కరోనా వైరస్ మహమ్మారి సోకిన రోగులను కాపాడుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు పలు ఔషధాలను చికిత్సలో వినియోగిస్తున్నాయి, ఈ వైరస్ నయయ్యేందుకు ఔషధం లేకపోవడంతో ఒక్కో వైద్యుడు ఒక్క విధంగా చికిత్స చేస్తున్నారు. అయితే మనదేశంలో మాత్రం ఐసీఎంఆర్ ఇచ్చిన మార్గదర్శకాలపై వైద్యులు తమ చికిత్సా విధానాన్ని ఫాలో అవుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాను క్లోరోక్వీన్ మందును తీసుకోవడం ఆపివేశానని చెప్పడంతో.. ఆ మరుసటి రోజునే ప్రపంచ ఆరోగ్య సంస్థ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది.
కరోనా నివారణకు ప్రస్తుతం ప్రపంచదేశాలు వాడుతున్న ఔషదం క్లోరోక్వీన్. ఓ వైపు కరోనాకు మందు కనిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో అనేక పరిశోధనలు జరుగుతున్నా.. మరోవైపు ప్రస్తుతం చికిత్స నేపథ్యంలో వైరస్ సోకినవారికి మలేరియా రోగులకు ఇచ్చే మందు ఇప్పుడు వాడుతున్నారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందు కరోనా వైరస్ బాధితులకు తక్షణ చికిత్సకు అందిస్తున్నారు. అందుకే ఇటీవల అమెరికాతో పాటు పలు దేశాలు భారతదేశ సహాయం కోరాయి. హైడ్రాక్సీ క్లోరోక్విన్ నిల్వలు భారతదేశం లో అధికంగా ఉండడంతో ఆ దేశాలు భారత్కు విజ్ఞప్తులు చేస్తున్నాయి.
తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన ప్రకటన చేసింది. క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా కరోనా రోగులకు మలేరియాకి మందుగా వాడే ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇవ్వడాన్ని కొంత కాలం ఆపాల్సిందిగా ప్రకటన చేసింది. కోవిడ్-19 రోగులకు ఈ ఔషధం ఇచ్చిన తర్వాత ఎక్కువ మంది మరణిస్తున్నారంటూ ఇటీవల లాన్సెట్ లో ఓ అధ్యయనం వెలువడింది. ఈ క్రమంలో కొంతకాలం పాటు క్లినికల్ ట్రయల్స్ లో ఈ మందు ఇవ్వడం ఆపాలంటూ డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సాలిడారిటీ ట్రయల్స్ పేరిట చాలా దేశాలు.. కరోనాకి మందు కనిపెట్టేందుకు పరిశోధనలు చేస్తున్నాయని ఆయన అన్నారు.
అయితే.. ఈ పరీక్షల్లో హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడకాన్ని మాత్రం నిలిపివేయాలని చెప్పారు. కేవలం ఈ మందుపై మాత్రమే తాత్కాలిక నిషేధం విధించామని.. ఇతర క్లినికల్ ట్రయల్స్ యాథావిధిగా కొనసాగించవచ్చని చెప్పారు. హైడ్రాక్సీక్లోరోక్విన్ సాధారణంగా ఆర్థరైటిస్కు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు, ఇక ఇప్పటికే డోనాల్డ్ ట్రంప్ తో పాటు బ్రెజిల్ ఆరోగ్య మంత్రి కూడా గత వారం హైడ్రాక్సీక్లోరోక్విన్తో పాటు మలేరియా వ్యతిరేక క్లోరోక్విన్ ని కరోనా రోగులకు ఉపయోగించాలని సిఫారసు చేశారు. రెండు మందులు తీవ్రమైన దుష్ప్రభావాలను, ముఖ్యంగా గుండె అరిథ్మియాను ఉత్పత్తి చేస్తాయని లాన్సెట్ అధ్యయనం కనుగొంది. దీంతో.. దీనిపై డబ్ల్యూహెచ్ఓ తాత్కాలిక నిషేధం విధించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more