India reaches 81,970 Covid-19 cases దేశంలో 74 వేలు దాటిన కరోనా కేసులు.. 2649 మరణాలు

Coronavirus update covid 19 cases in india reaches 81 970

coronavirus in india, coronavirus, covid-19, corona spread, Coronavirus, COVID-19, Coronavirus news, section 144 coronavirus, coronavirus news, coronavirus maharashtra, coronavirus updates, coronavirus in maharashtra, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

India witnessed its biggest jump in Coronavirus-linked cases today, with 3967 people testing positive for COVID-19 in the last 24 hours, government data showed. Positive cases tally reaches to 81970 people have tested positive for coronavirus and 2649 have died due to the virus.

ITEMVIDEOS: దేశవ్యాప్తంగా 82 వేల దాటిన కరోనా కేసులు.. 2649 మరణాలు

Posted: 05/15/2020 02:32 PM IST
Coronavirus update covid 19 cases in india reaches 81 970

దేశంలో కరోనా విజృంభన వేగంగా కోనసాగుతోంది. పలు సడలింపులతో మూడవ విడత లాక్ డౌన్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ప్రతీరోజు మూడువేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి, ఈ నేపథ్యంలో దేశంలో నాలుగో విడత లాక్ డౌన్ కూడా కొనసాగుతుందని ప్రధాని స్పష్టం చేశారు. అయితే అది కొత్త రూపంలో వుంటుందని, ప్రజలందరూ సామాజిక దూరం పాటిస్తూ.. మాస్కులు ధరించాలని కూడా సూచించారు. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా 3967 పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి, దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 82 వేల మార్కుకు చేరింది. ప్రతీరోజు మూడు వేల కేసులు నమోదు అవుతుండటం దేశప్రజలను అందోళనకు గురిచేస్తోంది.

ఎలాంటి సడలింపులు లేకుండా కఠినంగా లాక్ డౌన్ అమలు చేసిన సందర్భంగా రెండో విడత వరకు రోజుకు వెయి మందికి అటుఇటుగా నమోదైన కేసుల సంఖ్య సడలింపులతో కూడా మూడో విడత లాక్ డౌన్ అమల్లోకి రాగానే కేసులు సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో మూడు వేల 967 పాజిటివ్ కేసులతో దేశవ్యాప్తంగా మొత్తం 81 వేల 970 మందిని ఈ మహమ్మరి తన ప్రభావానికి గురిచేసింది. ఇక కరోనా వైరస్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో మొత్తం మరణాల సంఖ్య 2649కు చేరింది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో 100 మరణాలు సంభవించాయి.

దీంతో వైరస్‌ బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 27,919 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక 51,401 మంది మాత్రం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పోందుతున్నారు. గతకొన్ని రోజులుగా కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోండగా, రానున్న రోజుల్లో కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశాలు వున్నాయని నిపుణులు అంచనాలు ప్రజలను అందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 34.06 శాతం మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. కాగా, కరోనా ప్రభావం అధికంగా మహారాష్ట్ర, గుజరాత్ ల్లోనే నమోదు కావడం గమనార్హం.

దేశంలో కరోనావైరస్ బారిన పడి మరణించిన వారిలో అత్యదికులు మహారాష్ట్ర వాసులే కావడం గమనార్హం. మరణాల్లో 44 మహారాష్ట్ర, 20 గుజరాత్, 9 ఢిల్లీ, 8 పశ్చిమ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ లలో ఐదు చప్పున, రాజస్థాన్ లో నాలుగు, తమిళనాడు, కర్ణాటకలో ఇద్దరు చోప్పున ఒకరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు వున్నారు. ఇక మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ రాష్ట్రంలో కరోనా కేసులు ఏకంగా 24 వేల మార్కును దాటాయి. కాగా మొత్తంగా మరణాల సంఖ్య కూడా 1019కి చేరాయి.

నిన్న ఒక్కరోజే 1495 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఏకంగా 54 మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 27524 కేసులు నమోదు కాగా, మొత్తంగా 1019 మంది అసువులుబాసారు. మహారాష్టలో నమోదైన కేసుల్లో అత్యధికంగా దేశ అర్థిక రాజధాని ముంబైలోనే నమోదయ్యాయి. గుజరాత్ నుంచి స్వస్థలాలకు వెళ్లున్న కార్మికుల్లో కరోనా బయటపడటంతో అందోళన కలుగిస్తోంది. ఇక గుజరాత్ లోనూ గడిచిన 24 గంటల్లోనూ 364 కేసులు నమోదుకాగా, 29 మరణాలు నమోదయ్యాయి, దీంతో గుజారాత్ లో ఇప్పటి వరకు మొత్తం 9591 కేసులు నమోదు కాగా, 586 మంది కరోనాబారిన పడి మరణించారు.

మహారాష్ట్ర, గుజారాత్ రాష్ట్రాల తరువాత తమిళనాడులోనూ పెద్ద సంఖ్యలోనే కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో ఏకంగా 509 కరోనా కేసులు నమోదుకాగా, 3 మరణాలు సంభవించాయి, దీంతో తమిళనాడులో మొత్తం కేసులు సంఖ్య 9674కు చేరగా, 66 మరణాలు సంభవించాయి. ఆ తరువాత దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. గడిచిన 24 గంటల్ల 359 కేసులు నమోదు కాగా, 20 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం కరోనా కేసులు 8470కు చేరగా, 115 మరణాలు నమోదయ్యాయి, ఆ తరువాత రాజస్థాన్ లో 4534 కేసులు నమోదు కాగా మొత్తం 125 మరణాలు సంభవించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles