. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 54758కు చేరగా, ఏకంగా 1792 మరణాలు నమోదయ్యాయి. దేశ ఆర్థిక రాజధాని ముబైలోనే ఏకంగా ముఫై వేల కేసులు నమోదు కావడం గమనార్హం.
ఆ తరువాత కరోనా ఉదృతి అధికంగా నమోదవుతున్న రాష్ట్రం తమిళనాడు. ఈ రాష్ట్రంలో నిన్న ఒక్కరోజునే 646 కరోనా కేసులు నమోదుకావడంతో మొత్తం కేసులు సంఖ్య 17728కు చేరగా, 118 మరణాలు నమోదయ్యాయి. ఆ తరువాత దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కాటువేస్తోంది. ఇక్కడ నిన్న ఒక్కరోజునే 412 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, దీంతో మొత్తం కరోనా కేసులు సంఖ్య 14 వేల 465కు చేరగా, 300 మంది కరోనా బారిన పడి మరణించారు. ఆ తరువాత గుజరాత్ లోనూ కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఈ రాష్ట్రంలో నిన్న 361 కేసులు నమోదు కాగా మొత్తం కేసులు సంఖ్య 14,821కి చేరగా, ఏకంగా 900 మంది అసువులు బాసారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more