Hyderabad reports 66 Cororna Cases in 24 hours కరోనా విజృంభన: తెలంగాణలో 24 గంటల్లో..66 కేసులు.. 3 మరణాలు

Covid 19 update hyderabad reports 66 cororna cases 3 deaths

coronavirus, coronavirus in Telangana, Telangana coronavirus cases, coronavirus cases in Telangana, coronavirus count in india, india coronavirus count, Tabilghi Jamat Telangana, Tabilghi jamat Telangana cases, Nizamudding event Telangana, Delhi coronavirus cases, Delhi Nizamuddin coronavirus cases, coronavirus india, coronavirus update, coronavirus in india, coronavirus cases, coronavirus cases india, coronavirus update india, coronavirus news, COVID-19, COVID 19 update, coronavirus in ts, coronavirus Hyderabad, Telangana

Telangana reported 66 new cases of COVID-19 on Monday, taking the total positive cases in the state to 1,920. Out of all 66 new positive cases 31 reported were from the jurisdiction of the GHMC and one positive case from RangaReddy district.

కరోనా విజృంభన: తెలంగాణలో 24 గంటల్లో..66 కేసులు.. 3 మరణాలు

Posted: 05/25/2020 07:28 PM IST
Covid 19 update hyderabad reports 66 cororna cases 3 deaths

తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ బుసకొడుతోంది. ప్రభుత్వం, అరోగ్యశాఖ అధికారులు, వైద్యులు, హెల్త్ వర్కర్లు, శానిటేషన్ సిబ్బంది, పోలీసుల సమిష్టి కృషితో తగ్గిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం అందోళన రేకెత్తిస్తోంది. మరోవైపు మరణాలు కూడా అంతకంతకూ పెరగడం అందోళనను రేపుతోంది. ఇటు ప్రభుత్వ, రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతున్నట్లుగా కరోనా మహమ్మారి రాష్ట్రం నుంచి సంపూర్ణంగా తరమికొడతామని చెబుతున్నా.. పెరుగుతున్న కేసులు వైద్యశాఖ పనితీరుకు సవాల్ విసురుతున్నట్లుగా వుంది. దీంతో అటు రాష్ట్రవాసులతో పాటు ఇటు గ్రేటర్ నగరవాసులు కూడా కలవరానికి గురవుతున్నారు.

ఈ నెల 7 నుంచి క్రమంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయితే ఈ నెలలో రాష్ట్రంలో నమోదైన కేసులన్నీ రమారమి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనివే. ఇక తాజాగా నమోదైన కేసులు గ్రేటర్ వాసులను మరింత అందోళనకు గురిచేస్తోంది. ఇవాళ రాష్ట్రంలో మరో మూడు కరోనా మరణాలు సంభవించాయి, దీంతో తెలంగాణలో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 56కు చేరింది. పది రోజుల క్రితం 39గా నమోదైన మరణాలు ఏకంగా 56కు చేరుకోవడంతో అందోళనకర పరిణమం. ఇక తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో నమోదైన కరోనా కేసులు కూడా కలవరాన్ని రేపుతున్నాయి.

సోమవారం విడుదల చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ ప్రకారం.. ఒకే రోజులో మొత్తం 66 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం రాష్ట్రంలో కరోనా కేసులు 1920కి  చేరుకున్నాయి. వీటిలో 31 కరోనా కేసులు కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. ఇక రంగారెడ్డి జిల్లాలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. 15 మంది వలస కూలీలకు, మహారాష్ట్రకు చెందిన ఒకరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా.. విదేశాల నుంచి వచ్చిన వారిలో 18 మందికి కరోనా వచ్చినట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 700 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇవాళ రాష్ట్రంలో 72 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని తెలిపింది. ఇప్పటి వరకు 1164 మంది డిశ్చార్జి అయ్యారని పేర్కొంది. యాదాద్రి, వనపర్తి, వరంగల్‌ రూరల్‌ జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలిపింది. కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. అవి నిష్పలితమవుతున్నాయి. నగరంలో కరోనా వ్యాప్తి చాపకింద నీరులా వ్యప్తి చెందుతూనే వుంది. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. అయినా కరోనా వ్యాప్తి చెందుతూనే వుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles