దేశంలో కరోనా విజృంభన వేగంగా కోనసాగుతోంది. దేశంలో తొలి కరోనా కేసు నమోదైన జనవరి 30వ తేదీ నుంచి మొదలుకుని ఇవాళ్టికి 111 రోజులకు ఏకంగా కరోనా కేసులు లక్ష మార్కును దాటాయి. దీంతో యావత్ ప్రపంచలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన జాబితాలో 11వ దేశంగా భారత్ నిలవడం అందోళన రేకెత్తుతోంది. తొలి, రెండవ విడత లాక్ డౌన్ నేపథ్యంలో అత్యంత కనిష్టంగా నమోదైన కేసులు.. మూడో విడత లాక్ డౌన్ నుంచి వేగాన్ని అందుకున్నాయి. అయితే వలస కార్మకులు వారి స్వస్థలాలకు చేరడంతో ఈ కరోనా కేసుల్లో పెరుగుదల పమోదయ్యిందని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది.
76 రోజుల లాక్ డౌన్ సమయంలో కేవలం పది వేల మార్కుకు మాత్రమే చేరిన కరోనా కేసుల సంఖ్య ఆ తరువాత ఎనమిది రోజుల వ్యవధిలో 20 వేల మార్కును అందుకుంది. అనంతరం ఆరు రోజుల్లో 30 వేల మార్కు, ఆ తరువాత ఐదు రోజుల్లో నలభై వేల మార్క్, ఆనంతరం నాలుగు రోజుల్లో యాభై వేల మార్కు అందుకుంది. ఇక ఇక్కడి నుంచి 12 రోజుల వ్యవధిలో మరో యాభై వేల కసులను జత కలుపుకుని ఏకంగా లక్ష మార్కును దాటింది. చివరి రెండు రోజుల వ్యవధిలో పదివేల కేసులు నమోదయ్యాయి. దేశంలో ఏకంగా సగటున రోజుకు ఐదు వేల మందికి వైరస్ సోకుతుండటం అందోళన కలిగిస్తోంది.
ఇక గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా 4970 పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి, దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష మార్కు దాటాయి. లక్షా వెయ్యి 139 కేసులు నమోదయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో 137 మంది మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య కూడా 3163కు చేరుకుందని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ పర్కొంది. కరోనా వైరస్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో దేశప్రజల్లో అందోళన కలుగుతోంది. కరోనా నేపథ్యంలో మార్చి 25న దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే గత పన్నెండు రోజుల వ్యవధిలో ఏకంగా యాభై వేల కేసులు నమోదు కావడం కూడా అందోళన రేకెత్తిస్తోంది.
కాగా ఈ మహమ్మారి బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 39,174 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక వేలమంది మాత్రం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పోందుతున్నారు. గతకొన్ని రోజులుగా కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోండగా, రానున్న రోజుల్లో కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశాలు వున్నాయని నిపుణులు అంచనాలు ప్రజలను అందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 34.06 శాతం మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. కాగా, కరోనా ప్రభావం అధికంగా మహారాష్ట్ర, గుజరాత్ ల్లోనే నమోదు కావడం గమనార్హం.
దేశంలో కరోనావైరస్ బారిన పడి మరణించిన వారిలో అత్యదికులు మహారాష్ట్ర వాసులే కావడం గమనార్హం. మహారాష్ట్రలో మరణాల సంఖ్య ఏకంగా రెండు వేలకు చేరింది. నిన్న ఒక్కరోజే 2005 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 3453058 కేసులు నమోదు కాగా, నిన్న ఒక్కరోజునే రాస్ట్రంలో 51 మంది మరణించారు. దీంతో మొత్తంగా 1249 మంది అసువులుబాసారు. మహారాష్టలో నమోదైన కేసుల్లో అత్యధికంగా దేశ అర్థిక రాజధాని ముంబైలోనే నమోదయ్యాయి. గుజరాత్ నుంచి స్వస్థలాలకు వెళ్లున్న కార్మికుల్లో కరోనా బయటపడటంతో అందోళన కలుగిస్తోంది. ఇక గుజరాత్ లోనూ నిన్న ఒక్క రోజునే 366 కేసులు నమోదుకాగా, మొత్తం 11745 కేసులు నమోదు కాగా, 694 మంది కరోనాబారిన పడి మరణించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more