తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ బుసకొడుతోంది. ప్రభుత్వం, అరోగ్యశాఖ అధికారులు, వైద్యులు, హెల్త్ వర్కర్లు, శానిటేషన్ సిబ్బంది, పోలీసుల సమిష్టి కృషితో తగ్గిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం అందోళన రేకెత్తిస్తోంది. మరోవైపు మరణాలు కూడా అంతకంతకూ పెరగడం అందోళనను రేపుతోంది. ఇటు ప్రభుత్వ, రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతున్నట్లుగా కరోనా మహమ్మారి రాష్ట్రం నుంచి సంపూర్ణంగా తరమికొడతామని చెబుతున్నా.. పెరుగుతున్న కేసులు వైద్యశాఖ పనితీరుకు సవాల్ విసురుతున్నట్లుగా వుంది. దీంతో అటు రాష్ట్రవాసులతో పాటు ఇటు గ్రేటర్ నగరవాసులు కూడా కలవరానికి గురవుతున్నారు.
ఈ నెల 7 నుంచి క్రమంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయితే ఈ నెలలో రాష్ట్రంలో నమోదైన కేసులన్నీ రమారమి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనివే. ఇక తాజాగా నమోదైన కేసులు గ్రేటర్ వాసులను మరింత అందోళనకు గురిచేస్తోంది. ఇవాళ రాష్ట్రంలో మరో మూడు కరోనా మరణాలు సంభవించాయి, దీంతో తెలంగాణలో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 56కు చేరింది. పది రోజుల క్రితం 39గా నమోదైన మరణాలు ఏకంగా 56కు చేరుకోవడంతో అందోళనకర పరిణమం. ఇక తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో నమోదైన కరోనా కేసులు కూడా కలవరాన్ని రేపుతున్నాయి.
సోమవారం విడుదల చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ ప్రకారం.. ఒకే రోజులో మొత్తం 66 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం రాష్ట్రంలో కరోనా కేసులు 1920కి చేరుకున్నాయి. వీటిలో 31 కరోనా కేసులు కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. ఇక రంగారెడ్డి జిల్లాలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. 15 మంది వలస కూలీలకు, మహారాష్ట్రకు చెందిన ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా.. విదేశాల నుంచి వచ్చిన వారిలో 18 మందికి కరోనా వచ్చినట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 700 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇవాళ రాష్ట్రంలో 72 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని తెలిపింది. ఇప్పటి వరకు 1164 మంది డిశ్చార్జి అయ్యారని పేర్కొంది. యాదాద్రి, వనపర్తి, వరంగల్ రూరల్ జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలిపింది. కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. అవి నిష్పలితమవుతున్నాయి. నగరంలో కరోనా వ్యాప్తి చాపకింద నీరులా వ్యప్తి చెందుతూనే వుంది. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. అయినా కరోనా వ్యాప్తి చెందుతూనే వుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more